Hyderabad News: ముందైనా వెళ్లండి.. తర్వాతైనా రండి: హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
‘‘భాజపా ఆధ్వర్యంలో పరేడ్ మైదానంలో ఆదివారం జరగనున్న భారీ బహిరంగ సభ నేపథ్యంలో నగరంలో పలుప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నాం..
ప్రయాణికులు.. వాహనదారులకు సూచన
ఈనాడు, హైదరాబాద్: ‘‘భాజపా ఆధ్వర్యంలో పరేడ్ మైదానంలో ఆదివారం జరగనున్న భారీ బహిరంగ సభ నేపథ్యంలో నగరంలో పలుప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నాం.. ట్రాఫిక్ ఆంక్షల అమలుకు ముందైనా మీరు మీ గమ్యస్థానాలు చేరుకోండి.. లేదంటే బహిరంగ సభ పూర్తయ్యాక ఇళ్లకు రండి’’ అంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులను కోరారు. సికింద్రాబాద్లోని పరేడ్ మైదానం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నందున ఆయా మార్గాల్లో వెళ్లేందుకు అవకాశం ఉండదని ప్రత్యామ్నాయ మార్గాల్లోనే వెళ్లాలంటూ సంయుక్త కమిషనర్(ట్రాఫిక్) ఏవీ రంగనాథ్ తెలిపారు. అత్యవసర సమయాల్లో 040-27852482 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
* ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ కొనసాగుతాయి. ఎంజీరోడ్, ఆర్పీరోడ్, ఎస్డీరోడ్తో పాటు సికింద్రాబాద్ పరేడ్ మైదానం నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయి.
*హెచ్ఐసీసీ మాదాపూర్- జూబ్లీహిల్స్ చెక్పోస్ట్-రాజ్భవన్-పంజాగుట్ట-బేగంపేట విమానాశ్రయం- పరేడ్ మైదానం పరిసర ప్రాంతాల్లోనూ ఆంక్షలుంటాయి.
*టివోలీ క్రాస్రోడ్స్ నుంచి ప్లాజా రోడ్ మధ్య రహదారి మూసివేస్తారు. సికింద్రాబాద్ పరిధిలో పలు జంక్షన్లలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశాలున్నాయి.
ట్రాఫిక్ మళ్లింపులు..
*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు రాకపోకలు కొనసాగించే ప్రయాణికులు.
* పంజాగుట్ట వైపు నుంచి ఖైరతాబాద్, ఆర్టీసీ క్రాస్రోడ్స్ మీదుగా చిలకలగూడ ప్లాట్ఫాం 10 ద్వారా వెళ్లాలి.
*ఉప్పల్ వైపు నుంచి వచ్చే వారు నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్రోడ్స్, చిలకలగూడ నుంచి రైల్వేస్టేషన్ ప్లాట్ఫాం10 ద్వారా వెళ్లాలి.
* సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి వేర్వేరు ప్రాంతాలకు చేరుకునే వారు ప్యారడైజ్, బేగంపేట రహదారులపై ప్రయాణించకండి.
*కరీంనగర్, నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనదారులు బాహ్యవలయ రహదారి నుంచి నగరంలోకి ప్రవేశించాలి.
*ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా పంజాగుట్ట/అమీర్పేట వైపు వెళ్లే ప్రయాణికులు తార్నాక, రైల్ నిలయం కాకుండా ఆర్టీసీ క్రాస్రోడ్, అశోక్నగర్, హిమాయత్నగర్ లక్డీకాపూల్ మీదుగా వెళ్లాలి.
*మేడ్చల్, బాలానగర్, కార్ఖానా, తిరుమలగిరి నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే ప్రయాణికులు నేరెడ్మెట్, మల్కాజిగిరి నుంచి వెళ్లాలి.
*బహిరంగ సభ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం 2గంటలకు మొదలై.. రాత్రి 10గంటలకు పూర్తవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!