BRS: భారాసలో చేరిన 50 మంది మహారాష్ట్ర సర్పంచ్లు
మహారాష్ట్రకు చెందిన 50 మంది సర్పంచ్లు కేసీఆర్ సమక్షంలో భారాస పార్టీలో చేరారు. కేసీఆర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
హైదరాబాద్: దేశ ప్రజలకు తాగు, సాగునీరు, విద్యుత్తు నేటికీ సరిగా అందట్లేదని భారత్ రాష్ట్ర సమితి (BRS) అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆక్షేపించారు. కేంద్ర పాలకుల నిర్లక్ష్య ధోరణులపై ప్రజలను జాగృతం చేయాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని 50మంది సర్పంచ్లు సీఎం సమక్షంలో బుధవారం భారాసలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. తెలంగాణలాగా ఇతర రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధి చెందట్లేదని ప్రశ్నించారు. చంద్రుడు, చుక్కలను తెచ్చివ్వాలని కేంద్రంలోని భాజపా నేతలను అడుగుతున్నామా? అని అన్నారు. తాగు, సాగు నీరు, విద్యుత్ ఇస్తే చాలని అడుగుతున్నామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.