నేర వార్తలు
నవమాసాలు మోసి కనిపెంచిన ఓ మహిళ తల్లి అనే పదానికే మాయని మచ్చలా మారింది. కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి డబ్బుకోసం కన్నబిడ్డను అమ్మేసింది.
‘అమ్మే’సింది!
వ్యభిచార ఊబిలోంచి తప్పించుకున్న బాలిక
హయత్నగర్, న్యూస్టుడే: నవమాసాలు మోసి కనిపెంచిన ఓ మహిళ తల్లి అనే పదానికే మాయని మచ్చలా మారింది. కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి డబ్బుకోసం కన్నబిడ్డను అమ్మేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఆ బాలిక(16)ను ఆమె తల్లి గతేడాది ఏప్రిల్లో మరో మహిళకు విక్రయించింది. సదరు మహిళ స్థానిక వరంగల్ క్రాస్రోడ్డులోని తన ఇంటికి తీసుకెళ్లింది. ఓ గదిలో బంధించి వ్యభిచారం చేయాలంటూ బాలికను సదరు మహిళతోపాటు ఆమె భర్త హింసించారు. బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించారు. ఈక్రమంలో వేర్వేరు ఊళ్లకూ పంపేవారు. నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన బాధితురాలు దాదాపు ఏడు నెలల పాటు నరకం చూసింది.
తప్పించుకొని నగరానికి చేరి..
గత నెల 10న భార్యభర్తలిద్దరూ బాలికతో గొడవ పడి బంగారు కమ్మలు, వెండిపట్టీలు, నగదు లాక్కొని తీవ్రంగా కొట్టారు. తప్పించుకునేందుకు అవకాశం కోసం చూస్తున్న బాలిక మర్నాడు ఖమ్మం నుంచి తప్పించుకొని నగరానికి చేరుకుంది. హయత్నగర్ పోలీసు ఠాణా పరిధిలో నివాసముంటున్న సోదరి ఇంటికి వచ్చింది. 23వ తేదీన వ్యభిచార నిర్వాహకులు ఇక్కడికి చేరుకొని .. మీ చెల్లెలు చోరీచేసి వచ్చిందని... ఎక్కడుందో చెప్పాలని ఒత్తిడి చేశారు. ఆమె చెప్పకపోవడంతో ఎక్కడ కనిపించినా వదిలిపెట్టబోమని చంపేస్తామంటూ బెదిరించి వెళ్లిపోయారు. దీంతో బాధితురాలు ప్రాణభయంతో గురువారం షీˆటీమ్ను ఆశ్రయించి తనకు జరిగిన ఘోరం గురించి వివరించినట్లు సమాచారం. ఈ మేరకు హయత్నగర్ పోలీసులు ‘జీరో’ ఎఫ్ఐఆర్ నమోదుచేసి కేసును సంబంధిత పోలీసు ఠాణాకు బదిలీ చేసినట్లు తెలిసింది.
పది దాటినా హోరు.. అమ్నేషియాపై కేసు
జూబ్లీహిల్స్: రాత్రి ‘పది’ తరువాత శబ్దాలు వద్దనే కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన జూబ్లీహిల్స్లో అమ్నేషియా పబ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. భవనంలో ఒకే లైసెన్స్పై మూడు వేర్వేరు పేర్లతో పబ్లను నిర్వహిస్తుండడంతో పోలీసులు దృష్టి సారించారు. బుధవారం రాత్రి 10 గంటలకు శబ్దాలు ఆపేసిన నిర్వాహకులు పోలీసులు వచ్చి వెళ్లిన తరువాత 10.40 గంటలకు మళ్లీ ప్రారంభించడంతో అక్కడికి చేరుకుని యజమానులు రాజా శ్రీకర్, కునాల్ కుక్రేజాలతోపాటు మేనేజర్ యూనిస్లపై కేసు నమోదు చేశారు. భవనంలోని అయిదు అంతస్థుల్లో అమ్నీషియాతో పాటు ఇన్సోమ్నియా, వయోల పేర్లతో పబ్బులు ఉన్నాయి. అమ్నీషియా పబ్కు మాత్రమే కోర్టు అనుమతి నిలిపివేసిందని మిగిలిన వాటిలో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. దీనిపై ఆబ్కారీ శాఖ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో పోలీసులు కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు.
దొంగతనాలకు పాల్పడుతున్న బాలనేరస్థుడి అరెస్టు
షాపూర్నగర్, న్యూస్టుడే: రాత్రిపూట ఇళ్ల తాళాలు బద్దలు కొట్టి చోరీలకు పాల్పడుతున్న బాలనేరస్థుడిని (16) జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం...జగద్గిరిగుట్టకి చెందిన ఓ బాలుడు బుధవారం రాత్రి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. 2022 జనవరి నుంచి ఇప్పటివరకు జగద్గిరిగుట్ట పరిధిలో 4, జీడిమెట్ల ఠాణా పరిధిలో 2 ఇళ్ల తాళాలు బద్దలుకొట్టి నగలు, నగదు తస్కరించాడు. క్రైం విభాగం పోలీసులు నిఘా ఉంచి బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నాడు. 67.255 గ్రాముల బంగారు, 15 తులాల వెండి నగలతో పాటు రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకుని గురువారం జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. కేసులను చేధించిన సీఐ సైదులు, డీఐ రామకృష్ణ, ఎస్ఐ లక్ష్మీనారాయణ, సిబ్బంది సత్యనారాయణ, నరేష్, కుద్దూస్, దశరథ్, ప్రసాద్రావు, సుమ, మోహన్లను డీసీపీ సందీప్, ఏసీపీ గంగారాంలు అభినందించారు.
వివాహ వేడుకకు వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు
కారు ప్రమాదంలో మహిళ దుర్మరణం
చెన్నేకొత్తపల్లి, న్యూస్టుడే: వివాహానికి వెళ్తూ.. కారు అదుపుతప్పిన ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందగా.. కుమారుడు, కుమార్తె గాయాలకు గురయ్యారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లికి సమీపంలోని కోనక్రాస్ వద్ద గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు హైదరాబాద్ కొత్తపేటకు చెందిన పద్మశాంతిదుర్గ (59), తన కుమారుడు అరవింద శ్రీమాన్ దుర్గ, కుమార్తె దుర్గా అభిలాష, మనువరాలితో కలిసి బెంగళూరులో బంధువుల ఇంట్లో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళుతున్నారు. చెన్నేకొత్తపల్లికి సమీపంలోని కోనక్రాస్ వద్ద కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. పెద్దరాళ్లను ఢీకొనడంతో పూర్తిగా దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న పద్మశాంతిదుర్గ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. స్వల్పంగా గాయపడిన కుమార్తె, కుమారుడిని అత్యవసర వాహనంలో చెన్నేకొత్తపల్లి సీహెచ్సీకి తరలించారు. కళ్లముందే తల్లి విగతజీవిగా మారడంతో కుమార్తె, కుమారుడు గుండెలవిసేలా రోదించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
కిరాణాకొట్టులో గంజాయి చాక్లెట్లు
480 స్వాధీనం.. నలుగురి అరెస్టు
షాద్నగర్, న్యూస్టుడే: కొన్ని కిరాణా దుకాణాలకు చాక్లెట్ల రూపంలో గంజాయిని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని నాగులపల్లి రోడ్డు రైతుకాలనీ కూడలిలోని ఓ కిరాణాకొట్టులో గురువారం దాడులు నిర్వహించిన ఎక్సైజ్ పోలీసులు 480 చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సీఐ రామకృష్ణ అందించిన వివరాల ప్రకారం కాటేదాన్కు చెందిన ఓ ముఠా పలు ప్రాంతాల్లో స్థానికులను భాగస్వాములుగా చేసుకుని ఈ దందా నడుపుతోంది. గత నెల 11న కొత్తూరు పరిధిలోని అయ్యప్ప ఆలయం వద్దనున్న ఓ కిరాణాకొట్టులో ఈ దందా కొనసాగుతున్నట్లు తెలుసుకుని దాడులు చేశారు. అక్కడ 40 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కిరాణా దుకాణం యజమాని సత్యదేవ్ను విచారించగా షాద్నగర్ వ్యవహారం బయటకు వచ్చింది. బుధవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించి గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వ్యాపారం సాగిస్తున్న షాద్నగర్, కొత్తూరు ప్రాంతాలకు చెందిన సునీల్, శశికాంత్, జలంధర్, అజయ్కుమార్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఒడిశా నుంచి కాటేదాన్కు.. అక్కడినుంచి తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు సరఫరా అయ్యే ఈ చాక్లెట్లను రూ.20 నుంచి 25 అమ్ముతారని పోలీసులు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో దారుణం.. పార్కింగ్ గొడవతో కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
[ 04-05-2024]
సాయంత్రం సమయం.. అంతా చూస్తుండగానే ఇనుప రాడ్డుతో హోటల్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి యజమానిపై ఒక్కసారిగా దాడి చేశాడు. తలకు బలమైన గాయాలైన ఆయన ఐదు గంటలపాటు మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. -
కేపీహెచ్బీలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
[ 04-05-2024]
గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని కేపీహెచ్బీ వద్ద చోటు చేసుకుంది. -
హైదరాబాద్లో స్థానికేతరులకే పట్టం
[ 04-05-2024]
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లు మొదటి నుంచి స్థానికేతరులకే పట్టంకడుతున్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన వారు విజయం సాధించలేకపోయారు. -
గడప దాటిస్తే ... గండం గడిచినట్లే
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గరపడటంతో బూత్ మేనేజ్మెంట్పై ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రచారం ఒకెత్తయితే పోలింగ్ రోజు ఓటర్లను ఇంటి గడప దాటించి పోలింగ్ కేంద్రానికి రప్పించి ఓట్లేయించడం చాలా కీలకం. -
ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన
[ 04-05-2024]
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగిలయ్య ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
[ 04-05-2024]
తక్కువ ధరకే ప్లాట్లు విక్రయిస్తామంటూ దంపతులు 15 మందికి రూ.12.35 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు. తప్పుడు ప్రకటనలు, ఫోర్జరీ పత్రాలతో మోసగించిన వీబీజే క్యాప్స్టోన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కందుల వెంకట ప్రసాద్ గుప్తా, ఆయన భార్య అనురాధను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు సీసీఎస్ డీసీపీ శ్వేత ఓ ప్రకటనలో తెలిపారు. -
నగర ఓటరు.. తీర్పు ఎప్పటికప్పుడు మారు
[ 04-05-2024]
శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో నగర ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటోంది. 2018లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్నినెలల వ్యవధిలో 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. -
సైబర్సిటీలో భారీగా వాడకం
[ 04-05-2024]
ఐటీ కార్యాలయాలు, ఆకాశహర్మ్యాలు, పరిశ్రమలకు నిలయమైన సైబర్సిటీ సర్కిల్ పరిధిలో వేసవిలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది. సిటీలోని తొమ్మిది సర్కిళ్లలో ఇక్కడే అత్యధిక వాడకం నమోదైంది. -
బంధాన్ని కాదని.. భర్తను బంధించి
[ 04-05-2024]
ఆస్తి కోసం భార్య ఇనుప గొలుసుతో కట్టేసి భర్తను చిత్రహింసలు పెట్టింది. ఘట్కేసర్ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్లోని అంబేడ్కర్నగర్కు చెందిన సెంట్రింగ్ గుత్తేదారు పత్తి నరసింహ(50) భార్య భారతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. -
తరుణీ కరుణించు
[ 04-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో మహిళ ఓటర్లు కీలకం కావడంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోల్లో మహిళల కోసం రకరకాల హామీలు గుప్పిస్తున్నాయి. -
పట్టణ ఓటరుపై పట్టుకు..
[ 04-05-2024]
ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ గేటర్లో రాజకీయ వేడి మొదలైంది. మహానగరంలో 28 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో నాలుగు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. -
రాజ్పుత్ల ఐకమత్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
[ 04-05-2024]
రాజ్పుత్ల ఐకమత్యాన్ని ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు లోక్సభ ఎన్నికల్లో భాజపాకు బుద్ధిచెప్పాలని మజ్లిస్ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
రంజిత్రెడ్డికి ఓట్లతో గుణపాఠం చెప్పాలి
[ 04-05-2024]
రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన భారాసకు ద్రోహం చేసిన రంజిత్రెడ్డికి ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సబితారెడ్డి పిలుపునిచ్చారు. శంకర్పల్లిలో శుక్రవారం ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షోలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ఆమె పాల్గొన్నారు. -
తపాలా ఓటులో తడబాటు.. వెనుదిరిగిన ఓటర్లు
[ 04-05-2024]
రాజధానిలో కోటి పదిలక్షల మంది ఓటర్లుండగా.. సుమారు పది వేల పోలింగ్ కేంద్రాల్లో 50వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు. భద్రతా సిబ్బంది, ఇతర సహాయ సిబ్బంది కలిపితే మరో 20వేల మంది ఉంటారు. -
ప్రభుత్వాన్ని కూల్చడానికి కేసీఆర్ కుట్ర
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి భారాస కుట్రలు చేస్తుందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పురపాలక పట్టణంలో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా కౌన్సిలర్ భరత్ బృందం పార్టీలో చేరిన సందర్భంగా సభ నిర్వహించారు. -
మా అభ్యర్థులను గెలిపించుకుంటాం
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మున్నూరు కాపు అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించుకుంటామని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్రావు ప్రకటించారు. -
నక్షత్రాలు,గ్రహాల గుట్టు తెలుసుకుందాం
[ 04-05-2024]
వినూత్న పరిశోధనలతో విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచేందుకు.. అంతరిక్ష పరిశోధనలపై ప్రోత్సహించేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మినీ అబ్జర్వేటరీని ప్రారంభించింది. -
జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..
[ 04-05-2024]
అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. పాదబాటపై నడుచుకుంటూ వెళ్తున్న హార్డ్వేర్ ఇంజినీర్ విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరిగుట్టకి చెందిన తుమ్మ భావన రుషి (35) రెండేళ్ల క్రితం సుజాత అనే ఉపాధ్యాయురాలిని ప్రేమ వివాహం చేసుకొని వెంకటగిరిలో నివసిస్తున్నాడు. -
ఎవరిదో పైచేయి
[ 04-05-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు (టీఆర్ఆర్, గడ్డం ప్రసాద్కుమార్, బుయ్యని మనోహర్రెడ్డి), భారాసకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు (ఆనంద్, పైలెట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేశ్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి, ఆనంద్) తమ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓట్లు సాధించడంపై దృష్టి నిలిపారు. -
భారాస విజయానికి వ్యూహ రచన
[ 04-05-2024]
తాండూరులో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి తాండూరు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్ కుమార్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM