logo

Hyderabad: ‘కైట్ ఫెస్టివల్‌’లో కిషన్‌రెడ్డి, తలసాని సందడి

సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో నిర్వహించిన ‘కైట్ ఫెస్టివల్‌’లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Published : 14 Jan 2024 14:13 IST

హైదరాబాద్‌: సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో నిర్వహించిన ‘కైట్ ఫెస్టివల్‌’లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట ఇంటికొచ్చిన సందర్భంగా రైతులు చేసుకునే పండుగే సంక్రాంతి అని కిషన్‌రెడ్డి చెప్పారు. సంక్రాంతిని నేడు ప్రపంచమంతా నిర్వహించుకుంటోందని చెప్పారు. ‘కైట్ ఫెస్టివల్‌’లో ఆయన పతంగి ఎగురవేశారు. 

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఒకప్పుడు పండుగకు 4 నెలల ముందు నుంచే పతంగుల సందడి ఉండేదని.. ప్రస్తుతం పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో ఆసక్తి కొరవడిందన్నారు. తమ పిల్లలకు తల్లిదండ్రులు మన సంప్రదాయాల గురించి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు