logo

బైక్‌ మరమ్మతుల విషయంలో గొడవ

బైక్‌ మరమ్మతుల విషయంలో తలెత్తిన గొడవ ఒకరిని బలి తీసుకుంది.  జీడిమెట్ల  ఇన్‌స్పెక్టర్‌  శ్రీనివాసరావు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన జైలర్‌సింగ్‌(24) సుభాష్‌నగర్‌లో ఉంటున్నాడు.

Published : 27 Mar 2024 01:57 IST

కిరాతకంగా హతమార్చిన స్నేహితుడు

జీడిమెట్ల: బైక్‌ మరమ్మతుల విషయంలో తలెత్తిన గొడవ ఒకరిని బలి తీసుకుంది.  జీడిమెట్ల  ఇన్‌స్పెక్టర్‌  శ్రీనివాసరావు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన జైలర్‌సింగ్‌(24) సుభాష్‌నగర్‌లో ఉంటున్నాడు. నెల క్రితం తాండూర్‌లో షెడ్డు నిర్మాణ పనులు చేపట్టాడు. స్నేహితుడైన గుల్బర్గాకు చెందిన సమీర్‌ అక్కడ వెల్డింగ్‌ పనులు చేస్తున్నాడు. సోమవారం జైలర్‌సింగ్‌ బైక్‌ను సమీర్‌ నడుపుతూ కింద పడేశాడు. బైక్‌కు మరమ్మతులు చేయించాలని జైలర్‌సింగ్‌ చెప్పగా.. సమీర్‌ ఒప్పుకోలేదు. మంగళవారం సుభాష్‌నగర్‌ మహాప్రస్థానం వద్ద ఇదే విషయంపై గొడవ పెరగడంతో జైలర్‌సింగ్‌ను కత్తితో సమీర్‌ కిరాతకంగా హతమార్చి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని