logo

స్కూటర్‌ను ఢీకొన్న లారీ... వృద్ధుడి మృతి

కడప-కర్నూలు జాతీయ రహదారిపై గుడిపాడు విద్యుత్తు ఉప కేంద్రం వద్ద బుధవారం స్కూటర్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో దువ్వూరు మండలం అన్నపుశాస్త్రులపల్లె గ్రామానికి చెందిన పుత్తా సుబ్బరామిరెడ్డి(71) అక్కడికక్కడే మృతి చెందారు. ఈమేరకు ఎస్సై కె.చపలరాజు

Published : 26 May 2022 06:34 IST


పుత్తా సుబ్బరామిరెడ్డి (పాత చిత్రం)

దువ్వూరు, న్యూస్‌టుడే : కడప-కర్నూలు జాతీయ రహదారిపై గుడిపాడు విద్యుత్తు ఉప కేంద్రం వద్ద బుధవారం స్కూటర్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో దువ్వూరు మండలం అన్నపుశాస్త్రులపల్లె గ్రామానికి చెందిన పుత్తా సుబ్బరామిరెడ్డి(71) అక్కడికక్కడే మృతి చెందారు. ఈమేరకు ఎస్సై కె.చపలరాజు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. పి.సుబ్బరామిరెడ్డి దువ్వూరుకు టీవీఎస్‌ స్కూటర్‌లో వస్తుండగా వెనుక వైపున కర్నూలు వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. లారీ చోదకుడు స్కూటర్‌ను ఢీకొట్టి వెళ్లిపోవడంతో స్థానికులు సమాచారం అందించడంతో చాగలమర్రి టోల్‌ ప్లాజ వద్ద లారీని వెంబడించి పట్టుకున్నట్లు ఎస్సై చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని