logo

చెట్టును ఢీకొట్టిన ఆటో.. నలుగురికి గాయాలు

టో చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన  సోమవారం గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం చింతపల్లి పాడు గ్రామంలో  జరిగింది.

Published : 22 Apr 2024 11:24 IST

వట్టిచెరుకూరు : ఆటో చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన  సోమవారం గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం చింతపల్లి పాడు గ్రామంలో  జరిగింది. వట్టి చెరుకూరు మండలంలోని గారపాడు గ్రామానికి చెందిన కొంత మంది కూలీలు గుంటూరు నగరంలో  క్యాటరింగ్ పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని  తిరిగి స్వగ్రామానికి ఆటోలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని