మల్కాజిగిరికి ప్రత్యేక మ్యానిఫెస్టో
‘మల్కాజిగిరిలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుంది. మహిళా ఓటర్లు నా వెనకే ఉన్నారు. మల్కాజిగిరి మినీ భారత్.. అన్ని ప్రాంతాల వారుంటున్నారు.
మల్కాజిగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, మొయినాబాద్, గౌతంనగర్
‘మల్కాజిగిరిలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుంది. మహిళా ఓటర్లు నా వెనకే ఉన్నారు. మల్కాజిగిరి మినీ భారత్.. అన్ని ప్రాంతాల వారుంటున్నారు. పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీలు, కేంద్రంలో అధికారంలోకి వస్తే ‘పాంచ్ న్యాయ్’ వాగ్దానాలు పక్కాగా అమలయ్యేలా కృషి చేస్తా. జడ్పీ ఛైర్పర్సన్గా ఉమ్మడి రంగారెడ్డిలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. మల్కాజిగిరిలో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగురుతుంది’ అని ఎంపీ అభ్యర్థి పట్నం సునీత అన్నారు. ఆమె ‘ఈనాడు’తో పలు విషయాలు చర్చించారు.
ముఖ్యాంశాలు
- మురుగునీటి శుద్ధి ప్లాంట్లను అందుబాటులోకి తెస్తాం. కాలుష్య నియంత్రణకు గ్రీన్ ఇండస్ట్రీలు నెలకొల్పుతాం. కాలుష్య కారక పరిశ్రమలను మూసివేస్తాం.
- రోడ్ల మరమ్మతులు, విస్తరణ చేపడతాం. లింకు రోడ్ల అభివృద్ధి, అండర్పాస్, ఫ్లైఓవర్లు నిర్మిస్తాం.
- వరద ప్రభావిత ప్రాంతాల్లో యాంటీ-ఫ్లడ్డింగ్ మౌలిక వసతుల కల్పన ఏర్పాటు చేస్తాం.
ఎన్నికల్లో గెలిస్తే మీ తొలి ప్రాధాన్యలేంటి? వాటిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు?
నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక మ్యానిఫెస్టో సిద్ధం చేశాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలను అభివృద్ధి చేయడంతోపాటు జేఈఈ, నీట్ తదితర పరీక్షలకు శిక్షణ ఇస్తాం. ప్రతి డివిజన్లో స్మార్ట్ హైస్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తా. బస్తీ ప్రాంతాల్లో అంగన్వాడీల అభివృద్ధితోపాటు ప్రతి వార్డు, డివిజన్లో పీహెచ్సీలు అందుబాటులోకి తెస్తాం. పారిశ్రామిక ప్రాంతాల్లో నిత్యం వైద్యశిబిరాలు నిర్వహిస్తాం. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. చెరువులు, నీటి కుంటలను అభివృద్ధి చేసి చుట్టూ పార్కులను నిర్మిస్తాం. కుత్బుల్లాపూర్, ఉప్పల్ ప్రాంతాల్లో ఐటీఐలను స్థాపిస్తాం.
మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు?
మా సమీపంలో ఎవరూ లేరు. మేమూ ఎవరినీ ప్రత్యర్థులుగా భావించడం లేదు. తొలుత భాజపా అనుకున్నా ఆ పార్టీని దాటి కాంగ్రెస్ ఎంతో ముందుంది. మా కార్యకర్తలు, అభిమానుల అంచనా ప్రకారం 2 లక్షల మెజారిటీతో గెలవబోతున్నాం.
మీరు గెలిచేందుకు ప్రధాన అంశాలేంటి? అవి మీకు ఎలా దోహదపడతాయి?
గత ప్రభుత్వం ప్రలోభాలు, ఇతర రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చి మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో వాతావరణం పూర్తిగా కాంగ్రెస్ వైపు మారింది. సీఎం రేవంత్రెడ్డి కష్టపడేతత్వం ఓటర్లను ఆకట్టుకుంటోంది. ఒక మహిళగా పోటీ చేస్తుండటంతో ఆ వర్గం ఓట్లన్నీ గంపగుత్తగా పడనున్నాయి. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ వర్గాలు కాంగ్రెస్కు సానుకూలంగా ఉన్నాయి. మంచి మెజారిటీతో గెలవబోతున్నాం.
మీ పార్లమెంట్ పరిధిలో పలు సమస్యలున్నాయి. వాటి పరిష్కారానికి నిధులు ఎలా తెస్తారు?
జడ్పీ ఛైర్పర్సన్గా పలు ప్రాంతాల్లో అంతర్గత రహదారులు, పొలాలకు వెళ్లేందుకు రోడ్లు, తాగునీటి బోర్లు ఇలా చాలా సమస్యలు పరిష్కరించాం. వాజ్పేయీ నగర్, సఫిల్గూడ, బొల్లారం, రామకృష్ణాపురంలో ఆర్వోబీలు, ఆర్యూబీల పనులతోపాటు కంటోన్మెంట్లో ఆర్మీ రోడ్లు మూసివేత సమస్యలపై కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తాం. రాష్ట్రప్రభుత్వం తరఫున ఇప్పటికే మెట్రో సేవల విస్తరణకు సీఎం హామీ ఇచ్చారు. ఎల్బీనగర్, ఉప్పల్ వైపు ఐటీ రంగం విస్తరించడానికి కృషి చేస్తాం.
ఏయే అంశాలు ఓటర్లను ప్రభావితం చేయబోతున్నాయి? మీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజవర్గాల్లో భారాస ఎమ్మెల్యేలే ఉన్నారు. మీ గెలుపు ఎలా సాధ్యమవుతుంది?
భారాస ప్రభుత్వం అవినీతి తెలిసిందే. ఓటర్లను భయపెట్టి గెలిచారు. ప్రజలు ఆ విషయం తెలుసుకున్నారు. దీంతో ఈసారి ఆ ఓటర్లంతా కాంగ్రెస్కు పట్టం కట్టనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జడ్పీ ఛైర్పర్సన్గా ఈ ప్రాంతాలు అన్ని తిరిగా. రంగారెడ్డిలోకి రాని మల్కాజిగిరి, కంటోన్మెంట్ తప్ప.. అన్ని ప్రాంతాల్లో గతంలో అభివృద్ధి పనులు చేశాను. దీంతో ఎక్కడికి వెళ్లినా ప్రజలు మంచి ఆదరణ చూపిస్తున్నారు. అదే నా గెలుపునకు సంకేతం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
[ 19-05-2024]
నీటి ట్యాంకర్ బుక్ చేసిన 24 గంటల్లో సరఫరా చేసే విధానం అందుబాటులోకి వచ్చినట్లు జలమండలి ప్రకటించింది. ఇక నుంచి 3-4 రోజులపాటు నిరీక్షణ ఉండదని పేర్కొంది. -
మడతల చొక్కా వేసుకో.. పర్యావరణాన్ని కాపాడుకో
[ 19-05-2024]
ఎండలైనా, వానలైనా అసాధారణంగా ఉంటున్నాయి. ఎందుకిలా అని వాతావరణ శాస్త్రవేత్తలను అడిగితే పర్యావరణ మార్పుల ప్రభావం అంటున్నారు. తగ్గించేందుకు మన వంతుగా ఏమైనా చేయవచ్చా అని ఆలోచించిన శాస్త్రవేత్తలు.. ఓవైపు ల్యాబ్ల్లో ప్రయోగాలు చేస్తూనే.. -
పట్టుదలతో చదివి.. సత్తా చాటి
[ 19-05-2024]
పట్టుదల, ఏకాగ్రతతో ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఈఏపీ సెట్-24 పరీక్ష ఫలితాలు శనివారం ప్రకటించారు. -
గంటలో కుంటలా...
[ 19-05-2024]
వరుణుడు మరోసారి నగరంపై ఉరిమాడు. శనివారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. లింగంపల్లి, హయత్ నగర్లో అరగంట నుంచి గంట వ్యవధిలో కుండపోతగా పడింది. అత్యధికంగా లింగంపల్లిలో 6.88 సెంటీమీటర్ల వర్షం కురిసింది. -
స్థానిక సంస్థలపై కాంగ్రెస్ గురి
[ 19-05-2024]
నార్సింగి మున్సిపాలిటీ ఛైర్పర్సన్ దారుగుపల్లి రేఖ, వైస్ఛైర్మన్ వెంకటేశ్యాదవ్(భారాస)లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు నెగ్గాయి. వీరిపై మెజార్టీ సభ్యులు అందజేసిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు మున్సిపల్ కార్యాలయంలో శనివారం రాజేంద్రనగర్ ఆర్డీవో కె.వెంకట్రెడ్డి -
పుస్తకాలకు, బల్లలకు ఆకతాయిల నిప్పు
[ 19-05-2024]
జడ్పీ ఉన్నత పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, బల్లలకు ఆకతాయిలు నిప్పు పెట్టిన సంఘటన తాండూరు మండలం కరణ్కోటలో జరిగింది. శనివారం పాఠశాలలోకి ప్రవేశించిన ఆకతాయిలు సామగ్రి నిల్వ గదిలోకి వెళ్లారు. -
జూలో ఖడ్గమృగాల సంతతి వృద్ధి
[ 19-05-2024]
నగర నెహ్రూ జూ పార్కులో ఖడ్గమృగాల సంతతి క్రమంగా పెరుగుతోంది. వాటి ప్రదర్శన, విశ్రాంతికి మరో ఎన్క్లోజర్ నిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరేళ్ల నుంచి వాటిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్) దత్తత తీసుకొంటోంది. -
సెప్టెంబరుకు.. ‘సుంకిశాల’ అందేనా?
[ 19-05-2024]
నాగార్జునసాగర్ డెడ్స్టోరేజీ నుంచి సైతం నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టు సెప్టెంబరు నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు జలమండలి సమాయత్తమవుతోంది. -
చిన్న వర్షం.. అతలాకుతలం
[ 19-05-2024]
నగరంలో వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. -
మానసిక కుంగుబాటుతో చందు బలవన్మరణం
[ 19-05-2024]
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) అలియాస్ చందు మానసిక కుంగుబాటుతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. త్రినయని సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న చందు శుక్రవారం మణికొండలో బలవన్మరణానికి పాల్పడటం తెలిసిందే. -
సైబర్ నేరస్థులకు.. ‘మ్యూల్’ ఖాతాలు తెరుస్తూ..
[ 19-05-2024]
సైబర్ నేరస్థుల కోసం ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అయిదుగురు నిందితులను శనివారం అరెస్టు చేశారు. -
గ్రూప్-1 ప్రిలిమినరీకి ముమ్మర ఏర్పాట్లు
[ 19-05-2024]
జిల్లాలో జూన్ 9న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని జిల్లా అదనపు పాలనాధికారి రాహుల్శర్మ తెలిపారు. -
నాసిరకం ముప్పు.. కావాలి కనువిప్పు
[ 19-05-2024]
వానాకాలం సీజన్ దగ్గర పడుతోంది. పొలాలను శుభ్రం చేసే పనులు ఊపందుకుంటున్నాయి. ఇదే అదనుగా నాసిరంక విత్తనాలు కూడా విపణిలోకి తెచ్చేందుకు అక్రమార్కులు యత్నిస్తున్నారు. -
పర్యవేక్షణ శూన్యం.. ఇసుక మాయం
[ 19-05-2024]
ప్రభుత్వ లక్ష్యానికి, ప్రజా ప్రయోజనానికి అనుగుణంగా నిర్మాణాలు సాగాలి. గుత్తేదారు దానికి తగినట్లుగా పనులు చేయాలి. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. -
12 శాతం రిజర్వేషన్ కోసం మాదిగ జన సభలు
[ 19-05-2024]
తెలంగాణలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ‘మాదిగ జన సభలు’ నిర్వహిస్తున్నట్లు మాదిగ ఐకాస ఛైర్మన్, తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. -
చెత్త కుప్పలు తొలగించేదెవరు?
[ 19-05-2024]
ఎన్ని చర్యలు తీసుకున్నా పారిశుద్ధ్యం పట్టాలెక్కడం లేదు. నగరవ్యాప్తంగా 23 లక్షల ఇళ్లు ఉన్నాయని అంచనా. వాటన్నింటి నుంచి నిత్యం చెత్త సేకరణకు ప్రస్తుతం 4,500 స్వచ్ఛ ఆటోలున్నాయి. -
అటవీ భూమి కేటాయింపులు సబబే
[ 19-05-2024]
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఇమారత్ కంచ, సరూర్నగర్ మండలం మామిడిపల్లిలో అటవీ భూమిని అటవీయేతర అవసరాలకు ప్రభుత్వం కేటాయించడాన్ని హైకోర్టు సమర్ధించింది. -
ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో టోకరా
[ 19-05-2024]
కొంపల్లిలో ఖరీదైన ప్రాంతంలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ల ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో 350 మంది నుంచి రూ.60 కోట్ల వరకు వసూలు చేసి మోసగించిన ముగ్గురు మోసగాళ్లను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు
[ 19-05-2024]
పలు విశ్వవిద్యాలయాల పేరిట నకిలీ ధ్రువీకరణ పత్రాలు విక్రయిస్తున్న ముఠాలోని సభ్యుడితో పాటు కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తిని మహేశ్వరం ఎస్వోటీ బృందం, చైతన్యపురి పోలీసుల సహకారంతో అరెస్టు చేసింది. -
వారణాసిలో ప్రచారానికి భాజపా బృందం
[ 19-05-2024]
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నరేంద్రమోదీకి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు 10 మంది సభ్యులతో కూడిన భాజపా బృందాన్ని ఎంపిక చేశారు. -
ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలి
[ 19-05-2024]
రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలని, ఒక యాజమాన్యం కింద ఒకే విద్యా సంస్థ ఉండాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
పోరాటయోధుల చరిత్ర గ్రంథస్థం చేస్తాం
[ 19-05-2024]
తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరిగిన తొలి పోరాటంలో అమరులైన వీరులు, జైలుకెళ్లిన, అంగవైకల్యం చెందిన యోధుల త్యాగాలు చరిత్రకెక్కలేదని, ఆ త్యాగధనుల జీవితాలను గ్రంథ]స్థం చేస్తున్నట్లు తెలంగాణ -
రైల్వే, ఆదాయపన్నుశాఖలో ఉద్యోగాల పేరుతో మోసం
[ 19-05-2024]
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసగించిన నిందితుడిని ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ ఎస్.రష్మీ పెరుమాళ్ కథనం ప్రకారం.. -
క్యాన్సర్పై సమగ్ర పుస్తకం అభినందనీయం
[ 19-05-2024]
క్యాన్సర్ మహమ్మారికి శాశ్వత పరిష్కారం దిశగా పరిశోధనలు జరగాలని ఓయూ వీసీ ప్రొ.రవీందర్ అన్నారు. విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ (సీపీఎంబీ) డైరెక్టర్ డా.రామకృష్ణ
తాజా వార్తలు (Latest News)
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం