అరాచక మూకలను ఓడించండి!
‘తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ హయాంలో ఇక్కడ గతంలో ఎన్నడూ లేని అరాచకాలు జరిగాయి. సరెండర్ అవకుంటే మీ ఇంట్లో మద్యం, గంజాయి, డ్రగ్స్ పెట్టించి అరెస్ట్ చేస్తామంటూ బెదిరించే పరిస్థితులు నెలకొన్నాయి. ప్లాట్లు వేయాలన్నా, అపార్ట్మెంట్లు కట్టాలన్నా కప్పం కట్టాల్సిన స్థితి నెలకొంది.
అత్యధిక మెజారిటీ ఆంధ్రాప్యారిస్దే కావాలి
తెనాలి సభలో చంద్రబాబు పిలుపు
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే, తెనాలి టౌన్, కొత్తపేట
ప్రసంగిస్తున్న చంద్రబాబు, పక్కనే పెమ్మసాని, మనోహర్, ఆలపాటి
‘తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ హయాంలో ఇక్కడ గతంలో ఎన్నడూ లేని అరాచకాలు జరిగాయి. సరెండర్ అవకుంటే మీ ఇంట్లో మద్యం, గంజాయి, డ్రగ్స్ పెట్టించి అరెస్ట్ చేస్తామంటూ బెదిరించే పరిస్థితులు నెలకొన్నాయి. ప్లాట్లు వేయాలన్నా, అపార్ట్మెంట్లు కట్టాలన్నా కప్పం కట్టాల్సిన స్థితి నెలకొంది. ఈ ఎమ్మెల్యేనే మళ్లీ గెలిపిస్తే శివకుమార్ టాక్స్ను చట్టబద్ధం చేస్తారని’ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తెనాలిలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ‘పేదలకు ఇళ్ల స్థలాల పేరిట రూ.80 కోట్లు దోచేశారు. వ్యాపారుల వద్దకు రౌడీలను పంపి వసూళ్లు చేస్తున్నారు. ఆర్యవైశ్య కౌన్సిలర్ యుగంధర్పై దాడి చేశారు. అతి చేయవద్దు ఖబడ్దార్, తాట తీస్తాం’ అంటూ చంద్రబాబు హెచ్చరించారు.
సభకు భారీగా హాజరైన జనం
మనకొద్దీ స్వాతిముత్యం..
‘ఇక్కడి నుంచి వందల కొద్దీ లారీలు బయటకు వెళుతూ ఉంటే వాటిని మేము సోషల్ మీడియాలో పోస్టు చేశాం. ఇంతటి ఘనుడైన ఈ ఎమ్మెల్యే మన సైకో ముఖ్యమంత్రికి స్వాతిముత్యం అంటా, మనకీ స్వాతిముత్యం అవసరమా? తమ్ముళ్లూ అంటూ’ ప్రశ్నించగా వారు లేదంటూ కేకలు వేశారు. ‘ఆంధ్రాప్యారిస్ తెనాలికి గతంలో చాలాసార్లు వచ్చాను. కానీ ఈ మారు మీలో ఉత్సాహం, వైకాపాను ఇంటికి పంపాలన్న కసి కనిపిస్తోంది, తెనాలి రాజధానిలో ఒక భాగం, రాజధాని అభివృద్ధి చెంది ఉంటే ఇక్కడా అభివృద్ధి జరిగేది, వైకాపా పాలనలో అది దూరం అయింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేరుకు తగిన ప్రగతి సాధిస్తుందని మాట ఇస్తున్నా’నన్నారు. ‘ఆంధ్రా ప్యారిస్ ప్రజలు తెలివైనవారు అన్న నానుడి ఉంది. మీరు ఆలోచన చేసి ప్రగతికి ఓటు వేయాలని, రాష్ట్రంలో ఇక్కడి మెజారిటీ నంబర్ వన్’ కావాలన్నారు. ‘పొత్తులో భాగంగా తెనాలిని జనసేనకు కేటాయించాల్సి వచ్చినప్పుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్కు విషయం చెబితే మీ ఇష్టమని తొలిగా చెప్పారు. త్యాగానికి ఆయన ముందుకు వచ్చా’రన్నారు. ‘గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడే బుర్రిపాలెంలో పుట్టారు. అమెరికా వెళ్లి రాణించారు. తెలుగువారి సత్తా చాటారు. ఆయన తన జన్మభూమికి ఏమైనా మేలు చేయాలన్న సదాశయంతో రాజకీయాల్లోకి వచ్చారు. నాదెండ్ల మనోహర్ మంచి విజనరీ. వీరిని గెలిపించాలని’ కోరారు. ఆయన పిలుపు మేరకు సభికులు తమ చరవాణుల్లోని టార్చ్లను వెలిగించి మద్దతు తెలిపారు.
రోడ్షోలో చంద్రబాబు అభివాదం.. యువకుల ఉత్సాహం
ప్రజాగళానికి పోటెత్తిన జనం
తెలుగు తమ్ముళ్ల కోలాహలం.. జనసైనికుల సందడి.. కమలనాథుల కదనోత్సాహం మధ్య మంగళవారం సాయంత్రం ఆంధ్రా ప్యారిస్ తెనాలిలో ప్రజాగళం సభ దిగ్విజయమైంది. సభకు జనం పోటెత్తారు. అంతకుముందు జరిగిన రోడ్ షోకు అపూర్వ స్వాగతం లభించింది. దారిపొడవునా ప్రజలు వేలాదిగా బారులుతీరి రోడ్షోను తిలకించారు. హెలీప్యాడ్ నుంచి సభా స్థలికి చేరుకోవడానికి గంటన్నరకు పైగా పట్టింది. ఎటుచూసినా సభకు, రోడ్షోకు వచ్చిన వారితో రహదారులు కోలాహలంగా మారాయి. తెలుగు తమ్ముళ్ల కేరింతలతో తెనాలి పట్టణం దద్దరిల్లింది. కాబోయే సీఎం చంద్రబాబు అంటూ చేసిన నినాదాలు హోరెత్తాయి. తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ప్రజాగళం సభకు తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. సభకు వచ్చిన ప్రతి ఒక్కరిలో వైకాపా ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలన్న కసి కనిపిస్తోందని, కూటమి ప్రభుత్వం ఏర్పడడం తథ్యమని ఈ సభ సంకేతాలిస్తోందని బాబు అన్నప్పుడు సభికుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఓపెన్ టాప్ జీపులో తెదేపా అధినేత చంద్రబాబు, తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిలబడి అశేష జనానికి అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు. హెలీప్యాడ్ నుంచి పురవేదిక వరకు రోడ్డు పొడవునా వేల మంది జనం బారులుదీరారు. దీంతో సభ ప్రదేశం పురవేదిక వద్దకు చేరుకోవడానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది. జడ్పీఛైర్పర్సన్ హెనీ క్రిస్టినా, తెలుగు మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి, సుంకర హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మేము మీవెంటే..
నేడు గుంటూరులో చంద్రబాబు రోడ్షో, సభ
పట్టాభిపురం, న్యూస్టుడే: ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చంద్రబాబు గుంటూరులో రోడ్షో, ప్రజాగళం బహిరంగ సభ జరుగుతుంది. సాయంత్రం 5.50 గంటలకు గుంటూరు పశ్చిమలోని సాయిబాబా రోడ్డు జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి రోడ్ షో ప్రారంభిస్తారు. చంద్రమౌళీనగర్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నుంచి కొరిటెపాడు, లాడ్జి సెంటర్, శంకరవిలాస్ సెంటర్, ఓవర్బ్రిడ్జి, హిందూ కళాశాల సెంటర్ మీదుగా హిమని సెంటర్కు చేరుకుంటుంది. రాత్రి 7.15గంటలకు హిమని సెంటర్లో జరిగే ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు’
పసుపు దళం... మనదే జయం
జగన్ ఓ ఒంటరి జీవి..
- పెమ్మసాని చంద్రశేఖర్, తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి
జగన్మోహన్రెడ్డి ఒంటరి జీవి. ఆయనతో పయనమే ఒక శాపం. అందుకే ఇన్ని పార్టీలు ఉన్నా ఆయనతో కలవడానికి ఎవరూ ముందుకు రాలేదు. జగన్.. నేను ఒంటరిగా వస్తున్నాను. నేను సింహం అంటున్నారు. సింహం అయితే పచ్చని చెట్లను నరుక్కుంటూ పోలీసుల మాటున, పరదాల చాటున వస్తుందా? అలాగైతే ఆయన గుహలో ఉన్న సింహం కావచ్చు.జగన్మోహన్రెడ్డి కుటుంబం మొత్తం వదిలేసిన ఒంటరి జీవి. ఈ ఒంటరి జీవి రాజధాని కట్టలేరు. పోలవరం పూర్తి చేయలేరు. ఆయన జ్ఞాపకాలను వదిలించుకోవడానికి రాష్ట్రం ఎదురుచూస్తోంది.
వైకాపా విముక్త రాష్ట్రమే లక్ష్యం
- నాదెండ్ల మనోహర్, తెనాలి అసెంబ్లీ జనసేన అభ్యర్థి
రాష్ట్ర ప్రగతి, యువత భవిత కోసం తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో ఎటువంటి స్వార్థం లేదు. రిజర్వేషన్ల అంశాలతో సహా వైకాపా సోషల్ మీడియా వారు చేస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం. వైకాపా పాలనలో రాష్ట్రాన్ని దోచుకుంది. అన్ని వర్గాల వారినీ ఇబ్బంది పెట్టింది. ఇది మన కోసం మనం చేస్తున్న యుద్ధం. వైకాపా విముక్త రాష్ట్రం మనందరి లక్ష్యం కావాలి.
కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి
-ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రి, తెదేపా నేత
రాష్ట్రంలో అరాచక పాలన పోవాలన్నా, ఉచిత ఇసుక రావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యం.కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిట్ నివేదికపై ఈసీ ఆదేశాలు వస్తే ఏం చేద్దాం?.. సీఎస్తో డీజీపీ భేటీ
[ 21-05-2024]
రాష్ట్రంలో ఎన్నికల రోజు, అనంతరం జరిగిన హింసపై సిట్ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన నేపథ్యంలో సీఎస్ జవహర్రెడ్డితో డీజీపీ హరీశ్కుమార్ గుప్తా భేటీ అయ్యారు. -
కాలువ ఈ తీరు.. పారేది కన్నీరు
[ 21-05-2024]
మిగ్జాం తుపానుతో గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా పంట కాల్వల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో లక్షల ఎకరాల్లో చేతికి అంది వచ్చిన పంట నీటిపాలైంది. -
ముందే గుంతలు.. కళ్లకు గంతలు..
[ 21-05-2024]
గుంటూరు నగరంలోని ప్రధాన రహదారులు కనీస మరమ్మతులు లేక గుంతలమయంగా మారాయి. నగరపాలక సంస్థ ఎదురుగా ఈ పరిస్థితి ఉన్నా అధికారులకు కనిపించడం లేదు. -
బాధ చూడరు.. బాగు చేయరు..
[ 21-05-2024]
జీజీహెచ్ అత్యవసర కేంద్రం నుంచి ఇలా రోగులను స్ట్రెచర్ మీద తీసుకెళ్తున్నది సీటీ స్కాన్ కేంద్రానికి. -
వైకాపా నాయకులకు గుణపాఠం చెప్పాలి
[ 21-05-2024]
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ ఘటనలో మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి ప్రమేయంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని రాజధాని రైతులు డిమాండ్ చేశారు. -
ఇసుక తవ్వకాలు జరగకుండా 24 గంటలూ పర్యవేక్షణ
[ 21-05-2024]
నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరగకుండా 24 గంటలూ పర్యవేక్షించేలా బృందాలను ఏర్పాటు చేయాలని, నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి ఆదేశించారు. -
న్యాక్ గ్రేడ్కు నిరీక్షణ!
[ 21-05-2024]
వర్సిటీలో బోధన, పరిశోధన ఎలా జరుగుతుందో పరిశీలించి ఐదేళ్లకు ఒకసారి న్యాక్ సంస్థ విశ్వవిద్యాలయాలకు గ్రేడ్ కేటాయిస్తుంది. -
గుంటూరు పశ్చిమ పోస్టల్ బ్యాలట్ల గది మార్పు
[ 21-05-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ల గదిని అధికారులు ఎట్టకేలకు మార్చారు. ఈ నెల 19వ తేదీన ‘ఈనాడు’ లో ‘పోస్టల్ బ్యాలట్లకు భద్రత ఏది’... శీర్షికన ప్రచురితమైన కథనానికి ఎన్నికల అధికారుల్లో కదలిక వచ్చింది. -
జాతీయ సేవకుల కోసం
[ 21-05-2024]
జాతీయ స్థాయిలో సామాన్యులకు సేవలందించే ఆవకాశం సివిల్ సర్వీసెస్ ద్వారా కలుగుతుంది. ఈ నేపథ్యంలో తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్ వైపు ఆసక్తి చూపేందుకు అవసరమైన కృషి చేస్తున్నాయి గుంటూరులోని స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్(సన్), కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. -
తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుల దాడి
[ 21-05-2024]
పార్టీ మారాడనే కోపంతో తెదేపా కార్యకర్తపై క్రికెట్ బ్యాట్తో వైకాపా వర్గీయులు దాడి చేశారు. శావల్యాపురం మండలం కిష్ణాపురంలో సోమవారం రాత్రి ఇది జరిగింది. -
బాధితులు తెదేపా వారని.. ఇంత పక్షపాతమా?
[ 21-05-2024]
జిల్లాలోనూ సార్వత్రిక పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల్లోనే తెదేపా ఏజెంట్లను చితకబాదిన ఉదంతాలు ఆలస్యంగా వెలుగుజూస్తున్నాయి. పోలింగ్ కేంద్రంలో ఏ కొద్దిపాటి గొడవ జరిగినా అక్కడ ఉండే పీవో తన డైరీలో నమోదు చేయాలి. -
ఆ దారి.. మృత్యు వారధి
[ 21-05-2024]
కనిపించని సూచిక బోర్డులు.. ప్రమాదకర మలుపులు.. చోదకుల మితిమీరిన వేగం.. వాహనదారుల నిర్లక్ష్యం.. రోడ్డుపై నిలుపుతున్న వాహనాలు.. కారణం ఏదైనా.. వాడరేవు-పిడుగురాళ్ల జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలు నిండు ప్రాణాలను హరిస్తున్నాయి. -
గ్రానైట్ ముడిరాయి లారీల పట్టివేత
[ 21-05-2024]
గుంటూరు విజిలెన్స్ సీఐ శ్రీహరి తన బృందంతో సోమవారం బల్లికురవ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. -
గుండ్లకమ్మ చుట్టూ ఇసుక దొంగలే
[ 21-05-2024]
ఇసుక దొంగలకు దోచిపెట్టేందుకే గుండ్లకమ్మ నది అన్నట్లు పరిస్థితి ఉందని, అనుమతి లేని తవ్వకాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్ సీహెచ్.శ్రీధర్ అన్నారు. -
కొంతమంది పోలీసుల తీరుతోనే.. హింసాకాండ
[ 21-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈనెల 13వ తేదీ, తర్వాత రోజు పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ దర్యాప్తు బృందం విచారణ చేసింది. -
దేవుడి భూమి.. సమర్పయామి
[ 21-05-2024]
దేవుడికి సేవ చేయాల్సిన అర్చకులు ఆలయ భూమినే అమ్మేశారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని అమ్మేసి నిత్య కైంకర్యాలు నిలిపేశారు. వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్ అభ్యర్థన వెనక స్టార్ హీరో సతీమణి
-
ఏఐపై ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్ సీటీఓ సూచనలు
-
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?: కేటీఆర్
-
రత్న భాండాగారంపై మోదీ వ్యాఖ్యలు.. ధ్వజమెత్తిన స్టాలిన్
-
స్వాతీ మాలీవాల్ కేసులో బిభవ్ ముంబయికి తరలింపు
-
డీప్ఫేక్ ఫొటోలను గుర్తించండిలా.. వీడియో షేర్ చేసిన కేంద్రం