తీరాన ప్రజాగళానికి సన్నద్ధం
2019 ఎన్నికల తరువాత చీరాలకు వస్తున్న చంద్రబాబు
భారీ జన సమీకరణకు తెలుగు తమ్ముళ్ల కసరత్తు
ఏర్పాట్లు పరిశీలిస్తున్న కొండయ్య, తెదేపా నాయకులు
చీరాల అర్బన్, న్యూస్టుడే : ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు బుధవారం చీరాలకు రానున్నారు. జాతీయ రహదారి సమీపాన చీరాల-వేటపాలెం బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రజాగళం విజయవంతం చేసేందుకు తెలుగు తమ్ముళ్లు భారీ ఏర్పాట్లు చేశారు. సభా వేదికపై 200 మంది అతిథులు కూర్చోవడానికి వీలుగా వేదికను, వేదికపై ఉన్నవారు స్పష్టంగా కనిపించేలా పలుచోట్ల ఎల్ఈడీ తెరలను అమర్చారు. హెలీప్యాడ్లో దిగిన వెంటనే సభకు చేరుకునే విధంగా గ్రావెల్తో రహదారి నిర్మించారు. చీరాల నియోజకవర్గంతో పాటు బాపట్ల పార్లమెంటు పరిధిలోని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2019 ఎన్నికల తరువాత చంద్రబాబు చీరాలలో సభ నిర్వహించడం ఇదే తొలిసారి. గతంలో రెండుసార్లు జిల్లా కేంద్రానికి వచ్చినా ఆయన ఇక్కడకు రాలేదు. దాదాపు అయిదేళ్ల తరువాత రావడంతో అధిక సంఖ్యలో ప్రజలు సభకు వచ్చే అవకాశం ఉందని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా దాదాపు అర కిలోమీటరు దూరం వరకు పార్టీ జెండాలతో పాటు స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారికి ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా ఉండేలా బాపట్ల వైపు నుంచి వచ్చే వాహనాలు వాడరేవు రోడ్డుకు, వేటపాలెం వైపు నుంచే వచ్చే వాటిని రామాపురం వెళ్లే దారిలోకి మళ్లించనున్నారు. పట్టణంలోని వచ్చే వాహనాలను కూడా ఆయా ప్రాంతాల్లోకి మళ్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సభకు హాజరైన వారికి ఎటువంటి ఇబ్బందుల్లేకుండా భోజనం, తాగునీరు, మజ్జిగ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీ అభ్యర్థి ఎంఎం కొండయ్యతో పాటు పలువురు నాయకులు దగ్గర ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సభకు తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావాలని కొండయ్య విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు సభావేదిక వద్దకు హెలీకాప్టర్ ద్వారా చేరుకుంటారు. సభానంతరం తిరిగి అయిదున్నర గంటలకు గుంటూరులో జరిగే ప్రజాగళం సభకు వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు.
సిద్ధమవుతున్న సభా వేదిక
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
[ 20-05-2024]
పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మలికా గార్గ్ బాధ్యతలు స్వీకరించారు. జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడటమే తన మొదటి లక్ష్యమన్నారు. -
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం
[ 20-05-2024]
రాష్ట్రంలో మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం తెలిపింది. -
జల్లెడ పడుతున్నారు!
[ 20-05-2024]
ఎన్నికల సంఘం నియమించిన సిట్ బృందం జిల్లాలో విస్తృత పర్యటనలు చేస్తోంది. శనివారం నరసరావుపేట, కారంపూడి వచ్చిన బృందాలు, ఆదివారం దాచేపల్లి, మాచర్లలో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. -
అరాచక శక్తులను అణిచేస్తేనే..
[ 20-05-2024]
జిల్లాకు మూడో ఎస్పీగా వస్తున్న మలికా గార్గ్కు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయంలో జరిగిన హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. -
తెలంగాణ మద్యం స్వాధీనం
[ 20-05-2024]
అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈఘటన ఆదివారం చీరాలలో వెలుగు చూసింది. -
అదును దాటుతున్నా.. విత్తే దారేది?
[ 20-05-2024]
సీజన్లో రైతులకు విత్తనాలు సకాలంలో అందించి ఇబ్బందులు లేకుండా చూస్తామని వ్యవసాయశాఖ ఘనంగా ప్రకటిస్తుంది. -
అడిగినవి ఇవ్వరంట.. పనులు పూర్తి చేయాలంట
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్ష అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు
[ 20-05-2024]
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలోని మహ్మదాపూర్ గ్రామంలో వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. -
ప్రకృతి సొగసు ప్రోత్సహిస్తూ.. పస్తులుంటున్నారు?
[ 20-05-2024]
వారంతా రైతులే. చేస్తోంది వ్యవసాయమే. ఓ అడుగు ముందుకేసి వ్యవసాయం చేస్తూనే.. మరోవైపు మరికొందరిని ఆ విధానంలోకి తీసుకొచ్చేందుకు ప్రోత్సహిస్తుంటారు. -
గంజాయి మత్తు.. ప్రజలకు విపత్తు
[ 20-05-2024]
నగరంలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. గత ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నగరంలో కాలినడకన పర్యటించిన సమయంలో పాతగుంటూరులోని ఓ పాత ఇంటిని అడ్డాగా చేసుకొని గంజాయి తాగుతున్నారని ఫిర్యాదు -
అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొన్న బస్సు
[ 20-05-2024]
ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మంగళగిరి గ్రామీణ పోలీసుల కథనం ప్రకారం. -
‘పైపెచ్చు’ పఠనమూ ప్రమాదమే!
[ 20-05-2024]
గుంటూరులో 1954లో స్థాపించిన ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం పూర్తిగా శిథిలమై ప్రమాదకరంగా మారింది. ఇక్కడ 1.5లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. -
గుంటూరు నుంచి గుజరాత్.. వయా జహీరాబాద్!
[ 20-05-2024]
బస్తాల ప్యాకింగ్ మార్చి గుంటూరు నుంచి గుజరాత్కు జహీరాబాద్ మీదుగా అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్-2 హైదరాబాద్ అధికారులు పట్టుకున్నారు. -
అడిగినవి ఇవ్వకుండా.. పనుల పూర్తి ఎలా?
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్షా అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
ఓట్ల లెక్కింపునకు భద్రత కట్టుదిట్టం
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించి జూన్ 4న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. -
ఓటులో పోటీ.. స్ఫూర్తిలో మేటి
[ 20-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే గీటురాయి. తమకు ప్రసాదించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న కసి ప్రతి ఒక్కరిలో కనిపించింది. గతంతో పోల్చితే ఈసారి ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది.
తాజా వార్తలు (Latest News)
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
-
కిర్గిజ్స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా
-
విశాఖ ఘటనపై చర్యలు తీసుకోండి: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ
-
రైసీ దుర్మరణం.. సంతాప దినం ప్రకటించిన భారత్
-
విమాన సర్వీసు రద్దు.. రేణిగుంట ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన