ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది.
అవయవాలపై మద్యం దెబ్బ
పెరుగుతున్న బాధితులు
ఈనాడు-అమరావతి, న్యూస్టుడే, సత్తెనపల్లి, గురజాల
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. సర్కారీ మద్యం తాగి అనారోగ్యంపాలై ఎన్నో నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. దుకాణాల్లో నాసిరకం బ్రాండ్లు పెట్టి మద్యం ప్రియులను ఆర్థికంగా దోచుకోవటమే కాదు.. చివరకు వారి ఆరోగ్యాలను పణంగా పెట్టింది. బాధిత కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కుని కోల్పోయి బజారునపడ్డాయి. మండల కేంద్రం ఫిరంగిపురంలో గత మూడు, నాలుగేళ్లలో సుమారు 10 మంది చనిపోయారు. వారిలో ముగ్గురు మద్యానికి బానిసలై అది కొనుగోలు చేసి తాగే ఆర్థికస్థోమత లేక కరోనా మహమ్మారి వేళ చివరకు శానిటైజర్ తాగి చనిపోయారు. ఇక్కడ సంభవించిన మద్యం మరణాల్లో అత్యధికులు ఎస్సీలే ఉన్నారు. ఇలా ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా మరణాలు పెద్దఎత్తున సంభవించినా సర్కారు మాత్రం వారు చనిపోవటానికి అనేక కారణాలు ఉన్నాయంటూ తప్పించుకుంటోంది.
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆమె పేరు మేరీ. మండల కేంద్రం ఫిరంగిపురం నివాసి. భర్త తెనాలి బాలస్వామి(40) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. మద్యం తాగి మూడేళ్ల క్రితం చనిపోగా కుటుంబ పోషణ భారం మేరీపై పడింది. సొంతిల్లు లేదు. బాలస్వామికి భార్య మేరీతో పాటు ముగ్గురు సంతానం. ఆ పిల్లల్లో ఒకరు మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన మరణంతో కుటుంబ పోషణకు ముగ్గురు పిల్లలతో పాటు భార్య మేరీ బేల్దారీ పనులకు వెళుతున్నారు. పనికెళితేనే వారికి కుటుంబం గడుస్తుంది. పిల్లల్ని చదివించే స్థోమత లేక తన వెంటే బేల్దారీ పనులకు తీసుకెళుతున్నాని మేరీ పేర్కొంది. మానసిక వ్యాధితో బాధపడే పిల్లవాడిని ఇంటి వద్ద ఉంచుదామంటే ఆలనాపాలనా చూసేవారు లేరని చెప్పి తన వెంటనే పనికి తీసుకెళుతున్నానని వాపోయింది. తన భర్త చనిపోయి మూడేళ్లయినా సాయం అందలేదని పేర్కొంది.
స్థిరాస్తి వ్యాపారి కాలేయం పాడై..
సత్తెనపల్లి పట్టణంలోని ఓ వార్డుకు చెందిన రియల్ వ్యాపారికి మద్యం అలవాటు ఉంది. వ్యాపార ఒత్తిడి నేపథ్యంలో కొన్నాళ్లుగా ఆయన మద్యానికి తీవ్ర బానిసగా మారారు. అదే ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. జే బ్రాండ్ మద్యం క్రమేపి కోలుకోలేని విధంగా చేసింది. కుటుంబ సభ్యులు బలవంతం చేసి ఆసుపత్రికి తీసుకెళ్తే లివర్ పాడైనట్లు వైద్యులు చెప్పారు. మద్యం తాగడంతోనే లివర్ దెబ్బతిందని వైద్య పరీక్షల్లో తేలడంతో ఆయన కుమిలిపోయారు. జే బ్రాండ్ మద్యం జోలికి వెళ్లొద్దని తనకు తెలిసిన వారందరికి ఫోన్లుచేసి మరీ చెబుతున్నారు. ఆరోగ్యం కోసం రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు.
కాలేయం దెబ్బతిన్న కేసులే అధికం
మద్యంతో అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరుతున్న వారు కోకొల్లలు. ఒక్క గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోనే 2020 నుంచి 2023 వరకు నాలుగేళ్లలో 11,580 మంది చికిత్సలు పొందారు. గతంలో ఇంత పెద్దసంఖ్యలో చికిత్సలు పొందిన దాఖలాలు లేవని జీర్ణకోశ వ్యాధుల విభాగం వైద్యులు చెబుతున్నారు. వారానికి మూడు రోజుల ఓపీ ఉంటుందని ఆ వ్యవధిలో సుమారు 150 నుంచి 200 కేసులు వస్తాయి. వాటిల్లో మూడింతలు మద్యం తాగి కాలేయం, కిడ్నీలు, గుండె బలహీనపడటం, చూపు పోవటం, నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రుల గుమ్మం తొక్కుతున్నారు. ఇంత తీవ్రత గతంలో లేదని చెప్పారు. మద్యానికి బాగా బానిసలుగా మారినా.. నాసిరకం మద్యం తాగినా తొలుత జీర్ణకోశ వ్యాధుల బారిన పడతారు. ప్రధానంగా వారికి కాలేయం దెబ్బతింటుంది. చివరిగా క్లోమ గ్రంధి పాడైపోయి మరణాలకు దారితీస్తుంది. ఈ మధ్య అత్యధిక కేసులు ఇవే ఉంటున్నాయని వైద్యులు తెలిపారు.
ఆదర్శ రైతు.. కిడ్నీలుపాడై గడప దాటని స్థితిలో..
ముప్పాళ్ల మండలంలోని మాదల గ్రామానికి చెందిన 45 ఏళ్ల రైతు వ్యవసాయంలో మెరిక. తనకు ఉన్న ఎకరా పొలానికితోడు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని విభిన్న పంటలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలిచేవాడు. కష్టజీవిగా అతడికి మంచి పేరుంది. అలాంటి రైతుకు ఉన్న మద్యం దురలవాటు ఆరోగ్యాన్ని నాశనం చేసింది. రాత్రి మద్యం తాగితే మళ్లీ తెల్లారి నిద్ర లేవగానే తాగకపోతే శరీరం అదుపు తప్పినట్లు ఉండేదని ఆయన చెప్పుకోచ్చారు. అలా మద్యంతాగి తాగి ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్తే రకరకాల పరీక్షలు నిర్వహించి కిడ్నీలు పాడైనట్లు గుర్తించారు. మద్యం వ్యసనమే కిడ్నీలు పాడయ్యేందుకు కారణమైందని వైద్యులు తెలిపారు. వ్యవసాయంలో అప్పులకుతోడు ఆ రైతు వైద్య ఖర్చులు ఆ కుటుంబానికి భారమయ్యాయి. ఇంటి యజమాని కోసం ఆ కుటుంబం అప్పుసొప్పుచేసి సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు చేసింది. అయినా మళ్లీ హలంపట్టి సాగుకు కదిలే అవకాశం లేకుండాపోయిందని బాధపడుతున్నారు.
గత నాలుగేళ్లలో చికిత్సలు పొందిన వారి వివరాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే రెండో సంతకం: చంద్రబాబు
[ 01-05-2024]
రాష్ట్రాన్ని మాఫియాల రాజ్యంగా మార్చేశారని వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. -
గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించొద్దు: ఈసీకి కూటమి విజ్ఞప్తి
[ 01-05-2024]
గాజు గ్లాసు గుర్తుతో ప్రభావితం అయ్యే 13 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ గుర్తును జనసేనకు రిజర్వు చేయాలని కూటమి నేతలు మారోమారు ఈసీని కోరారు. -
పండుటాకులే ఎండగడతాయి జగన్!
[ 01-05-2024]
వెల్దుర్తి మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో వజ్రాలపాడు తండా, రామచంద్రాపురం తండా, సేవానాయక్ తండా, కొత్తపుల్లారెడ్డిగూడెం, దావుపల్లి తండాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 700 మంది వరకూ వృద్ధులున్నారు. -
కొలిక్కి రాని కుక్కర్ కూపన్ల కథ.. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి కోసం గాలింపు
[ 01-05-2024]
నందమూరినగర్లోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్లో పెద్ద మొత్తంలో పట్టుబడిన వైకాపా కుక్కర్ల కూపన్ల కేసు దర్యాప్తు ఇంకా కొలిక్కి రాలేదు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి వీటిని ఆర్డర్ ఇచ్చాడని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్ యజమాని గురుప్రసాద్ చెబుతున్నారు. -
అరాచక మూకలను ఓడించండి!
[ 01-05-2024]
‘తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ హయాంలో ఇక్కడ గతంలో ఎన్నడూ లేని అరాచకాలు జరిగాయి. సరెండర్ అవకుంటే మీ ఇంట్లో మద్యం, గంజాయి, డ్రగ్స్ పెట్టించి అరెస్ట్ చేస్తామంటూ బెదిరించే పరిస్థితులు నెలకొన్నాయి. ప్లాట్లు వేయాలన్నా, అపార్ట్మెంట్లు కట్టాలన్నా కప్పం కట్టాల్సిన స్థితి నెలకొంది. -
ప్రతిపక్షాలపై కక్ష.. పింఛనర్లకే శిక్ష
[ 01-05-2024]
పింఛను సొమ్ము కోసం ఎవరూ సచివాలయాలకు రావొద్దని ఇళ్లకు వెళ్లి ఉద్యోగులు చెప్పడంపై పింఛనుదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడానికి సరిపడా సిబ్బంది లేరని సాకులు చెబుతోంది. -
కార్మికలోకం కకావికలం
[ 01-05-2024]
అమరావతికి నేను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. మూడు ప్రాంతాల అభివృద్ధికి కనీసం 30వేల ఎకరాలు ఉండాలి. అమరావతిలోనే నేను ఇల్లు నిర్మించుకుంటున్నాను. ఇక్కడే ఉంటాను. తెదేపా కన్నా దీటుగా రాజధాని నిర్మిస్తాను. -
కరకట్టపై కక్ష...!
[ 01-05-2024]
అమరావతి అంటేనే పొడ గిట్టని సీఎం జగన్.. దానిని ధ్వంసం చేసేందుకు శక్తిమేర ప్రయత్నించారు. రాజధానికి వెళ్లేందుకు సరైన అనుసంధాన రహదారి లేకుండా చేశారు. కరకట్ట రోడ్డును విశాలంగా విస్తరిస్తానని శంకుస్థాపన సమయంలో మాట ఇచ్చి.. ఆనక మడమ తిప్పేశారు. -
‘మే’మూ కడతాం ఇసుకాసురులకు పా‘డే’
[ 01-05-2024]
పెదకూరపాడు నియోజకవర్గం అమరావతికి చెందిన రామాంజనేయులు భవన నిర్మాణ కార్మికుడు. 2019 వరకూ సొంతూరులోనే పనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లలతో హాయిగా కాలంగా వెళ్లదీశాడు. జగన్ అధికారంలోకి వచ్చాక ఇసుక కొరత సృష్టించడంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. -
తీరాన ప్రజాగళానికి సన్నద్ధం
[ 01-05-2024]
-
ఏకోపాధ్యాయ పాఠశాలలు.. దిగజారిన విద్యా ప్రమాణాలు
[ 01-05-2024]
రాష్ట్రంలో విద్యాప్రమాణాలు దిగజారకుండా చూస్తాం.. ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తామని పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీల అమలును విస్మరించారు. ఉపాధ్యాయ నియామకాల కోసం ఒక్క డీఎస్సీ కూడా వేయకుండానే అయిదేళ్ల పాలన పూర్తి చేశారు. -
‘జగన్ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’
[ 01-05-2024]
రాష్ట్రంలో ఫాసిస్ట్ పాలన కొనసాగిస్తున్న జగన్ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాల మహా సభ వ్యవస్థాపక అధ్యక్షుడు మెల్లెల వెంకట్రావు కోరారు. రిపబ్లికన్ పార్టీ మంగళగిరి అభ్యర్థి, న్యాయవాది గుర్రం రామారావుతో కలసి అమరావతి ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ..
[ 01-05-2024]
తెదేపా జాతీయ కార్యదర్శి, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ తరఫున ఆయన సతీమణి బ్రాహ్మణి మంగళవారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. -
‘వైకాపా పాలనలో ఛార్జీల బాదుడు’
[ 01-05-2024]
వైకాపా పాలనలో ప్రజలపై నిత్యావసర సరకులు, విద్యుత్తు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని కూటమి నాయకులు కోటేశ్వరరావు, కంతేటి బ్రహ్మయ్య ఆరోపించారు. -
శిడిమాను ఉత్సవం..భక్త సంబరం
[ 01-05-2024]
గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరులో జగన్మాత పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. దూరప్రాంతాల నుంచి వేలాది మంది తరలి రావడంతో గ్రామం కిక్కిరిసింది. -
కూటమి గెలుపు అభివృద్ధికి మలుపు
[ 01-05-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని తాడికొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థి తెనాలి శ్రావణ్కుమార్ పేర్కొన్నారు. మండలం కేంద్రంలోని రసూల్ పేట, కొత్తపేట, బీసీ కాలనీలో మంగళవారం తెదేపా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సప్లిమెంటరీ ఫీజుల చెల్లింపునకు మే 4 వరకు గడువు
[ 01-05-2024]
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు రుసుం చెల్లించేందుకు గడువు మే 4 వరకు ఉందని డీఈవో ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. -
వైకాపాకు గుంటూరు డిప్యూటీ మేయర్ సజీల రాజీనామా
[ 01-05-2024]
వైకాపాకు రాజీనామా చేసినట్లు గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆఫ్లైన్లోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష: టీఎస్పీఎస్సీ
-
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో ఇకపై సన్ నెక్స్ట్..
-
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
లైంగిక దౌర్జన్యం కేసు - తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి