logo

మహిళ మెడలోని గొలుసు లాక్కుని పరారీ

మహిళ మెడలోని గొలుసును ద్విచక్ర వాహనంపై వచ్చిన  దుండగులు  లాక్కుని పరారయ్యారు. వీరిలో ఒకరు యువతి కావడం గమనార్హం.

Published : 07 May 2024 01:28 IST

అల్వాల్‌: మహిళ మెడలోని గొలుసును ద్విచక్ర వాహనంపై వచ్చిన  దుండగులు  లాక్కుని పరారయ్యారు. వీరిలో ఒకరు యువతి కావడం గమనార్హం. అల్వాల్‌ పోలీసుల కథనం ప్రకారం.. అల్వాల్‌ హిల్స్‌ రోడ్డు 12లో నివసించే సువర్ణ(59) మరో మహిళతో కలిసి ఆదివారం వీధిలో వాకింగ్‌ చేస్తున్నారు. బైక్‌పై వెనుక నుంచి వచ్చిన  యువతీ యువకుడు ఆమె మెడలోని నాలుగున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు.  సీసీ ఫుటేజీల్లో నిందితుల దృశ్యాలు నిక్షిప్తమయ్యాయని.. త్వరలోనే పట్టుకొంటామని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని