logo

ప్రశాంత ఎన్నికలకు సత్వర చర్యలు

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని వికారాబాద్‌ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 07 May 2024 02:33 IST

ధారూర్‌: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని వికారాబాద్‌ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని ధారూర్‌, కెరెల్లిలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ వేణుగోపాల్‌ గౌడ్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, ర్యాపులు, వెలుతురు తదితర వాటిని పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని