logo

వైకాపాకు గుంటూరు డిప్యూటీ మేయర్‌ సజీల రాజీనామా

వైకాపాకు రాజీనామా చేసినట్లు గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ షేక్‌ సజీల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 01 May 2024 05:29 IST

పట్నంబజారు(గుంటూరు), పట్టాభిపురం: వైకాపాకు రాజీనామా చేసినట్లు గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ షేక్‌ సజీల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తనతోపాటు తన తండ్రి, మాజీ కార్పొరేటర్‌ షేక్‌ షౌకత్‌ సైతం ఆపార్టీకి రాజీనామా చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈమేరకు తమ రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి పంపినట్లు చెప్పారు.

నేడు తెదేపాలో చేరిక: షేక్‌ షౌకత్‌, షేక్‌ సజీల గుంటూరు ప్రజాగళం సభలో చంద్రబాబు  సమక్షంలో బుధవారం తెదేపాలో చేరనున్నారు. తెదేపా ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ మంగళవారం మాయాబజార్‌లోని షౌకత్‌ కార్యాలయానికి వెళ్లి సంప్రదింపులు జరిపారు. తెదేపాలోకి రావాలని సాదరంగా ఆహ్వానించారు. వైకాపా విధి, విధానాలు, జగన్‌ పాలన పట్ల విసిగిపోయామని, తెదేపాలో చేరాలని నిర్ణయించుకున్నామని షౌకత్‌ ఆయనకు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని