logo

అత్యధిక ఎంపీ స్థానాలు భాజపా కైవసం: గీతామూర్తి

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను భాజపా కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యురాలు, మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతామూర్తి ధీమా వ్యక్తం చేశారు.

Published : 07 May 2024 01:29 IST

గోల్నాక, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను భాజపా కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యురాలు, మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతామూర్తి ధీమా వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ సర్కార్‌ పాలనపై అన్నివర్గాల ప్రజలు సానుకూలంగా ఉన్నారన్నారు. సోమవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత భారాస కనుమరుగవుతుందన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి.. రాష్ట్రంలోని ఎన్నికల పరిస్థితిని వివరించామని ఆమె తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని