పేరుకే ఎంఐజీ..కనిపించని ప్రగతి
స్థలాల కోసం అంతర్జాలంలో ఎంఐజీ లాగిన్ అయిన తరువాత డబ్బులు చెల్లించాలనే ఆప్షన్ మాత్రమే చూపుతోంది. కొనుగోలుదారుడికి ఇష్టమైన ప్లాట్ను ఎంపిక చేసుకునే వెసులుబాటు లేదు. కేటగిరీని ఎంపిక చేసుకొని 10 శాతం డబ్బులు చెల్లించిన తరువాత డిమాండు ఆధారంగా స్థలాలు కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు.
స్థలాల అభివృద్ధికి ముందే బుకింగు
70 దరఖాస్తుల దాఖలు
ఈ ఖాళీ భూముల్లోనే ఎంఐజీ లే అవుట్ ఏర్పాటు చేసేది...
రూపొందించిన టౌన్షిప్ లేఅవుట్ ఇదే
రాయచోటి, న్యూస్టుడే: రాయచోటి సమీపంలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన టౌన్షిప్ ప్రాజెక్టు కింద స్థలాల విక్రయానికి అధికారులు శ్రీకారం చుట్టారు. స్థలాల అభివృద్ధి, లేఅవుట్ అనుమతి, అంతర్గత రహదారుల ఏర్పాటు తదితర లాంఛనాలు పూర్తి చేయకుండానే ప్రక్రియ ప్రారంభించటంపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతానికి స్థలాలపై లేఅవుట్ మ్యాపు మాత్రమే రూపొందించారు. అంతర్జాలంలో ఆకర్షణీయంగా బ్రోచర్ను తీర్చిదిద్ది విక్రయాలు ప్రారంభించారు. రాష్ట్రంలోని అయిదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా టౌన్షిప్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో రాయచోటి ఒకటి.
l రాయచోటి టౌన్షిప్ ప్రాజెక్టు బాధ్యతను ప్రభుత్వం అన్నమయ్య డెవలప్మెంట్ అథారిటీకి అప్పగించింది. లే అవుట్లను అభివృద్ధి పరిచి స్థలాలను మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉంచాలని నిర్దేశించారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండానే లేఅవుట్ ప్లాన్ను చూపించి ప్లాట్లను విక్రయిస్తున్నారు. దరఖాస్తు సమయంలోనే కొనుగోలుదారుడు ధరావతులో 10 శాతం, నెల తరువాత 30 శాతం, ఆరు మాసాలకు 30 శాతం, మిగిలిన పైకం 12 నెలల్లో చెల్లించాలని నిబంధన విధించారు. 70 మంది దరఖాస్తు చేసుకున్నారు.
అనుమతి లేకుండానే...
టౌన్షిప్ కింద ప్రభుత్వం విక్రయించే స్థలాలను రెవెన్యూ విభాగంలోని నిషేధిత చట్టం 22ఏ నుంచి తొలగించాలి. పురపాలక, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలు సంయుక్తంగా ఈ స్థలాలకు ముందస్తుగా ప్లాన్ అప్రూవల్ మంజూరు చేయాలి. అయినా ఇక్కడ అనుమతుల ప్రక్రియ పూర్తి కాకుండానే స్థలాల విక్రయం సాగుతోంది. l రాయచోటి పట్టణ సమీపంలోని డి.అబ్బవరం ప్రాంతంలో గతంలో అధికారులు సుమారు వంద ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు. ఆ భూమికి రెండు, మూడు కిలోమీటర్ల లోపే ప్రైవేట్ రియల్ ఎస్టేఫట్ వ్యాపారాలు సాగుతున్నాయి. అక్కడి ప్లాట్ల ధరలు బేరీజు వేసి ప్రభుత్వ స్థలాలకు ధర నిర్ణయించినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్లకు ఏడాది గడువు పెట్టినా ఆరునెలలలోపే 70 శాతం డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో అథారిటీకి ఆదాయం తప్ప లబ్ధిదారుడికి చేకూరే ప్రయోజనం ఏడాది వరకు తేలే అవకాశం లేదు. l రాయచోటి, వీరబల్లి, రామాపురం మూడు మండలాల సరిహద్దు అవడం వల్ల టౌన్షిప్ అభివృద్ధి అయితే లాభిస్తుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ స్థలాలను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడి రాజ్యం.. ఆరోగ్యశ్రీకి అనారోగ్యం...!
[ 27-04-2024]
కడప నగరానికి చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. -
మరుపురానిది ‘జగనాసుర రక్తచరిత్ర’!
[ 27-04-2024]
‘జగనాసుర రక్తచరిత్ర’ మరుపురానిదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో జరిగిన అరాచకాలు చరిత్రకెక్కుతాయని వివరించారు. -
జగన్ హామీకి తొండి... పరిహారానికి గండి..!
[ 27-04-2024]
కొండాపురం మండలంలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట 26.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గండికోట జలాశయం నిర్మించడంతో కొండాపురం, ముద్దనూరు మండలాల పరిధిలోని 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. -
న్యాయం చేస్తానన్నావ్...సాయం చేయకున్నావ్...!
[ 27-04-2024]
సోమశిల వెనుక జలాలతో ముంపు గ్రామాల ప్రజలు అధైర్యపడొద్దు. మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరంతా సంతృప్తి చెందేలా పునరావాస ప్యాకేజీ వర్తింపజేస్తాం. -
నేత్రపర్వంగా పురుషోత్తముడికి పుష్పాభిషేకం
[ 27-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం పురుషోత్తముడి పుష్పాభిషేకం నేత్రపర్వంగా సాగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. కడప పార్లమెంట నియోజకవర్గానికి సంబంధించి 32 నామపత్రాలు దాఖలు కాగా 14 ఆమోదించారు. -
30న పీలేరు, మైదుకూరులలో సీఎం జగన్ బహిరంగ సభలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు, పీలేరులో ఈ నెల 30న నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. -
పెద్దిరెడ్డి కుటుంబాన్ని సాగనంపండి
[ 27-04-2024]
రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
ఆపు నీ డప్పు... ఇవ్వు మా డబ్బు!
[ 27-04-2024]
జిల్లాలో గతేడాది మిగ్జాం తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందే అవకాశాలు కనిపించట్లేదు. -
క్షణం క్షణం... భయం భయం
[ 27-04-2024]
ఇళ్లలో ఉంటే విద్యుత్తు తీగలు ఎప్పుడు కింద పడుతాయోననే భయం.. ఆరుబయటికి వస్తే పిల్లలు తెలియక తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తాకి ప్రమాదాల బారిన పడుతారేమోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.