ఎస్సీ రైతులపై కపట ప్రేమ
రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ కింద అసైన్డ్ భూములిచ్చిన ఎస్సీలకు మూడేళ్లుగా కౌలు ఎగ్గొట్టారు. ఇందుకు సీఐడీ విచారణ అంటూ వంక పెట్టారు. వారిని ఆర్థికంగా చితికిపోయేలా చేశారు.
రాజధానిలో అసైన్డ్ భూములిచ్చిన వారికి కౌలు ఎగవేత
నాలుగేళ్లుగా నరకం చూపించిన జగన్
సీఐడీ విచారణ పేరుతో కక్ష సాధింపు
ఈనాడు-అమరావతి, న్యూస్టుడే-తుళ్లూరు
- సీఐడీ విచారణ పేరుతో 3,139 మంది ఎస్సీ రైతుల్లో 2,472 మందినే ప్రభుత్వం కౌలుకు అర్హులుగా గుర్తించింది. వీరికి కూడా కౌలు ఇవ్వడం లేదు.
- 1423 ఫసలీ, 1బి అడంగళ్లో నమోదైన వారినే అసలైన అసైన్డ్ రైతుల జాబితాలో చేర్చింది.
- ఆర్వోఆర్, రెవెన్యూ రికార్డుల్లో లేనివారి భూములను సరిపోలని జాబితాలో చేర్చింది. వీరెవరికీ కనీసం నోటీసులివ్వకపోవడం గమనార్హం.
నా ఎస్సీ.. నా ఎస్టీలు.. అంటూ నోటితో పలికే జగన్ మనసులో వారంతా ఓట్లు వేసే యంత్రాలు మాత్రమే..
ఏం చేసినా.. కిమ్మనని బడుగు జీవులుగానే పరిగణించిన ఆయన వారికి తీవ్ర అన్యాయం చేశారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ కింద అసైన్డ్ భూములిచ్చిన ఎస్సీలకు మూడేళ్లుగా కౌలు ఎగ్గొట్టారు. ఇందుకు సీఐడీ విచారణ అంటూ వంక పెట్టారు. వారిని ఆర్థికంగా చితికిపోయేలా చేశారు. అటు వ్యవసాయం లేక.. ఇటు కూలి పనులు దొరక్క వేల కుటుంబాలు పడుతున్న వేదన వర్ణనాతీతం. తాను అధికారంలోకొస్తే పట్టా రైతులతో సమానంగా మెరుగైన ప్యాకేజీ ఇస్తానని ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చిన జగన్ గద్దెనెక్కాక దాన్ని తుంగలో తొక్కేశారు. కనీసం వార్షిక కౌలును కూడా దక్కకుండా చేశారని జగన్ తీరుపై ఎస్సీ రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
విచారణ పేరుతో నిలిపేసి..
రాజధాని భూముల విషయంలో కుంభకోణం జరిగిందంటూ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు 2014-19 మధ్యకాలంలో జరిగిన అసైన్డ్ భూముల లావాదేవీలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో 2021 నుంచి అసైన్డ్ రైతులకు ప్రభుత్వం కౌలు ఇవ్వడం లేదు. రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ విధానంలో ఆరు విభాగాలకు చెందిన 3,139 మంది రైతులు 2,689.15 ఎకరాల అసైన్డ్ భూములిచ్చారు. దర్యాప్తు చాలావరకు పూర్తయినా.. సీఐడీ అధికారులు మళ్లీ దాన్ని తిరగదోడారు. క్లియరెన్స్ ఇచ్చిన వాటిని కూడా తిరిగి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదెప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. ఫలితంగా ఎస్సీ రైతులకు జీవనాధారం దూరమైంది. కౌలు ఎప్పుడు వేస్తారోనంటూ కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూడాల్సిన పరిస్థితి.
దుర్భరంగా మారిన జీవితాలు
ఎస్సీ రైతుల ఖాతాలకు 2021 నుంచి 2024 వరకు కౌలు జమ కాలేదు. పెరిగిన నిత్యావసరాల ధరలు, కరెంటు బిల్లులతో కుటుంబ పోషణ భారంగా మారింది. మరోపక్క రాజధాని నిర్మాణం నిలిచిపోవటంతో ఉపాధి లేదు. కొంతమంది పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్తుండగా.. మరికొందరు రోజువారీ అవసరాల కోసం ఉన్న వస్తువులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. చేసిన అప్పులపై వడ్డీ చెల్లించలేక సతమతమవుతున్నారు. అనారోగ్య సమస్యలున్నవారు మందులు కొనడానికి డబ్బుల్లేక యాతన పడుతున్నారు.
పెయింటింగ్ పనులకు వెళ్తున్నా...
- బేతు బెనర్జీ, ఎస్సీ కాలనీ, తుళ్లూరు
మాకున్న అరెకరా భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చాం. నాకు ముగ్గురాడపిల్లలు. ప్రైవేటు పాఠశాలలో చదివించలేక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాం. మాకు కౌలు నిలిపేసి నాలుగేళ్లవుతోంది. కుటుంబం గడవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఎండాకాలం కావటంతో వ్యవసాయ కూలీ పనులు కూడా లేవు. అర ఎకరా భూమి ఉందన్న కారణంతో మాకు భూమి లేని పేదలకిచ్చే పింఛను మంజూరు కాలేదు. టిడ్కో గృహం కూడా మంజూరు చేయలేదు. సొంతిల్లు లేక అద్దెకు ఉంటున్నాం. జీవనం కోసం పెయింటింగ్ పనులకు వెళ్తున్నా. ఇవీ రోజూ ఉండటం లేదు.
ఎలా బతకాలి?
- వీరయ్య, అసైన్డ్ రైతు, అనంతవరం
రాజధాని నిర్మాణానికి 96 సెంట్ల భూమిని నలుగురన్నదమ్ములం ఇచ్చాం. నాకు ఇద్దరు పిల్లలు. కుమార్తెకు వివాహమైంది. ప్రభుత్వం కౌలు చెల్లించకపోవటంతో కుటుంబం గడవడంలేదు. స్థానికంగా పనుల్లేక ఇటీవల వరకు పల్నాడు జిల్లాకు వెళ్లాం. ఎండాకాలంలో వ్యవసాయ పనుల్లేవు. ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయకపోవటంతో బీఈడీ చేసిన మా అబ్బాయిని కూడా నాతోపాటు కూలి పనులకు తీసుకెళ్తున్నా. ఉపాధి హామీ పనుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
[ 18-05-2024]
జగన్ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ కుమార్ తెలిపారు. -
సీసాల్లో పెట్రోలు, డీజిల్ నింపొద్దు: ఈసీ
[ 18-05-2024]
ఏపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పెట్రోలు బంకుల నిర్వాహకులకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. -
పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ
[ 18-05-2024]
పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేశ్ బాలాజీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
కనిపించని పోలింగ్ దస్త్రాలు?
[ 18-05-2024]
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. -
అక్రమం చూస్తారా... అడ్డుకట్ట వేస్తారా?
[ 18-05-2024]
కొల్లిపర మండల పరిధిలోని వల్లభాపురం, మున్నంగి, కొత్తపాలెం, బొమ్మువానిపాలెం, అన్నవరం తదితర గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులను సైతం గుత్తేదారులు లెక్కచేయడం లేదు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తూ టన్నుల కొద్దీ తరలిస్తున్నారు. -
వర్షం పలకరింపు.. పుడమి పులకరింపు
[ 18-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సీజన్ జూన్ నెల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి. మూడు నెలలుగా మండుటెండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వర్షం రాకతో ఉపశమనం కలిగింది. -
డైరీ, రిజిస్టర్లు ఏమయ్యాయి?
[ 18-05-2024]
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. -
వాడరేవులో రాష్ట్ర గవర్నర్
[ 18-05-2024]
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబంతో సహా చీరాల మండలం వాడరేవుకు శుక్రవారం వచ్చారు. స్థానిక ఐటీసీ అతిథి గృహంలో సేదతీరారు. -
తెలుగు పుస్తకంలో జిల్లా అంశాలు
[ 18-05-2024]
ఈ ఏడాది పదోతరగతి పుస్తకాలు పూర్తిగా మారిపోతున్నాయి. తెలుగు, హిందీ, పీఎస్, ఎన్ఎస్ ఒక్కొక్క పుస్తకం కాగా, గణితం రెండు, ఆంగ్లం మూడు, సాంఘిక శాస్త్రం నాలుగు పుస్తకాలు మొత్తం 13 పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. -
దయచేసి వినండి.. ధరలు అధికం
[ 18-05-2024]
గుంటూరు రైల్వే స్టేషన్లో దూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని గుత్తేదారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా మంచినీరు, బిస్కెట్లు, శీతల పానీయాల అమ్మకాల్లో గరిష్ఠ అమ్మకం ధర కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. -
ఉపాధి కల్పన జేడీ ఇంటిపై పెట్రోలు సీసాతో దాడి
[ 18-05-2024]
రాష్ట్ర ఉపాధి కల్పనశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీ)ఇంటిపై శుక్రవారం గుర్తుతెలియని దుండగులు పెట్రోలు సీసాతో దాడిచేసి ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, ఫిర్యాదుదారుల కథనం ప్రకారం.. రాష్ట్ర ఉపాధికల్పనశాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ (జేడీ) డి.చైతన్య గుంటూరు ఆకులవారితోటలో నివాసం ఉంటున్నారు. -
పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల వ్యాపారం
[ 18-05-2024]
వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామానికి చెందిన ఓ వైకాపా నాయకుడు తన మామిడి పండ్ల వ్యాపారానికి స్థానిక పంచాయతీ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకున్నారు. వర్షం కురుస్తుండడంతో ప్రధాన కూడలిలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల పెట్టెలను ఉంచి వ్యాపారం చేశారు. -
ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలి
[ 18-05-2024]
ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలని బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ పేర్కొన్నారు. దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియం రిటైర్డ్ ఎంప్లాయీస్ భవన్లో ప్రధానమంత్రి మోదీకి పంపుతున్న ఉత్తరాలను రాసి శుక్రవారం ప్రదర్శించారు. -
అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?
[ 18-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్జీటీ తీర్పును ఉల్లంఘిస్తూ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసినవారిపై దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రతి జిల్లాలో పోలీసులు, వివిధ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను ఆపే బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది. -
పట్టణాల్లోనూ ఓటరు పోటెత్తారు!
[ 18-05-2024]
సాధారణంగా పట్టణాల్లో నివసించేవారికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి గంటలకొద్దీ వేచి ఉండి ఓటేసే సహనం ఉండదు. అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చినవారు పట్టణాల్లో స్థిరపడతారు. ఎవరు ఓటేశారు? ఎవరు వేయలేదు? అనేది గ్రహించరని, తమను ఓటేయమని ఎవరూ అడగరని ఓటేయడానికి నిర్లక్ష్యం వహిస్తారు. -
ఈవీఎంల భద్రతపై సమావేశం
[ 18-05-2024]
జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎంల భద్రతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనా ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి సమావేశంలో పాల్గొన్నారు. -
ఎవరిపై వేటు పడుతుందో..
[ 18-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, మరుసటి రోజు చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు పలువురిపై వేటు వేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో విఫలమైన అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. -
కేసుల్లో ఇరికించి.. చితకబాదారు
[ 18-05-2024]
మాచవరం మండలంలో పోలింగ్ అనంతరం మరుసటి రోజు జరిగిన గొడవల్లో తమను పోలీసులు కేసులు ఇరికించారని, దారుణంగా కొట్టారని తెదేపా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 14న మాచవరం ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా గాయపరిచారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్కు రూ.10 లక్షల బురిడీ
[ 18-05-2024]
మాయ మాటలతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ను బోల్తా కొట్టించిన సైబర్ కేటుగాళ్లు అతని ఖాతా నుంచి రూ.10 లక్షలు స్వాహా చేశారు. పట్టణానికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్కు కొద్ది రోజుల కిందట ఒక ఫోన్ కాల్ వచ్చింది. -
ఎమ్మెల్యే అనుచరులు బెదిరించారు
[ 18-05-2024]
-
సినీ థియేటర్లను బతికించండి
[ 18-05-2024]
నిర్వహణ ఖర్చులు కూడా రాక సినీ థియేటర్లు క్రమంగా మూతపడుతున్నాయని, తెలంగాణలో ఇప్పటికే అ విషయాన్ని అధికారికంగా ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్లోనూ అదే తరహా పరిస్థితులు ఉన్నాయని సినీ దర్శకుడు, మా ఏపీ అధ్యక్షుడు దిలీప్రాజా పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్