బ్యాంకులో కాదు.. సొంతానికి జమ
మహిళా సంఘాలు ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేసుకొని బ్యాంకు లింకేజీ సంఘాలు, స్త్రీనిధి ద్వారా రుణాలు పొందుతూ ఆర్థికాభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తుండగా..
రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకర్ల నోటీసులు
లబోదిబోమంటున్న మహిళా సంఘాల సభ్యులు
న్యూస్టుడే, కరీంనగర్ సుభాష్నగర్
మహిళా సంఘాలు ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేసుకొని బ్యాంకు లింకేజీ సంఘాలు, స్త్రీనిధి ద్వారా రుణాలు పొందుతూ ఆర్థికాభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తుండగా.. కొందరు సంఘాలను నమ్మించి నెలనెలా వసూలు చేస్తున్న రుణ మొత్తాన్ని సొంతానికి వాడుకోవడం, బ్యాంకర్లు ఆ సంఘాలకు నోటీసులు ఇవ్వడంతో ఆలస్యంగా బయట పడుతున్నాయి.
కరీంనగర్ నగర పాలక సంస్థ, మెప్మా పరిధిలో రెండేళ్ల కిందట బినామీ సంఘాలు ఏర్పాటు చేసుకొని పలు బ్యాంకుల ద్వారా రూ.కోట్లు తీసుకొని ఎగనామం పెట్టగా.. బాధ్యులైన మెప్మా ఒప్పంద ఉద్యోగులను, ఆర్పీలను తొలగించిన విషయం తెలిసిందే. ఈ విషయం మరవకముందే ఓ ఆర్పీ తీరు వివాదాస్పదంగా మారింది. వివరాల్లోకి వెళ్లితే నగరంలోని పద్మశాలీ వీధిలో వసంతలక్ష్మి స్లమ్ సమాఖ్యలో 14 మహిళా సంఘాలు పని చేస్తున్నాయి. ఈ సంఘాలకు సంబంధించిన రుణాలను ప్రతి నెలా వసూలు చేసి బ్యాంకులో జమ చేయకుండా పెత్తనం చేసి ఆ మొత్తాన్ని ఓ ఆర్పీ సొంతానికి వాడుకున్నారు. రుణాన్ని వసూలు చేసి బ్యాంకులలో జమ చేయకపోవడం, ఆఫీసు బేరర్ల(ఓబీ)కు తెలియకుండా పోవడంతో అనుమానాలు వచ్చి ఆరా తీశారు. సంఘాలలో తీసుకున్న రూ.1,90,000, సమాఖ్యలోని రూ.2,96,627 వాడుకున్నట్లు తేలింది. అదేవిధంగా వెంకటేశ్వర సంఘంలోని బ్యాంకు లింకేజీ రూ.2.50 లక్షలు బ్యాంకులో కట్టాల్సి ఉంది. స్త్రీనిధి రూ.3 లక్షలు అప్పుగా అలాగే ఉంచడం, ఆ సంస్థ మేనేజర్ తెలుపడంతో సంఘ సభ్యులు ఆందోళన చెందారు. మరో సభ్యురాలు సంఘం నుంచి వైదొలగగా ఆ పేరు మీద రూ.50 వేలు రుణం తీసుకున్నట్లు సంఘ సభ్యులు వివరించారు.
తాఖీదులతో ఆందోళన
సమాఖ్య పరిధిలో తీసుకున్న సంఘాలు బ్యాంకు ద్వారా రుణాలు సక్రమంగా చెల్లించడం లేదని, బకాయి పడిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఓ బ్యాంకు ఆ సమాఖ్యకు నోటీసులు జారీ చేయడంతో ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఆర్పీ నుంచి తీసుకున్న మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించే విధంగా చూడాలని కోరుతున్నారు. ఇలాగే ఇతర ప్రాంతాల నుంచి ఇటీవల కొన్ని ఫిర్యాదులు రాగా అధికారుల హెచ్చరికలతో రుణాలు చెల్లిస్తున్నారు.
కమిషనర్కు, పీడీకి ఫిర్యాదు
సమాఖ్య, సంఘంలోని సభ్యుల దగ్గర నుంచి ప్రతినెలా బ్యాంకులో చెల్లించాల్సిన రుణాన్ని తీసుకొని బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడుకున్న ఆర్పీపై వసంతలక్ష్మి సమాఖ్యకు చెందిన 14 సంఘాల సభ్యులు నగరపాలక కమిషనర్, మెప్మా పీడీకి ఫిర్యాదు చేశారు. సోమవారం నగర పాలక కార్యాలయానికి వచ్చి అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. మార్చి నెలాఖరు కావడంతో బ్యాంకర్లు, స్త్రీ నిధి అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని మొర పెట్టుకున్నారు. సీవో దృష్టికి తీసుకెళ్లినా పట్టింపు లేకుండా పోయిందని, ఆర్పీ స్పందించడం లేదని ఆగ్రహించారు. సాయంత్రం వీరంతా ఏం చేయాలనే విషయంపై సమావేశాన్ని నిర్వహించినట్లు సమాచారం. రాష్ట్ర మంత్రి, మేయర్, కలెక్టర్ను కలిసేందుకు సిద్ధమయ్యారు.
చర్యలు తప్పవు
- రాజేశ్వర్, సహాయ కమిషనర్, నగర పాలిక
సంఘాల సభ్యుల రుణాలను బ్యాంకులకు చెల్లించకపోతే కఠిన చర్యలు తప్పవు. ఫిర్యాదులు వస్తే విచారణ జరిపిస్తాం. సభ్యులు మొదట్లోనే అధికారుల దృష్టికి తేవాలి. ఆ సమయంలో రాకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్