Maheshwar Reddy: కులాలపై రేవంత్‌ వ్యాఖ్యలు ఆయన పర్సనల్‌: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

కులాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి చెప్పారు.

Published : 24 May 2022 15:40 IST

హైదరాబాద్‌: కులాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. రెడ్లు, వెలమలకు మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు. చొక్కారావు లాంటి నేతలు కాంగ్రెస్‌ కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పారు. అన్ని వర్గాలు, కులాలకు కాంగ్రెస్‌ పార్టీ ప్రాధాన్యమిస్తుందన్నారు. కాంగ్రెస్‌లో అన్ని కులాలకు చెందిన వారు అగ్రస్థానాలు అధిరోహించారని.. సామాజిక న్యాయం తమ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. రేవంత్‌రెడ్డి మాట్లాడింది ఆయన వ్యక్తిగతమైనదిగా భావిస్తున్నామని.. నిన్న మొన్న వచ్చిన వారికి కాంగ్రెస్‌ గురించి తెలియదని మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని