నూర్‌బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం

నూర్‌బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్‌ బాషా నాయకులు నాగుల్‌మీరా, పీర్‌ మహ్మద్‌బుజ్జి, షేక్‌ సుభాని, నాగుల్‌ అన్నారు.

Published : 08 May 2024 06:19 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: నూర్‌బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్‌ బాషా నాయకులు నాగుల్‌మీరా, పీర్‌ మహ్మద్‌బుజ్జి, షేక్‌ సుభాని, నాగుల్‌ అన్నారు. జగన్‌రెడ్డి పాలనలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. వైకాపా నుంచి పలువురు నూర్‌బాషా నాయకులు మంగళవారం తెదేపాలో చేరారు. వారంతా కలిసి మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు