ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?

ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది.

Published : 08 May 2024 06:19 IST

ముమ్మిడివరం వైకాపా అభ్యర్థిని నిలదీసిన దళిత యువకుడు

తాళ్లరేవు, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం రాత్రి ఆయన తాళ్లరేవు మండలం పి.మల్లవరం పంచాయతీ మూలపొలంలో తనకు ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థిస్తుండగా.. స్థానిక దళిత యువకుడొకరు ఏ ముఖం పెట్టుకుని ఓట్లడిగేందుకు వచ్చారంటూ నిలదీశారు. మా గ్రామంలో ఒక్క కుళాయి అయినా వేయించారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు