పేరుకే ఎంఐజీ..కనిపించని ప్రగతి
స్థలాల కోసం అంతర్జాలంలో ఎంఐజీ లాగిన్ అయిన తరువాత డబ్బులు చెల్లించాలనే ఆప్షన్ మాత్రమే చూపుతోంది. కొనుగోలుదారుడికి ఇష్టమైన ప్లాట్ను ఎంపిక చేసుకునే వెసులుబాటు లేదు. కేటగిరీని ఎంపిక చేసుకొని 10 శాతం డబ్బులు చెల్లించిన తరువాత డిమాండు ఆధారంగా స్థలాలు కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు.
స్థలాల అభివృద్ధికి ముందే బుకింగు
70 దరఖాస్తుల దాఖలు
ఈ ఖాళీ భూముల్లోనే ఎంఐజీ లే అవుట్ ఏర్పాటు చేసేది...
రూపొందించిన టౌన్షిప్ లేఅవుట్ ఇదే
రాయచోటి, న్యూస్టుడే: రాయచోటి సమీపంలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన టౌన్షిప్ ప్రాజెక్టు కింద స్థలాల విక్రయానికి అధికారులు శ్రీకారం చుట్టారు. స్థలాల అభివృద్ధి, లేఅవుట్ అనుమతి, అంతర్గత రహదారుల ఏర్పాటు తదితర లాంఛనాలు పూర్తి చేయకుండానే ప్రక్రియ ప్రారంభించటంపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతానికి స్థలాలపై లేఅవుట్ మ్యాపు మాత్రమే రూపొందించారు. అంతర్జాలంలో ఆకర్షణీయంగా బ్రోచర్ను తీర్చిదిద్ది విక్రయాలు ప్రారంభించారు. రాష్ట్రంలోని అయిదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా టౌన్షిప్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో రాయచోటి ఒకటి.
l రాయచోటి టౌన్షిప్ ప్రాజెక్టు బాధ్యతను ప్రభుత్వం అన్నమయ్య డెవలప్మెంట్ అథారిటీకి అప్పగించింది. లే అవుట్లను అభివృద్ధి పరిచి స్థలాలను మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉంచాలని నిర్దేశించారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండానే లేఅవుట్ ప్లాన్ను చూపించి ప్లాట్లను విక్రయిస్తున్నారు. దరఖాస్తు సమయంలోనే కొనుగోలుదారుడు ధరావతులో 10 శాతం, నెల తరువాత 30 శాతం, ఆరు మాసాలకు 30 శాతం, మిగిలిన పైకం 12 నెలల్లో చెల్లించాలని నిబంధన విధించారు. 70 మంది దరఖాస్తు చేసుకున్నారు.
అనుమతి లేకుండానే...
టౌన్షిప్ కింద ప్రభుత్వం విక్రయించే స్థలాలను రెవెన్యూ విభాగంలోని నిషేధిత చట్టం 22ఏ నుంచి తొలగించాలి. పురపాలక, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలు సంయుక్తంగా ఈ స్థలాలకు ముందస్తుగా ప్లాన్ అప్రూవల్ మంజూరు చేయాలి. అయినా ఇక్కడ అనుమతుల ప్రక్రియ పూర్తి కాకుండానే స్థలాల విక్రయం సాగుతోంది. l రాయచోటి పట్టణ సమీపంలోని డి.అబ్బవరం ప్రాంతంలో గతంలో అధికారులు సుమారు వంద ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు. ఆ భూమికి రెండు, మూడు కిలోమీటర్ల లోపే ప్రైవేట్ రియల్ ఎస్టేఫట్ వ్యాపారాలు సాగుతున్నాయి. అక్కడి ప్లాట్ల ధరలు బేరీజు వేసి ప్రభుత్వ స్థలాలకు ధర నిర్ణయించినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్లకు ఏడాది గడువు పెట్టినా ఆరునెలలలోపే 70 శాతం డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో అథారిటీకి ఆదాయం తప్ప లబ్ధిదారుడికి చేకూరే ప్రయోజనం ఏడాది వరకు తేలే అవకాశం లేదు. l రాయచోటి, వీరబల్లి, రామాపురం మూడు మండలాల సరిహద్దు అవడం వల్ల టౌన్షిప్ అభివృద్ధి అయితే లాభిస్తుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ స్థలాలను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యమే ఉండదన్నావ్.. మధ్యలోనే చంపేస్తున్నావ్..!
[ 08-05-2024]
దశల వారీగా మద్యనిషేధం చేస్తానని ఎన్నికల హామీ ఇచ్చిన సీఎం జగన్ అధికార పీఠం ఎక్కాక మోసం చేశారు. కొత్త విధానం పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలు.. బార్లు తెరిచి లెక్కకు మించిన విక్రయాలతో పేదలను పిండేస్తూ జేబులు నింపుకొంటున్నారు. -
కొనసాగిన పోస్టల్ బ్యాలట్ పోలింగ్
[ 08-05-2024]
పోస్టల్ బ్యాలట్ పోలింగ్ మూడోరోజు మంగళవారం కొనసాగింది. కడప ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఉద్యోగులు భారీ సంఖ్యలోనే తరలివచ్చారు. -
పట్టపగలు కాదు...అర్ధరాత్రి మెరుపుల వెలుగు
[ 08-05-2024]
ఈ చిత్రం చూస్తే ఇదేదో పట్టపగలు తీసిందని అనుకుంటారు... కానీ చిమ్మచీకట్లో తీసిన చిత్రమిది... మెరుపు తీగలు నగరానికి నగలా మారగా ఆ వెలుగులు పట్టపగలును తలపించాయి. -
నేడు కలికిరిలో ప్రధాని మోదీ సభ
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచార నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ జిల్లాకు తొలిసారిగా బుధవారం రానున్నారు. పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగసభను విజయవంతం చేయడానికి భాజపా, తెదేపా, జనసేన పార్టీల నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. -
కొలువుదీరావు... కొంప ముంచావు!
[ 08-05-2024]
నగరపాలక, పుర, నగర పంచాయతీల్లో మీకు సొంత ఇల్లుందా? పోనీ ఇంటి నిర్మాణానికి సెంటు స్థలమైనా ఉందా? వైకాపా ప్రభుత్వం విధించే ఆస్తిపన్నులు చెల్లించడానికి మీ ఆస్తులు సరిపోక పోవచ్చు. అద్దె ఇంట్లో ఉంటున్నామని సంబరపడే వారికి సంకటం తప్పదు. -
ఎన్డీఏ ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం
[ 08-05-2024]
తెదేపా హయాంలో చేసిన అభివృద్ధి పనులే ముద్దనూరులో కనిపిస్తున్నాయని, వైకాపా ప్రభుత్వం చేపట్టింది ఏమీ కనిపించడంలేదని ఎన్డీఏ కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్రెడ్డి అన్నారు. -
మైనార్టీల హక్కులు కాపాడేది చంద్రబాబునాయుడే
[ 08-05-2024]
మైనార్టీల మతపరమైన సంరక్షణ, వారి హక్కులు కాపాడేది చంద్రబాబునాయుడే అని ముస్లిం సోదరులు అపోహలు వీడి నిశ్చింతగా ఉండాలని ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. -
14 హామీలతో ప్రొద్దుటూరు తెదేపా మేనిఫెస్టో విడుదల
[ 08-05-2024]
ప్రొద్దుటూరు అభివృద్ధి కోరుతూ 14 రకాల ప్రధాన హామీలతో తెదేపా మేనిఫెస్టోను మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి తన కార్యాలయంలో విడుదల చేశారు. -
గెలిపిస్తే.. ఉక్కు కర్మాగారం కోసం పోరాడుతాం
[ 08-05-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపిస్తే కడప ఉక్కు కర్మాగారం సాధన కోసం కృషి చేస్తానని కడప తెదేపా ఎంపీ అభ్యర్థి భూపేష్రెడ్డి అన్నారు. -
అక్రమంగా దాచిన మద్యం స్వాధీనం
[ 08-05-2024]
మండల పరిధిలోని యాదవనగర్ సమీపంలో పంటపొలాల్లో దాచిన తెలంగాణా రాష్ట్రానికి చెందిన 2016 మద్యం సీసాలను సెబ్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
దివ్యాంగ ఓటర్లకు చక్రాల కుర్చీలు
[ 08-05-2024]
రానున్న ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే దివ్యాంగుల కోసం అధికారులు చక్రాల కుర్చీలు అందుబాటులోకి తీసుకురానున్నారు. -
తెదేపాలో భారీగా చేరికలు
[ 08-05-2024]
మైదుకూరు మండలం టి.కొత్తపల్లెకు చెందిన వైకాపా నాయకులు మంగళవారం ప్రొద్దుటూరులోని పార్టీ కార్యాలయంలో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెదేపాలో చేరారు. -
తెదేపాతో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
[ 08-05-2024]
తెదేపా ప్రభుత్వంలోనే కురబ సామాజిక వర్గానికి భరోసా లభిస్తుందని వారిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేసే బాధ్యత చంద్రబాబు తీసుకుంటారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్బాషా అన్నారు. -
1950కు ఎస్ఎంఎస్ చేస్తే పోలింగ్ కేంద్రం వివరాలు
[ 08-05-2024]
మీ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం స్లిప్పుల కోసం ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకునేందుకు వెసులుబాటు కల్పించింది ఎన్నికల కమిషన్. -
యజమాని వేధింపులతో చేనేత కార్మికుడి బలవన్మరణం
[ 08-05-2024]
మగ్గాల యజమాని వేధింపులు భరించలేక ఓ చేనేత కార్మికుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. -
వడగండ్లు... రైతులకు కడగండ్లు
[ 08-05-2024]
మండలంలోని బూడిదవేడులో సోమవారం రాత్రి భారీ గాలులతో కూడిన వడగండ్ల వానకు పంటలన్నీ నేలమట్టమయ్యాయి. దాదాపు 30 ఎకరాల్లో బొప్పాయి, టమాట, వరి తదితర పంటలన్నీ నేలకొరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
‘సలార్’లో పాత్రపై ఊహించని అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్
-
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
-
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. ఫీల్డర్ రెండుసార్లు రోప్ను తాకాడన్న సిద్ధూ!
-
‘రెడ్లైన్ దాటుతున్నారు జాగ్రత్త..!’ - కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు భారత్ హెచ్చరిక
-
AI ఫీచర్లు, 64MP కెమెరాతో గూగుల్ పిక్సెల్ 8ఏ.. ధర, ఫీచర్లివే
-
యూకే ఎయిర్ పోర్టుల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు.. ప్రయాణికుల అవస్థలు!