పదిలో మెరుగైన ఫలితాలు
జిల్లాలో 11,380 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా 10,898 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 95.76 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 11వ స్థానంలో నిలిచింది.
జిల్లాలో 101 ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత
10 జీపీఏ సాధించిన తాటిపల్లి గురుకుల విద్యార్థినులను అభినందిస్తున్న జిల్లా కలెక్టర్ షేక్యాస్మిన్బాషా, చిత్రంలో డీఈవో జగన్మోహన్రెడ్డి, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు
జగిత్యాల పట్టణం, న్యూస్టుడే: జిల్లాలో 11,380 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా 10,898 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 95.76 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 11వ స్థానంలో నిలిచింది. బాలికలు 96.62 శాతం, బాలురు 95.76 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 2023 ఫలితాల్లో జిల్లాలో 84.05 శాతం ఉత్తీర్ణత నమోదైతే ఈసారి మరో 10 శాతం పెరిగింది. జిల్లాలోని 101 పాఠశాలలలు 100 శాతం ఫలితాలు సాధించడం విశేషం. 146 మంది విద్యార్థులు 9.5 జీపీఏ సాధించగా 100 మంది 9.7, 83 మంది 9.8, 25 మంది 10 జీపీఏ సాధించారు.
జిల్లాలోని 232 ప్రభుత్వ పాఠశాలల్లో 85 శాతంపైనే ఉత్తీర్ణత నమోదైంది. దాదాపు అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో 2023 కంటే ఫలితాలు మెరుగుపడ్డాయి. వార్షిక పరీక్షలకు ముందు కలెక్టర్ యాస్మిన్బాషా సూచనల మేరకు జిల్లా విద్యాశాఖ 3 నెలల ప్రత్యేక కార్యాచరణ సత్ఫలితాలనిచ్చింది. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులతోపాటు నమూనా వార్షిక పరీక్ష షెడ్యూల్ నిర్వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 84.23 శాతం ఉత్తీర్ణత, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో 93.38, ఆదర్శ పాఠశాలల్లో 97.96, కేజీబీవీల్లో 95.50, తెలంగాణ సోషల్వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 97.82, టీఎస్ఆర్ఎస్ 100, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 99.74 ఉత్తీర్ణత శాతం నమోదైంది.
మండలాల్లోనూ 90 శాతంపైనే..
జిల్లాలోని 19 మండలాల్లో రెండు మినహా 17 మండలాల్లో ఫలితాలు 90 శాతంపైనే నమోదయ్యాయి. బుగ్గారం మండలంలో వంద శాతం ఫలితాలు వచ్చాయి. బీర్పూర్ 98.67, ధర్మపురి 96.27, గొల్లపల్లి 85.89, ఎండపల్లి 87.50, ఇబ్రహీంపట్నం 93.53, జగిత్యాల 96.21, జగిత్యాల గ్రామీణం 96.42, కథలాపూర్ 94.73, కొడిమ్యాల 92.80, కోరుట్ల 92.72, మల్లాపూర్ 95.23, మల్యాల 98.25, మేడిపల్లి 98.28, మెట్పల్లి 97.98, పెగడపల్లి 94.86, రాయికల్ 97.33, సారంగపూర్ 96.47, వెల్గటూర్ 97.49 శాతం ఫలితాలు సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువకుడికి హెల్పింగ్ హ్యాండ్స్ చేయూత
[ 21-05-2024]
కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద యువకుడు కల్వల సతీశ్ ఆర్థికంగా ఎటువంటి వనరులు లేక చెట్టు కింద చిన్న టీ స్టాల్ నడిపిస్తున్నాడు -
ప్రాదేశిక సమరంపై సందిగ్ధత
[ 21-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియగా ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది. మరోవైపు స్థానిక సమరంలో కీలకమైన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడంతో ప్రస్తుతం అందరి దృష్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పడింది. -
గుర్తింపు సరే.. నిధులు ఏవీ?
[ 21-05-2024]
జిల్లాలో నాణ్యత ప్రమాణాలు, వైద్య సేవలు బాగున్న ఆరోగ్య కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహకాలు అందజేస్తోంది. -
పొదుపు పద్దులో అక్రమాలకు అడ్డుకట్ట
[ 21-05-2024]
స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీలో పారదర్శకత పాటించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అవసరమైన చర్యలు తీసుకుంటోంది. -
సకాలంలో అందేనా!
[ 21-05-2024]
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఇప్పటికే పలు పథకాలలో భాగస్వామ్యం చేయగా ప్రస్తుతం ఏకరూప దుస్తుల తయారీ బాధ్యతలను అప్పగించారు. -
అధ్వాన రోడ్లు.. తప్పని అవస్థలు
[ 21-05-2024]
కోరుట్ల పట్టణంలోని సిమెంట్రోడ్లు పూర్తిగా దెబ్బతిని అధ్వానంగా మారాయి. -
సెలవులు ముగిసేలోగా పనులు పూర్తయ్యేనా!
[ 21-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత పీడిస్తోంది. విద్యాభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నప్పటికీ ప్రగతిలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. -
ప్రజా పంపిణీలో నిత్యావసర సరకులు
[ 21-05-2024]
రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు నిత్యావసర సరకులు సైతం అదించాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. -
‘పెద్దపల్లిలో భాజపాదే గెలుపు’
[ 21-05-2024]
ప్రజల్లో జాతీయవాదం పెరగడంతోనే లోక్సభ ఎన్నికల్లో భాజపాకు అధిక ఓట్లు పడ్డాయని, ప్రజల సంపూర్ణ మద్దతుతో లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించనున్నట్లు ఆ పార్టీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస ధీమా వ్యక్తం చేశారు. -
రాయితీల్లో కోత.. నేతన్నల వెత
[ 21-05-2024]
వస్త్రపరిశ్రమకు ఇప్పటికీ సరైన ఆర్డర్లులేక.. వచ్చిన అరకొర ఉత్పత్తులతో సరైన ఉపాధిలేక నేతన్నలు భారంగా కాలం వెల్లదీస్తున్నారు. -
పక్కా ప్రణాళికతో పనులు పూర్తి చేయండి
[ 21-05-2024]
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మరమ్మతు పనులు పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జుల నియామకం
[ 21-05-2024]
ఈనెల 27న జరిగే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు భారాస తరఫున ఇన్ఛార్జులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నాయకులను పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారని భారాస -
ఆన్లైన్లో మోసం.. డబ్బులు మాయం
[ 21-05-2024]
ఆన్లైన్ మోసాలను అరికట్టడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నా మోసగాళ్లు కొత్త పుంతలతో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. -
జంట హత్యల కేసులో నిందితుల అరెస్టు
[ 21-05-2024]
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని గోపులాపూర్లో ఈ నెల 16న అర్ధరాత్రి జంట హత్య కేసులో ఏడుగురు నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. -
తప్పుడు దస్తావేజుతో భూమి అమ్మిన ఇద్దరి రిమాండ్
[ 21-05-2024]
తప్పుడు దస్తావేజుతో భూమి అమ్మిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
-
ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
ఏపీ ఎన్నికల్లో హింస.. 85 మంది నిందితులపై హిస్టరీ షీట్: డీజీపీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఆ ఒక్క సీటు మినహా యూపీలో భాజపాకు ఓటమే: అఖిలేశ్