ప్రతిపక్షాలపై కక్ష.. పింఛనర్లకే శిక్ష
పింఛను సొమ్ము కోసం ఎవరూ సచివాలయాలకు రావొద్దని ఇళ్లకు వెళ్లి ఉద్యోగులు చెప్పడంపై పింఛనుదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడానికి సరిపడా సిబ్బంది లేరని సాకులు చెబుతోంది.
ఇళ్ల వద్ద పంపిణీకి సిబ్బంది లేరన్నారు
బ్యాంకులో వేశామని ఇంటికెళ్లి చెబుతున్నారు
ప్రభుత్వ తీరుపై లబ్ధిదారుల తీవ్ర అసహనం
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే, ప్రత్తిపాడు, తెనాలిటౌన్, జిల్లా పరిషత్, కాకుమాను
పింఛను సొమ్ము కోసం ఎవరూ సచివాలయాలకు రావొద్దని ఇళ్లకు వెళ్లి ఉద్యోగులు చెప్పడంపై పింఛనుదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడానికి సరిపడా సిబ్బంది లేరని సాకులు చెబుతోంది. మరి పింఛన్ల కోసం సచివాలయాలకు రావొద్దని అదే ఉద్యోగులతో ఎలా చెప్పిస్తోందని ప్రశ్నించారు. ఎన్నికల వేళ పండుటాకులతో జగన్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లను మాత్రమే ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయడంలో భాగస్వాములను చేయొద్దని ఈసీ చెప్పింది. సచివాలయ ఉద్యోగులను వెళ్లవద్దని చెప్పలేదు కదా అని కొందరు లబ్ధిదారులు గుర్తు చేసి ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పింఛన్దారులను లక్ష్యంగా చేసుకుని ఓట్ల రాజకీయాలు చేయడం సరికాదని వృద్ధులను మండుటెండలో బ్యాంకులకు పంపాలని తీసుకున్న ప్రభుత్వ నిర్ణయంపై గుర్రుమంటున్నారు. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో రుసుములు డ్రా చేసుకోవడానికి బ్యాంకులకు వెళ్లడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. కేవలం వైకాపా ప్రభుత్వం విపక్షాలపై నెపం వేయడానికే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అంతిమంగా లబ్ధిదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇకనైనా ఇలాంటి కుటిల రాజకీయాలకు తెరదీయవద్దని హితవు పలుకుతున్నారు.
ఇదీ తీరు...
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొందరు సచివాలయ ఉద్యోగులు మంగళవారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల కోసం సచివాలయాలరు రావొద్దని చెప్పించారు. మరికొన్నిచోట్ల సచివాలయాల ఆదేశాల మేరకు మైకు ప్రచారం నిర్వహించి లబ్ధిదారులను అప్రమత్తం చేశారు. కాకుమానులో ఇంటింటికీ వెళ్లగా చేబ్రోలులో మైకు ప్రచారం చేసి చెప్పారు. పొన్నూరులో కొన్ని గ్రామాల పరిధిలో ఉద్యోగులు ఇళ్లకు వెళ్లి చెప్పిరావడం కనిపించింది.
ఏప్రిల్ 1న పింఛను కోసం ఇబ్బందిపెట్టారిలా..
75 శాతానికిపైగా బ్యాంకు ఖాతాల్లోనే జమ
జిల్లా పరిధిలో బ్యాంకుల్లోనే 75 శాతం వరకు జమ చేయాల్సిన లబ్ధిదారులు ఉన్నారు. కేవలం ఇళ్లకు వెళ్లి అందించే పింఛన్దారుల సంఖ్య 25 శాతంలోపే ఉంటుంది. మంగళవారం పింఛన్దారుల ఖాతాలకు సరిపడా డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సచివాలయ ఉద్యోగులు ఆ మేరకు బ్యాంకులకు వెళ్లి జమ చేశారు. లబ్ధిదారులు వ్యయ, ప్రయాసలకోర్చి 2-3 కి.మీ దూరంలో ఉన్న బ్యాంకులకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవాల్సిన దుస్థితిని కల్పించిందని ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. పింఛన్ల పంపిణీని రాజకీయ కోణంలో చూడడం బాధాకరం. ఎండలో బ్యాంకులకు వెళ్లిన లబ్ధిదారులు ఎవరైనా కొద్దిసేపు కూడా అక్కడ వేచి ఉండలేని పరిస్థితి ఉంటుంది. సాధారణ ఖాతాదారులు కూర్చోవడానికే బ్యాంకుల్లో స్థలం ఉండదు. ఈ క్రమంలో ఎవరైనా ఎండల ధాటికి అస్వస్థతకు గురైతే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల వద్ద ప్రాథమిక చికిత్స చేసే పరిస్థితి ఉండదు. కొందరి పింఛన్లు వారికి ఉన్న రెండు, మూడు బ్యాంకు ఖాతాల్లో దేనికి ఆధార్ అనుసంధానమైంది? వారి పింఛన్ నగదు ఏ బ్యాంకులో జమైందో తెలుసుకోవాలన్నా సచివాలయాలకు రావాల్సిందే.
నేడు బ్యాంకులకు సెలవు...
మే 1న కార్మికుల దినోత్సవం కావడంతో బ్యాంకులకు సెలవు. 2న పింఛన్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. అదీ ఉదయం 10 నుంచి సా.4గంటల లోపే తీసుకోవాలి. ఎండలో వెళ్లేందుకు చాలా ప్రయాస పడాల్సి వస్తుంది. అక్కడ ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి.
మొత్తం సొమ్ము రూ.80.98కోట్లు
బ్యాంకులో వేసేది 1,98,731(మంది)
ఇళ్ల వద్ద పంపిణీ 61,258
ఇదేం పని నాయనా....?
- కె.శివగంగ, ఆర్ఆర్నగర్, తెనాలి
నాకు బ్యాంకు పాసు పుస్తకం ఉంది. అయితే నాకు చదవడం, రాయడం రాదు. ఇప్పుడు పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో వేస్తామని చెబుతున్నారు. నేను బ్యాంకుకు వెళ్లాలంటే ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్లాలి. బ్యాంకు ఖాతా వినియోగించి కూడా చాలా రోజులైంది. అది పని చేస్తుందో లేదో కూడా తెలియదు. మాలాంటి వారిని ఇలా ఇబ్బంది పెట్టే బదులు ఇంటి వద్దే పింఛను ఇవ్వొచ్చు కదా. ఇదేం పని నాయనా.
20 కి.మీ తిరిగి రావాలి
- వెంకటేశ్వరమ్మ, తుమ్మలపాలెం
పింఛను సొమ్ము బ్యాంకు ఖాతాలో వేస్తే నేను 20 కి.మీ దూరంలోని ప్రత్తిపాడుకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవాలి. ఏటీఎం కార్డు లేదు. ఎండలో ఆటోలో వెళ్లి వచ్చేందుకు రోడ్డు గుంతలుగా ఉందని ఆటో డ్రైవర్ రూ.400 అడుగుతున్నారు. బ్యాంకు ఖాతాలో డబ్బులు వేయడం, తీయడం ఇటీవల కాలంలో చేయలేదు. ఒకే రోజు డబ్బులు ఇస్తారో..లేదో తెలియదు. పదేళ్ల కిందట బ్యాంకు ఖాతా తెరిచాను. అప్పటి లాగా వేలిముద్రపడుతుందో లేదో తెలియదు. పడకపోతే ఎట్లా.? అని ఆందోళనగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
[ 21-05-2024]
పోలింగ్ రోజు, ఆ తర్వాత వైకాపా చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. -
ఏపీ ఎన్నికల్లో హింస.. 85 మంది నిందితులపై హిస్టరీ షీట్: డీజీపీ
[ 21-05-2024]
ఎన్నికల ముందు, తర్వాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచినట్టు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. -
సిట్ నివేదికపై ఈసీ ఆదేశాలు వస్తే ఏం చేద్దాం?.. సీఎస్తో డీజీపీ భేటీ
[ 21-05-2024]
రాష్ట్రంలో ఎన్నికల రోజు, అనంతరం జరిగిన హింసపై సిట్ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన నేపథ్యంలో సీఎస్ జవహర్రెడ్డితో డీజీపీ హరీశ్కుమార్ గుప్తా భేటీ అయ్యారు. -
కాలువ ఈ తీరు.. పారేది కన్నీరు
[ 21-05-2024]
మిగ్జాం తుపానుతో గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా పంట కాల్వల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో లక్షల ఎకరాల్లో చేతికి అంది వచ్చిన పంట నీటిపాలైంది. -
ముందే గుంతలు.. కళ్లకు గంతలు..
[ 21-05-2024]
గుంటూరు నగరంలోని ప్రధాన రహదారులు కనీస మరమ్మతులు లేక గుంతలమయంగా మారాయి. నగరపాలక సంస్థ ఎదురుగా ఈ పరిస్థితి ఉన్నా అధికారులకు కనిపించడం లేదు. -
బాధ చూడరు.. బాగు చేయరు..
[ 21-05-2024]
జీజీహెచ్ అత్యవసర కేంద్రం నుంచి ఇలా రోగులను స్ట్రెచర్ మీద తీసుకెళ్తున్నది సీటీ స్కాన్ కేంద్రానికి. -
వైకాపా నాయకులకు గుణపాఠం చెప్పాలి
[ 21-05-2024]
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ ఘటనలో మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి ప్రమేయంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని రాజధాని రైతులు డిమాండ్ చేశారు. -
ఇసుక తవ్వకాలు జరగకుండా 24 గంటలూ పర్యవేక్షణ
[ 21-05-2024]
నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరగకుండా 24 గంటలూ పర్యవేక్షించేలా బృందాలను ఏర్పాటు చేయాలని, నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి ఆదేశించారు. -
న్యాక్ గ్రేడ్కు నిరీక్షణ!
[ 21-05-2024]
వర్సిటీలో బోధన, పరిశోధన ఎలా జరుగుతుందో పరిశీలించి ఐదేళ్లకు ఒకసారి న్యాక్ సంస్థ విశ్వవిద్యాలయాలకు గ్రేడ్ కేటాయిస్తుంది. -
గుంటూరు పశ్చిమ పోస్టల్ బ్యాలట్ల గది మార్పు
[ 21-05-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ల గదిని అధికారులు ఎట్టకేలకు మార్చారు. ఈ నెల 19వ తేదీన ‘ఈనాడు’ లో ‘పోస్టల్ బ్యాలట్లకు భద్రత ఏది’... శీర్షికన ప్రచురితమైన కథనానికి ఎన్నికల అధికారుల్లో కదలిక వచ్చింది. -
జాతీయ సేవకుల కోసం
[ 21-05-2024]
జాతీయ స్థాయిలో సామాన్యులకు సేవలందించే ఆవకాశం సివిల్ సర్వీసెస్ ద్వారా కలుగుతుంది. ఈ నేపథ్యంలో తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్ వైపు ఆసక్తి చూపేందుకు అవసరమైన కృషి చేస్తున్నాయి గుంటూరులోని స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్(సన్), కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. -
తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుల దాడి
[ 21-05-2024]
పార్టీ మారాడనే కోపంతో తెదేపా కార్యకర్తపై క్రికెట్ బ్యాట్తో వైకాపా వర్గీయులు దాడి చేశారు. శావల్యాపురం మండలం కిష్ణాపురంలో సోమవారం రాత్రి ఇది జరిగింది. -
బాధితులు తెదేపా వారని.. ఇంత పక్షపాతమా?
[ 21-05-2024]
జిల్లాలోనూ సార్వత్రిక పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల్లోనే తెదేపా ఏజెంట్లను చితకబాదిన ఉదంతాలు ఆలస్యంగా వెలుగుజూస్తున్నాయి. పోలింగ్ కేంద్రంలో ఏ కొద్దిపాటి గొడవ జరిగినా అక్కడ ఉండే పీవో తన డైరీలో నమోదు చేయాలి. -
ఆ దారి.. మృత్యు వారధి
[ 21-05-2024]
కనిపించని సూచిక బోర్డులు.. ప్రమాదకర మలుపులు.. చోదకుల మితిమీరిన వేగం.. వాహనదారుల నిర్లక్ష్యం.. రోడ్డుపై నిలుపుతున్న వాహనాలు.. కారణం ఏదైనా.. వాడరేవు-పిడుగురాళ్ల జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలు నిండు ప్రాణాలను హరిస్తున్నాయి. -
గ్రానైట్ ముడిరాయి లారీల పట్టివేత
[ 21-05-2024]
గుంటూరు విజిలెన్స్ సీఐ శ్రీహరి తన బృందంతో సోమవారం బల్లికురవ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. -
గుండ్లకమ్మ చుట్టూ ఇసుక దొంగలే
[ 21-05-2024]
ఇసుక దొంగలకు దోచిపెట్టేందుకే గుండ్లకమ్మ నది అన్నట్లు పరిస్థితి ఉందని, అనుమతి లేని తవ్వకాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్ సీహెచ్.శ్రీధర్ అన్నారు. -
కొంతమంది పోలీసుల తీరుతోనే.. హింసాకాండ
[ 21-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈనెల 13వ తేదీ, తర్వాత రోజు పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ దర్యాప్తు బృందం విచారణ చేసింది. -
దేవుడి భూమి.. సమర్పయామి
[ 21-05-2024]
దేవుడికి సేవ చేయాల్సిన అర్చకులు ఆలయ భూమినే అమ్మేశారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని అమ్మేసి నిత్య కైంకర్యాలు నిలిపేశారు. వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వ్యాను ప్రమాదం.. కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరిగా మిగిలి!
-
ఆ వాయిస్ నాదే.. చాట్జీపీటీకి హాలీవుడ్ నటి లీగల్ నోటీసు
-
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
-
ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
ఏపీ ఎన్నికల్లో హింస.. 85 మంది నిందితులపై హిస్టరీ షీట్: డీజీపీ