తక్కువ ధరకే ఐఫోన్లంటూ మోసం
విలువైన ఐఫోన్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులను తక్కువ ధరకు విక్రయిస్తామని ఇన్స్టాగ్రాంలో నకిలీ ప్రకటనలు పంపించి మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను తుకారాంగేట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
వివరాలు వెల్లడిస్తున్న నార్త్జోన్ డీసీపీ చందనదీప్తి, పక్కన అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ సుధీర్ తదితరులు
రెజిమెంటల్బజార్, న్యూస్టుడే: విలువైన ఐఫోన్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులను తక్కువ ధరకు విక్రయిస్తామని ఇన్స్టాగ్రాంలో నకిలీ ప్రకటనలు పంపించి మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను తుకారాంగేట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. నార్త్జోన్ డీసీపీ చందనదీప్తి బుధవారం అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ సుధీర్, ఇన్స్పెక్టర్లు ఎల్లప్ప, అంబటి ఆంజనేయులుతో కలిసి వివరాలు వెల్లడించారు. రాజస్థాన్వాసి ఫ్రాన్సిస్కో, పుణేవాసులు ధ్యానేశ్వర్, నీలేష్(24) ఉన్నత విద్య చదువుకున్నారు. వారికి పరిచయం ఉన్న మహారాష్ట్రకు విద్యార్థులు, ఉద్యోగ అన్వేషణలో ఉన్న సత్యం కల్యాణ్కుటే(20), వినోద్ పార్టే(22), అశుతోష్ తల్పే(23), ప్రతీక్(21), ఓంకార్ భల్చిమ్(21), గణేష్మనోహర్ హంబ్రే(21), మహేస్ బాగు చిమ్తే(21)లతో ముఠాగా ఏర్పడ్డారు. డబ్బు సంపాదనకు సైబర్ మోసాలను మార్గంగా ఎంచుకున్నారు. పలుమార్గాల్లో బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, స్కాన్లు, పేటీఎం ఖాతాలు సృష్టించారు. స్వీచ్ ఎలక్ట్రానిక్స్స్ అఫీషియల్ పేరుతో మొబైల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తామని ప్రకటనలు పంపి మోసాలకు పాల్పడుతున్నారు.
నిందితులు పట్టుబడిందిలా... : తుకారాంగేట్ ఠాణా పరిధిలోని ఓ మహిళ మే 29న ఇన్స్టాగ్రాంలో స్వీచ్ ఎలక్ట్రానిక్స్ అఫీషియల్ అనే ప్రొఫైల్లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విక్రయాల ప్రకటనలు చూసింది. ఆమె వివరాలు తెలుసుకుని దేవేందర్సింగ్ అనే పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేసి స్వీచ్ ఎలక్ట్రానిక్స్ అఫీషియల్ యజమాని అని చెప్పి మాట్లాడాడు. అతని మాటలు నమ్మి ఆమె లక్షన్నర ఫోన్ రూ.6,999/కు వస్తుందని నమ్మి పేటీఎంలో డబ్బులు పంపించింది. డెలివరీ ఛార్జీలు, జీఎస్టీ, కస్టమ్స్ పేర్లతో వివిధ రకాలుగా రూ.68,405 వసూలుచేశారు. తర్వాత ఫోన్ రాకపోవడంతో బాధితురాలు జూన్ 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులు పుణేలో ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం పుణేలో 8మందిని అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకొచ్చి విచారించారు. కంచన్బాగ్ ఠాణా పరిధిలోనై ఒకరిని మోసం చేసినట్లుగా గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 94 బ్యాంకు ఖాతాల వివరాలు, 51 ఏటీఎం కార్డులు, 4 ల్యాప్టాప్లు, 30సెల్ఫోన్లు, కార్డ్ స్వైపింగ్ మెషిన్ను స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్
[ 05-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అంకితభావంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. -
కలిసికట్టుగా ‘కొండా’ను గెలిపిద్దాం: భాజపా
[ 05-05-2024]
ప్రతి ఒక్కరు ఐక్యతగా పనిచేసి ఎంపీ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్రెడ్డి విజయానికి కృషిచేద్దామని ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు, భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశ్ పటేల్ అన్నారు. -
పాలమూరుకు జాతీయ హోదా ఎందుకివ్వలేదు?
[ 05-05-2024]
పాలమూరుకు నరేంద్ర మోదీ చుట్టంలా వస్తారు.. పోతారు.. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రాణం తీసిన.. ఫొటో సరదా..
[ 05-05-2024]
క్వారీ గుంతలో సరదాగా ఈత కొడుతూ ఫొటో దిగాలనే ప్రయత్నంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పో యాడు. ఈ ఘటన కీసర మండలం అంకిరెడ్డిపల్లి మహాలక్ష్మీ క్రషర్ క్వారీ గుంత వద్ద జరిగింది. -
ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు
[ 05-05-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులే కాదు.. అప్పుడప్పుడు పేర్లు కంగారు పెడుతుంటాయి. ఒకే పేరుతో ఇద్దరు పోటీ చేసేటప్పుడు మరింత ఎక్కువ ఆందోళన ఉంటుంది. -
శంషాబాద్లో చిక్కిన చిరుత అమ్రాబాద్కు తరలింపు
[ 05-05-2024]
శంషాబాద్ విమానాశ్రయంలో ట్రాప్ బోనులో చిక్కిన మగ చిరుతను శనివారం హైదరాబాద్ నెహ్రూ జూపార్కు అధికారులు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులోకి వదలి పెట్టారు. -
క్రిశాంక్ కస్టడీకి కోర్టు అనుమతి
[ 05-05-2024]
భారాస సామాజిక మాధ్యమ విభాగం కన్వీనర్ మన్నె క్రిశాంక్ను ఒకరోజు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ శనివారం నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు