logo

భారాసకు బలం కార్యకర్తలే

భారత రాష్ట్ర సమితికి బలం పార్టీ కార్యకర్తలే అని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ అన్నారు.

Published : 26 Mar 2023 05:05 IST

నినాదాలు చేస్తున్న ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌, నేతలు

సైదాపూర్‌, న్యూస్‌టుడే : భారత రాష్ట్ర సమితికి బలం పార్టీ కార్యకర్తలే అని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని గొడిశాలలో శనివారం నిర్వహించిన భారాస ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జి.వీ రామకృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష అని, ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి వచ్చే సాధారణ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.48 కోట్ల నిధులతో ప్రతి తండాకు రహదారులు నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ విజయ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ అనిల్‌కుమార్‌, పార్టీ నాయకులు ఇంద్రనీల్‌, మండలాధ్యక్షుడు ఎస్‌.రాజయ్య, ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌, శ్రీధర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని