logo

లారీనిఢీకొన్న ఆర్టీసీ బస్సు

ముందు వెళ్తున్న లారీని ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. ఈ సంఘటన స్థానిక ప్రధాన రహదారిలోని శనివారం చోటు చేసుకుంది. 50 మంది ప్రయాణికులతో రాయచోటి నుంచి వేంపల్లె వెళ్తున్న ఆర్టీసీ బస్సు లక్ష్మీపురం వద్దకు వెళ్లగానే ముందు

Published : 23 Jan 2022 02:32 IST

పది మందికి గాయాలు


తీవ్రంగా గాయపడిన గంగిరెడ్డి (పైన), లక్షుమ్మ

చక్రాయపేట, న్యూస్‌టుడే: ముందు వెళ్తున్న లారీని ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. ఈ సంఘటన స్థానిక ప్రధాన రహదారిలోని శనివారం చోటు చేసుకుంది. 50 మంది ప్రయాణికులతో రాయచోటి నుంచి వేంపల్లె వెళ్తున్న ఆర్టీసీ బస్సు లక్ష్మీపురం వద్దకు వెళ్లగానే ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. స్థానికులు లక్కిరెడిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో గంగిరెడ్డి, లక్షుమ్మ అనే మహిళకు తీవ్రగాయాలవ్వడంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని