Telangana News: కేంద్రం ఎందుకు ఇలా చేస్తోందో అర్థం కావట్లేదు: సీఎండీ ప్రభాకర్రావు
కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ను ఎక్స్ఛేంజ్లో కొనుగోలు చేయకుండా ఆదేశాలు ఇచ్చిందని ట్రాన్స్కో, జెన్కో
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ను ఎక్స్ఛేంజ్లో కొనుగోలు చేయకుండా ఆదేశాలు ఇచ్చిందని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఆదేశాల వల్ల 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఇవాళ డ్రా చేయలేకపోయామన్నారు. కేంద్రం ఇలా ఎందుకు వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. జనరేటర్, డిస్కంలకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఉంటుందని, ఇది వారి ఒప్పందంతో అమ్ముకోవచ్చని సీఎండీ పేర్కొన్నారు.
రూ.1,360కోట్లు విద్యుత్శాఖ చెల్లించినప్పటికీ ఇలా చేయడం చాలా బాధాకరమన్నారు. చెల్లింపులు చేసినా ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదన్నారు. పవర్ ఎక్స్ఛేంజ్పై ఇవాళ .. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి సమీక్ష నిర్వహించారని సీఎండీ తెలిపారు. ప్రజలకు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ సూచించారని వెల్లడించారు. రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో వర్షాలు బాగా పడటంతో జల విద్యుత్ను పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నామన్నారు. థర్మల్, హైడల్, సోలార్ పవర్ను అవకాశం ఉన్నంత వరకు ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇవాళ 12,214 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా ఎక్కడా కూడా సరఫరాకు అంతరాయం లేకుండా చేశామన్నారు. రైతన్నలు, ప్రజలు, వినియోగదారులు ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే సహకరించాలని సీఎండీ విజ్ఞప్తి చేశారు. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ ఇలా చేయడం బాధాకరమన్నారు. ఉదయం, సాయంత్రం ఎక్కువగా రైతులు పంపుసెట్లు ఆన్ చేస్తారు కాబట్టీ ఆసమయంలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని, అప్పటి వరకు రైతులు సహకరించాలని సీఎండీ విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM