పోడు.. కొలిక్కి వచ్చేనా!
పోడు భూములకు పట్టాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా జిల్లాలో కసరత్తు తుదిదశకు చేరింది. పోడు భూములకు పట్టాలనగానే అనేక మంది సాగు చేసుకోకున్నా...
క్షేత్ర స్థాయిలో దరఖాస్తుల పరిశీలన
న్యూస్టుడే, జగిత్యాల
పోడు భూములకు పట్టాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా జిల్లాలో కసరత్తు తుదిదశకు చేరింది. పోడు భూములకు పట్టాలనగానే అనేక మంది సాగు చేసుకోకున్నా...ఆక్రమణలో లేకున్నా దరఖాస్తులు చేసుకోగా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయగా ఎక్కువగా ఉత్తుత్తి దరఖాస్తులేనని తేలుతోంది. జిల్లాలో 380 గ్రామపంచాయతీలుండగా ప్రధానంగా 55 గ్రామపంచాయతీల నుంచి 4829 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 394 మంది ఎస్టీలుండగా 3435 మంది ఇతరులున్నారు. దరఖాస్తుదారులు 9437 ఎకరాల అటవీ విస్తీర్ణం సాగు చేసుకుంటున్నట్లు పేర్కొనగా అందులో 3110.31 ఎకరాలు ఎస్టీలు, 6326.29 ఎకరాలు ఇతరులు ఆక్రమణలో ఉన్నట్లు దరఖాస్తుల్లో పేర్కొనగా అటవీ, రెవెన్యూ పంచాయతీ అధికారులు పరిశీలించగా 8278.19 ఎకరాల భూమి ఆర్వోఎఫ్ఆర్ యాప్లో చూపుతోంది. అయితే పరిశీలించిన 4700 దరఖాస్తుల్లో 2926 మంది ఆక్రమణలో లేనట్లు తేలింది. పరిశీలించిన దరఖాస్తుల్లో 1272 మంది ఎస్టీలు 991.31 ఎకరాల్లో, 3428 మంది ఇతరుల్లో 1184.58 ఎకరాల ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించగా ఇప్పటివరకు 707 ఎస్టీ, 1075 ఇతరుల దరఖాస్తులపై గ్రామసభలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయలు అటవీ అధికారి శ్రీనివాస్రావును హతమార్చిన నేపథ్యంలో గ్రామసభలకు అటవీ అధికారులు దూరంగా ఉండగా పంచాయతీ అధికారులు పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలందగా రెండు, మూడు రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
పట్టాలివ్వాలన్నా కష్టమే!
పోడు భూములకు పట్టాలివ్వాలన్నా జిల్లాలో కష్టంగా ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2005 డిసెంబర్ 13 వరకు అటవీ భూములు ఆక్రమించి సాగు చేసుకుంటున్న వారు అర్హులు దీని ప్రకారం గిరిజనులకు పట్టాలివ్వవచ్చు. గిరిజనేతరులైతే కనీసం 75 ఏళ్లు ఆక్రమణలో ఉండాలి. జిల్లాలో నిబంధనల ప్రకారం అతి తక్కువ మంది అర్హులవుతారు. గతంలోనూ పోడు భూములు సాగు చేసుకుంటున్న అర్హులందరికీ పట్టాలిచ్చారు. సారంగాపూర్, బీర్పూర్ మండలంలో అత్యధికంగా 166 మందికి 332.14 ఎకరాల పట్టాలివ్వగా జిల్లాలో పలు మండలాల్లోనూ కొంతమందికి పట్టాలిచ్చారు. ఇదేకాకుండా అనేక గ్రామాల్లో అటవీ భూములను ఆక్రమించుకుని రెవెన్యూ అధికారుల నుంచి అక్రమంగా పట్టాలు పొందిన వారున్నారు. బీర్పూర్ మండలంలోనే అటవీ శాఖకు చెందిన 4120 ఎకరాలు మాయం చేశారు. వాటికి రెవెన్యూ అధికారులు పట్టాలిచ్చారు. ఆ వివాదం నడుస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో పోడు భూముల సమస్య కొలిక్కి వచ్చేనా వచ్చినా ఎంత మందికి పట్టాలు దక్కుతాయో చూడాలి.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
పోడు భూముల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని జిల్లా కలెక్టర్ గుగులోతు రవి చెప్పారు. గ్రామసభలు పూర్తికావస్తున్నాయని ప్రభుత్వం నిబంధనల ప్రకారం అర్హులైన వారికే పట్టాలిస్తామని లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్