logo

‘ఆలోచించు ఆంధ్రుడా’ గోడపత్రికల ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకుని అభివృద్ధికి నాంది పలకాలని ఆకాంక్షిస్తూ ‘సీబీఎన్‌ ఫాలోవర్స్‌ హైదరాబాద్‌’ బృందం ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఆలోచించు ఆంధ్రుడా’ గోడపత్రికలను ప్రగతినగర్‌లో ఆదివారం ప్రతినిధులు ఆవిష్కరించారు.

Published : 22 Apr 2024 03:32 IST

నిజాంపేట, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకుని అభివృద్ధికి నాంది పలకాలని ఆకాంక్షిస్తూ ‘సీబీఎన్‌ ఫాలోవర్స్‌ హైదరాబాద్‌’ బృందం ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఆలోచించు ఆంధ్రుడా’ గోడపత్రికలను ప్రగతినగర్‌లో ఆదివారం ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ గోడపత్రికలను ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడుసుమిల్లి శ్రీనివాస్‌, కొల్లి ప్రవీణ్‌, కుర్ర మహేష్‌, అనిల్‌, కిరణ్‌, వెంకయ్య, భార్గవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని