ఆ రెండు పార్టీలను ఓడిస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ
లోక్సభ ఎన్నికల్లో భాజపా, భారాసలను ఓడిస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమని తెలంగాణ జన సమితి(తెజస) వ్యవస్థాపకుడు ఆచార్య కోదండరాం అన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న తెజస వ్యవస్థాపకుడు కోదండరాం
ఈనాడు, పెద్దపల్లి: లోక్సభ ఎన్నికల్లో భాజపా, భారాసలను ఓడిస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమని తెలంగాణ జన సమితి(తెజస) వ్యవస్థాపకుడు ఆచార్య కోదండరాం అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం పెద్దపల్లిలో ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం-పార్లమెంట్ ఎన్నికలు మన కర్తవ్యం’ అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భాజపా మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. ఆ పార్టీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉందన్నారు. గతంలో కేసీఆర్ కూడా ‘రాజ్యాంగాన్ని మార్చాల్సిందే’ అంటూ మాట్లాడారని, ఈ రెండు పార్టీలను ఓడించి ఇండియా కూటమిని బలపరిచేలా కాంగ్రెస్ను గెలిపించాలని కోదండరాం పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని పదేళ్ల కిందట చెప్పిన భాజపా ఇప్పటివరకు ఒక్కరి ఖాతాలోనూ పైసా కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరుస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న భాజపాకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. సీబీఐ, ఈడీ వంటి స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు వాడుతోందన్నారు. అధికారంలో ఉండగా భారీగా అవినీతికి పాల్పడిన కేసీఆర్ మరోసారి ఓట్లు దండుకునేందుకు బస్సు యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, తెజస నాయకులు డొంకెన రవి, సీనియర్ జర్నలిస్టు మునీర్, ఉద్యమకారుడు కోట శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువకుడికి హెల్పింగ్ హ్యాండ్స్ చేయూత
[ 21-05-2024]
కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద యువకుడు కల్వల సతీశ్ ఆర్థికంగా ఎటువంటి వనరులు లేక చెట్టు కింద చిన్న టీ స్టాల్ నడిపిస్తున్నాడు -
ప్రాదేశిక సమరంపై సందిగ్ధత
[ 21-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియగా ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది. మరోవైపు స్థానిక సమరంలో కీలకమైన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడంతో ప్రస్తుతం అందరి దృష్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పడింది. -
గుర్తింపు సరే.. నిధులు ఏవీ?
[ 21-05-2024]
జిల్లాలో నాణ్యత ప్రమాణాలు, వైద్య సేవలు బాగున్న ఆరోగ్య కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహకాలు అందజేస్తోంది. -
పొదుపు పద్దులో అక్రమాలకు అడ్డుకట్ట
[ 21-05-2024]
స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీలో పారదర్శకత పాటించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అవసరమైన చర్యలు తీసుకుంటోంది. -
సకాలంలో అందేనా!
[ 21-05-2024]
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఇప్పటికే పలు పథకాలలో భాగస్వామ్యం చేయగా ప్రస్తుతం ఏకరూప దుస్తుల తయారీ బాధ్యతలను అప్పగించారు. -
అధ్వాన రోడ్లు.. తప్పని అవస్థలు
[ 21-05-2024]
కోరుట్ల పట్టణంలోని సిమెంట్రోడ్లు పూర్తిగా దెబ్బతిని అధ్వానంగా మారాయి. -
సెలవులు ముగిసేలోగా పనులు పూర్తయ్యేనా!
[ 21-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత పీడిస్తోంది. విద్యాభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నప్పటికీ ప్రగతిలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. -
ప్రజా పంపిణీలో నిత్యావసర సరకులు
[ 21-05-2024]
రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు నిత్యావసర సరకులు సైతం అదించాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. -
‘పెద్దపల్లిలో భాజపాదే గెలుపు’
[ 21-05-2024]
ప్రజల్లో జాతీయవాదం పెరగడంతోనే లోక్సభ ఎన్నికల్లో భాజపాకు అధిక ఓట్లు పడ్డాయని, ప్రజల సంపూర్ణ మద్దతుతో లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించనున్నట్లు ఆ పార్టీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస ధీమా వ్యక్తం చేశారు. -
రాయితీల్లో కోత.. నేతన్నల వెత
[ 21-05-2024]
వస్త్రపరిశ్రమకు ఇప్పటికీ సరైన ఆర్డర్లులేక.. వచ్చిన అరకొర ఉత్పత్తులతో సరైన ఉపాధిలేక నేతన్నలు భారంగా కాలం వెల్లదీస్తున్నారు. -
పక్కా ప్రణాళికతో పనులు పూర్తి చేయండి
[ 21-05-2024]
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మరమ్మతు పనులు పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జుల నియామకం
[ 21-05-2024]
ఈనెల 27న జరిగే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు భారాస తరఫున ఇన్ఛార్జులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నాయకులను పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారని భారాస -
ఆన్లైన్లో మోసం.. డబ్బులు మాయం
[ 21-05-2024]
ఆన్లైన్ మోసాలను అరికట్టడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నా మోసగాళ్లు కొత్త పుంతలతో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. -
జంట హత్యల కేసులో నిందితుల అరెస్టు
[ 21-05-2024]
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని గోపులాపూర్లో ఈ నెల 16న అర్ధరాత్రి జంట హత్య కేసులో ఏడుగురు నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. -
తప్పుడు దస్తావేజుతో భూమి అమ్మిన ఇద్దరి రిమాండ్
[ 21-05-2024]
తప్పుడు దస్తావేజుతో భూమి అమ్మిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెజాన్-ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ రివార్డులు ఉండవిక..
-
సీనియర్లుగా జట్టులో మీ బాధ్యత అదే కదా..: హర్భజన్
-
ఆ బాలుడికి పోలీస్స్టేషన్లో పిజ్జా, బిర్యానీ
-
అంతరిక్షంలో ఆయుధాలు.. అమెరికా-రష్యా మాటల యుద్ధం
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్ అభ్యర్థన వెనక స్టార్ హీరో సతీమణి
-
ఏఐపై ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్ సీటీఓ సూచనలు