logo

పెద్దపల్లి జిల్లాలో చెక్‌డ్యామ్‌ కూల్చేందుకు యత్నం

పెద్దపల్లి మండలం కొత్తపల్లి - భోజన్నపేట మధ్య ఉన్న హుస్సేన్‌మియా వాగు వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Updated : 16 Jan 2024 01:23 IST

పెద్దపల్లి: పెద్దపల్లి మండలం కొత్తపల్లి - భోజన్నపేట మధ్య ఉన్న హుస్సేన్‌మియా వాగు వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ వాగుపై నిర్మించిన చెక్‌ డ్యామ్‌ను కూల్చివేసేందుకు సోమవారం రాత్రి కొంతమంది దుండగులు యత్నించారు. కంప్రెషర్‌ ట్రాక్టర్‌తో డ్రిల్లింగ్‌ చేస్తుండగా గమనించిన రైతులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారంతా అక్కడ నుంచి ట్రాక్టర్‌లో పరారయ్యారు. ఘటనాస్థలంలో జిలెటెన్‌ స్టిక్స్‌తో పాటు, డ్రిల్లింగ్‌ సామగ్రిని అక్కడ వదిలేసి వెళ్లారు. చెక్‌డ్యామ్‌ కారణంగా దిగువ ప్రాంతాలకు నీరు చేరకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని మూలశాల గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వాపోగా.. ఈ దారుణానికి పాల్పడింది ఆ గ్రామస్థులేనని రైతులు ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని