మత్తులో ముంచారు.. మొత్తంగా దోచారు!
వైకాపా అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాల వద్ద సిబ్బందిగా ఉపాధ్యాయులను నియమించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని కొత్తకొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం బ్రాండ్లను పూర్తిగా ఆపేశారు.
జిల్లాలో గ్రామానికి నాలుగేసి బెల్టుషాపులు
తెలంగాణ నుంచి అక్రమ మద్యం రవాణా
సొమ్ము చేసుకున్న వైకాపా నేతలు
ఈనాడు డిజిటల్, నరసరావుపేట
‘‘మద్యంపై ఆదాయం అంటే.. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమే. మహిళలతో కన్నీరు పెట్టించే ఆదాయం వల్ల ఎవరికీ మేలు జరగదు. సమాజానికే నష్టం. పచ్చటి కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. మానవ సంబంధాలూ నాశనమవుతున్నాయి. నేను అధికారంలోకి రాగానే మూడు దశల్లో నిషేధం అమలు చేస్తా’’
ప్రతిపక్ష నేతగా జగన్ పలికిన పలుకులు
వైకాపా అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాల వద్ద సిబ్బందిగా ఉపాధ్యాయులను నియమించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని కొత్తకొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం బ్రాండ్లను పూర్తిగా ఆపేశారు. వైకాపా ప్రభుత్వంలో కనీవినీ ఎరుగని రకాలతో మద్యం ప్రియులకు నిషా ఎక్కించారు. తాగేవారికి నీరసం ఆవహించి కడుపునొప్పి, విరేచనాలు, కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చేలా చేశారు. మద్యం చుక్క గొంతులో పడనిదే లేవలేని స్థితికి తీసుకొచ్చారు. మందుబాబుల నుంచి డబ్బులు పిండుకోవడానికి ధరలు పెంచారు.
అక్రమ విక్రయాలతో రూ.కోట్లు..
జగన్ వచ్చాక మద్యం నిషేధం సంగతేమో కానీ వైకాపా నాయకులు మాత్రం కోటీశ్వరులయ్యారు. ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న బ్రాండ్లను నిలిపేయడం.. కొత్త బ్రాండ్ల పేరిట నాసిరకం మద్యం తీసుకురావడంతో స్థానిక వైకాపా నాయకుల పంట పండింది. ఇదే అదునుగా జిల్లాలో కొందరు ప్రజాప్రతినిధులు, ద్వితీయశ్రేణి వైకాపా నాయకులు తెలంగాణ మద్యం తెచ్చి బెల్టు షాపుల పేరిట వ్యాపారం ప్రారంభించారు. తెలంగాణ సరిహద్దుగా ఉండే ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అయితే సొంతంగా మద్యం తయారు చేసి అమ్మకాలు చేస్తూ రూ.కోట్లు గడించారు. ఇక్కడ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కూడా సదరు నేత మద్యమే దొరుకుతోంది. గురజాల, పెదకూరపాడు నియోజకవర్గాల్లో అయితే ఒక్కో గ్రామంలో నాలుగైదు బెల్టుషాపులు నడుపుతున్నారు. ఎంపీపీలు, సర్పంచులు, వైకాపా పార్టీ పదవులు అనుభవించే వారివే ఈ బెల్టు షాపులు. తెలంగాణ సరిహద్దు కావడంతో కృష్ణానదిలోంచి సరకు రవాణా చేసుకుంటారు. తెలంగాణలో పాత బ్రాండ్లే దొరుకుతాయి కాబట్టి వాటిని తీసుకొచ్చి అధిక ధరలకు ఇక్కడ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నా కూడా బెల్లంకొండ, క్రోసూరు, మాచవరం, దుర్గి మండలాల్లో ఇప్పటికీ బహిరంగంగానే బెల్టుషాపుల్లో మద్యం విక్రయిస్తున్నారు.
క్రోసూరులో బెల్టు షాపు
నాసిరకం మద్యం తాగుతూ కాలేయ సంబంధిత వ్యాధులతో వారానికి ఐదుగురు తమ ఆస్పత్రులకు వస్తున్నారని నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్టు చెబుతున్నారు. అంతేకాకుండా తాను ఏడాది కిందట చెన్నైలో పనిచేశానని అక్కడితో పోలిస్తే ఇక్కడ ఎక్కువమంది బాధితులు తన వద్దకు వస్తున్నారన్నారు. గతేడాది జూన్లో నరసరావుపేటకు చెందిన కొందరు పలుకుబడి డబ్బున్నవారు చికిత్స తీసుకుంటూ చనిపోయారని చెప్పారు.
జిల్లాలో గొలుసు దుకాణాలదే హవా. పేరుకే ప్రభుత్వ మద్యం దుకాణాలు. గతంలో మాదిరి కాకుండా దుకాణాలను ఆబ్కారీనే నిర్వహిస్తోంది. వీటి ప్రారంభ వేళ ఉపాధ్యాయులకు విధులు కేటాయించి వారితోనే విక్రయించారు. ఇప్పుడు ఎక్సైజ్, పొరుగుసేవల సిబ్బందిని నియమించారు. దుకాణాల వద్ద సీసీ కెమెరాలు, డిజిటల్ పేమెంట్లు లేవు. ప్రభుత్వ దుకాణాల నుంచి వైకాపా నాయకులు భారీగా మద్యం తీసుకెళ్లి పక్కనే గొలుసు దుకాణాలు పెట్టి అదనంగా బాదేస్తూ దోచేస్తున్నారు.
తాగనిదే నిద్ర పట్టదు
- కోటయ్య, ట్యాక్సీ డ్రైవర్, నరసరావుపేట
ఫైనాన్స్లో కారు కొనుగోలు చేశా. ఎవరికైనా బాడుగకు వెళ్లొస్తుంటాను. ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ వెళ్తుంటా. డ్యూటీ అయిపోయాక 90ఎంఎల్ వేసుకుని నిద్రపోవడం అలవాటు. అయితే జగన్ ప్రభుత్వం తెచ్చిన బ్రాండ్లు క్వార్టర్ తాగినా కిక్ రాకపోగా నిద్ర పట్టడం లేదు. తర్వాతి రోజు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
అనారోగ్యంతో మంచానికే పరిమితం
- నాగమ్మ, క్రోసూరు
మాకు ముగ్గురు ఆడపిల్లలు. మా ఆయనకు మొదటినుంచి తాగుడు అలవాటు ఉంది. అయితే ఇదివరకు ఎప్పుడూ ఇలా జబ్బుపడలేదు. ఒకప్పుడు కొద్దిగా తాగి బుద్ధిగా ఇంటికొచ్చి పడుకునేవాడు. తర్వాతి రోజు పనికి పోయేవాడు. కానీ ఇప్పుడు తాగితే అల్లరి చేస్తున్నాడు. సరిగా పనికి పోవడం లేదు. కడుపునొప్పి అంటే ఆస్పత్రిలో చూపిస్తే కాలేయం పూర్తిగా చెడిపోయిందన్నారు. ఇప్పుడు మాకు దిక్కుతోచడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ఎన్నికల ముందు తర్వాత హింసపై సిట్ ..ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం
[ 17-05-2024]
రాష్ట్రంలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. -
ఏపీలో ‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేసిన ఈసీ
[ 17-05-2024]
ఏపీలో ‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. -
హింసపై ఈసీకి సీఈవో నివేదిక.. కీలక నేతల అరెస్టులకు అవకాశం?
[ 17-05-2024]
ఎన్నికల అనంతరం జరిగిన హింసపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి నివేదిక పంపింది. -
వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: దేవినేని ఉమా
[ 17-05-2024]
వైకాపాకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. -
అజ్ఞాతంలోకి మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు
[ 17-05-2024]
గృహనిర్బంధంలో ఉన్న మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లారు. -
వైకాపా నేతల నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన సుధాకర్
[ 17-05-2024]
తెనాలి వైకాపా ఎమ్మెల్యే శివకుమార్ బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ శుక్రవారం గుంటూరు జిల్లా ఎస్పీని కలిశారు. -
ఏపీలో ఎన్నికల ముందు.. తర్వాత హింసపై సిట్ దర్యాప్తు
[ 17-05-2024]
రాష్ట్రంలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై ఏపీ ప్రభుత్వం సిట్ వేయనుంది. -
పంచాయతీలో పండ్ల వ్యాపారం
[ 17-05-2024]
వట్టిచెరుకూరు మండలంలోని కోరినపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం మామిడి పండ్లు అమ్మకానికి పెట్టారని ఆరోపణలు ఎదురవుతున్నాయి. -
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
[ 17-05-2024]
పల్నాడులో ఘర్షణలకు కారణమైన పిన్నెల్లి సోదరుల్ని జైలుకు పంపి శాంతి, భద్రతలు కాపాడాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. -
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
అత్తెసరు బోధన.. అరణ్య రోదన..
[ 17-05-2024]
జిల్లాలో 17 చోట్ల హైస్కూల్ ప్లస్ టూ బాలికల జూనియర్ కళాశాలలను ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రారంభించింది. -
తలొగ్గారని తప్పించారు
[ 17-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా 14 సమస్యాత్మక నియోజకవర్గాలుంటే అందులో నాలుగు పల్నాడు జిల్లాలో ఉన్నాయంటేనే ఆలోచించాలి. -
ఎన్నికల రుసుముల్లో కోత!
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు (పీఓ, ఏపీఓ), అదర్ పోలింగ్ ఆఫీసర్ల(ఓపీఓ)కు చెల్లించే రెమ్యునరేషన్లోనూ కొందరు రిటర్నింగ్ అధికారులు కోత విధించారు. -
మిగ్జాంతోనైనా కళ్లు తెరవరా?
[ 17-05-2024]
మిగ్జాం తుపానుతో గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా పంట కాల్వల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో లక్షల ఎకరాల్లో చేతికందొచ్చిన పంట నీటిపాలైంది. -
టిప్పర్ డీజిల్ ట్యాంకు పగలడం వల్లే బస్సు దహనం
[ 17-05-2024]
చిలకలూరిపేట మండలం పసుమర్రు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి అగ్నిమాపక అధికారులు పరిశీలన చేశారు. -
మార్కెట్ల తరలింపు ఎప్పుడో..?
[ 17-05-2024]
నగరాభివృద్ధి, సదుపాయాల కల్పన విషయంలో గత అయిదేళ్లుగా వైకాపా పాలకులు పట్టించుకున్నది లేదు. -
సర్పంచులకు నిధులు, విధులు లేకుండా చేసిన ప్రభుత్వం
[ 17-05-2024]
కేంద్రం నుంచి విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులు రూ.998.84 కోట్లను పంచాయతీలకు జమ చేయాలని ఏపీ పంచాయతీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు కోరారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాటు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆర్వోలకు సూచించారు. -
సర్పంచి ఇంటిపై వైకాపా రౌడీమూక దాడి
[ 17-05-2024]
బెల్లంకొండ మండలంలో వైకాపా రౌడీ మూక ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. -
అద్దంకి నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలి
[ 17-05-2024]
అద్దంకి నియోజకవర్గంలో ఈ నెల 13న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం దక్కలేదని నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పాణెం హనిమిరెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. -
18 మందిపై కేసుల నమోదు
[ 17-05-2024]
వట్టిచెరుకూరు మండలంలోని కారంపూడిపాడులో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనలపై 15న గ్రామంలోని 18 మందిపై డిప్యూటీ తహసీల్దారు డి.వెంకటరావు కేసులు నమోదు చేశారు. -
అందరికీ థాంక్స్.. సినీ కుటుంబ సభ్యుల ప్రేమ కదిలించింది: పవన్ లేఖ
[ 17-05-2024]
ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రాణించిన కేఎల్ రాహుల్-పూరన్.. ముంబయి లక్ష్యం 215
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
ఏపీలో ఎన్నికల ముందు తర్వాత హింసపై సిట్ ..ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విజయవాడ డివిజన్ పరిధిలో 14 రైళ్లు రద్దు