కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు.
హుజూరాబాద్లో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుజూరాబాద్ గ్రామీణం, పట్టణం, తిమ్మాపూర్, న్యూస్టుడే: ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అలుగునూరు, హుజూరాబాద్లలో గురువారం పార్టీ నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని బూత్ల్లో కలిపి లక్ష మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వినోద్కుమార్, బండి సంజయ్లు ఏం పని చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. తాను ఎంపీగా తిరుపతికి రైలు, కరీంనగర్కు పాస్పోర్ట్ కార్యాలయం, కేంద్రియ విద్యాలయాలు, మోడల్స్కూళ్లు, ఆసుపత్రులు తెచ్చినట్లు వివరించారు. తెలంగాణలో ప్రధాని మోదీకి ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రజాస్వామిక వాది రాహుల్గాంధీ, అప్రజాస్వామికవాది మోదీకి మధ్య జరుగుతున్న పోరాటమిదన్నారు. ఎన్నికల తర్వాత అన్ని హామీలను నెరవేరుస్తామన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. భారాస పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ బూత్స్థాయిలో కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. ఈ క్రమంలో అనర్హులకు ఎల్వోసీ ఎలా ఇప్పిస్తారని పార్టీ కార్యకర్త ఎమ్మెల్యే ప్రశ్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి సర్దిచెప్పడంతో సద్దుమణిగింది. వొడితల ప్రణవ్ మాట్లాడుతూ ఎంపీ బండి సంజయ్కుమార్ నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాకే ప్రజలను ఓట్లడగాలన్నారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్న చోట ఎంపీ కూడా కాంగ్రెస్ ఉంటే మరింత అభివృద్ధి సాధించవచ్చని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రానున్న ఎన్నికల్లో యువతకు ప్రోత్సాహమివ్వాలని, యువతతోనే మంచి ఫలితాలు సాధ్యమని తెలిపారు. నాయకుడు వెలిచాల రాజేందర్రావు మాట్లాడుతూ ఎంపీ టికెట్ ఎవరికీ ఇచ్చినా అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. పురుమళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణగౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్యప్రసన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్యూఆర్ కోడ్తో ఓపీ రిజిస్ట్రేషన్
[ 01-05-2024]
ఓపీ రిజిస్ట్రేషన్ కోసం వరుసలో నిల్చునే అవసరం లేకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. మెట్పల్లి ప్రభుత్వాసుపత్రిలో బుధవారం నుంచి అమలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. -
లక్ష ఓట్ల ఆధిక్యం కాంగ్రెస్ లక్ష్యం
[ 01-05-2024]
‘ప్రతి ఇంటికి వెళ్లండి.. చేసిన ప్రగతిని చెప్పండి.. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు లక్ష ఓట్ల ఆధిక్యతను అందించాలి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. -
పదిలో మెరుగైన ఫలితాలు
[ 01-05-2024]
జిల్లాలో 11,380 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా 10,898 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 95.76 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 11వ స్థానంలో నిలిచింది. -
ఆ రెండు పార్టీలు ఒక్కటే
[ 01-05-2024]
కాంగ్రెస్, భాజపాలు ఒక్కటేనని భారాస నిజామాబాద్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మంగళవారం భారాస జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత, -
పదిలో ఎనిమిదో స్థానం
[ 01-05-2024]
జిల్లా పదో తరగతి ఫలితాల్లో అధికారుల సమష్టి సహకారంతో 96.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలో 102 జడ్పీ ఉన్నత, 7 ఆదర్శ, 10 కస్తూర్బా, 6 మహాత్మా జ్యోతిబా, 1 తెలంగాణ గురుకులం, -
పోలింగ్ కేంద్రం.. సమగ్ర సమాచారం
[ 01-05-2024]
ఓటర్లకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్ల జాబితా, స్లిప్పుల పంపిణీ నుంచి మొదలుకొని పోలింగు నిర్వహణ వరకు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు -
పెరిగిన వినియోగం.. గృహజ్యోతికి దూరం
[ 01-05-2024]
ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. విద్యుత్తు మీటర్లు గిర్రుగిర్రునా తిరుగుతున్నాయి. అత్యవసరమైతే తప్పా జనాలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. -
ఆ రెండు పార్టీలను ఓడిస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 01-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా, భారాసలను ఓడిస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమని తెలంగాణ జన సమితి(తెజస) వ్యవస్థాపకుడు ఆచార్య కోదండరాం అన్నారు. -
ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన భాజపా, భారాసలు
[ 01-05-2024]
భారతీయ జనతా పార్టీ, భారాసలు ప్రజల సంక్షేమాన్ని విస్మరించాయని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. -
మోదీ బహిరంగ సభ విజయవంతానికి పిలుపు
[ 01-05-2024]
వేములవాడ పట్టణంలో మే 8న జరగనున్న ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల బహిరంగ సభను విజయవంతం చేయాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పిలుపునిచ్చారు. -
పది ఫలితాల్లో అదుర్స్
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాల సాధన కోసం జిల్లా యంత్రాంగం చేపట్టిన ముందస్తు చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. మంగళవారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన పది ఫలితాల్లో 98.27 శాతంతో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. -
శ్రమజీవి గుండె సడి వినండి
[ 01-05-2024]
ఎండనక వాననక కష్టాన్నే నమ్ముకొని జీవించే కార్మికులు.. స్వాతంత్య్ర వజ్రోత్సవాలు దాటినా హక్కుల కోసం పోరాటాలు చేయాల్సి వస్తోంది. కష్టజీవులు, కర్మ వీరులకు కనీస వసతుల కల్పనలో పాలకులు విఫలమవుతున్నారు. -
గంజాయి చోరీ కేసులో ఆరుగురి అరెస్టు
[ 01-05-2024]
పోలీసుస్టేషన్ నుంచి గంజాయి దొంగిలించిన కేసులో మంగళవారం ఆరుగురిని అరెస్టు చేశారు. జగిత్యాల డీఎస్పీ డి.రఘుచందర్ వివరాలు వెల్లడించారు. -
వాట్సాప్.. ఎన్నికలపై అప్డేట్
[ 01-05-2024]
ఎన్నికల నిర్వహణ తీరుపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) చర్యలు తీసుకుంటోంది. -
68 మందిపై అనర్హత వేటు
[ 01-05-2024]
2019లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీ చేయగా వీరిలో వివిధ పార్టీల నుంచి ఏడుగురు బరిలో దిగగా, మిగతా వారు స్వతంత్రులు.
తాజా వార్తలు (Latest News)
-
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
-
గూగుల్తో ఇంగ్లీష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
లైంగిక దౌర్జన్యం కేసు - తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
-
నీ డెబ్యూ నాటికి నేనింకా చెడ్డీలతోనే ఉండుంటా: మిశ్రాతో రోహిత్
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!