పెరిగిన వినియోగం.. గృహజ్యోతికి దూరం
ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. విద్యుత్తు మీటర్లు గిర్రుగిర్రునా తిరుగుతున్నాయి. అత్యవసరమైతే తప్పా జనాలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు.
మండుతున్న ఎండలకు తగ్గిన విద్యుత్తు రాయితీ అర్హులు
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్
ఓ వినియోగదారుడికి మార్చి నెలలో 787 రాయితీ వర్తింపు, ఏప్రిల్లో వచ్చిన రూ.2,065 బిల్లు
ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. విద్యుత్తు మీటర్లు గిర్రుగిర్రునా తిరుగుతున్నాయి. అత్యవసరమైతే తప్పా జనాలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్తు వాడకం రెట్టింపు కావడంతో గృహజ్యోతి పథకం లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది. గృహ అవసరాలకు విద్యుత్తు వినియోగం పెరగడంతో జీరో బిల్లు కోల్పోవాల్సి వస్తోంది. రెండు నెలల లబ్ధిదారుల జాబితా పరిశీలిస్తే విద్యుత్తు వాడకం అధికంగా ఉంది. గత నెలలో వంద యూనిట్ల లోపు వాడిన వినియోగదారులు ప్రస్తుత నెలలో వందపైనా వినియోగించడంతో రాయితీ సొమ్ము పెరిగినట్లయింది. విద్యుత్తు పొదుపుగా వాడాలని అవగాహన కల్పించినప్పటికీ ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది.
తగ్గుదల ...
జిల్లాలో పెద్దపల్లి, మంథని డివిజన్ పరిధిలో మొత్తం 2,06,518 కనెక్షన్లు వాడకంలో ఉన్నాయి. ఆరు గ్యారంటీల అమలుకు తెల్ల రేషన్ కార్డు కలిగిన వారి నుంచి స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తుల్లో తప్పులు దొర్లాయి. విద్యుత్తు కనెక్షన్ సంఖ్య సక్రమంగా నింపకపోవడం, రేషన్ కార్డు సంఖ్య తప్పుగా రాయడంతో రాయితీకి దూరమయ్యారు. జిల్లాలో మార్చిలో 1,10,346 కనెక్షన్లకు రూ.345.90 లక్షల రాయితీ వర్తించింది. ఏప్రిల్లో 1,06,363 కనెక్షన్లకు రూ.422.90 రాయితీ పొందారు. విద్యుత్తు కనెక్షన్లు తగ్గినప్పటికీ రాయితీ సొమ్ము పెరిగింది. గృహ అవసరాలకు విద్యుత్తు వినియోగం పెరగడంతో రాయితీ సొమ్ము అధికమైంది. 200 యూనిట్లు దాటడంతో ఈ సారి బిల్లులు చెల్లించాల్సి వచ్చింది.
పొదుపుతోనే రాయితీ
మండుతున్న ఎండలు 200 యూనిట్ల కంటే అధికంగా వినియోగిస్తుండటంతో బిల్లులు చెల్లించే పరిస్థితి నెలకొంది. జిల్లాలో మార్చి నెలలో 164 మిలియన్ యూనిట్లు, ఏప్రిల్లో 120 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగించారు. వరి, ఇతర పంటలు కోతలకు రావడంతో వ్యవసాయానికి వినియోగం తగ్గింది. కేవలం గృహ అవసరాలకు మాత్రమే వాడటంతో ఏప్రిల్ విద్యుత్తు డిమాండ్ కాస్తా తగ్గింది. ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నిరంతరంగా నడుస్తుండటంతో జీరో బిల్లు పొందలేకపోతున్నారు. పొదుపుగా విద్యుత్తు వినియోగిస్తే రాయితీ సొమ్ము పొందే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాదేశిక సమరంపై సందిగ్ధత
[ 21-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియగా ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది. మరోవైపు స్థానిక సమరంలో కీలకమైన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడంతో ప్రస్తుతం అందరి దృష్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పడింది. -
గుర్తింపు సరే.. నిధులు ఏవీ?
[ 21-05-2024]
జిల్లాలో నాణ్యత ప్రమాణాలు, వైద్య సేవలు బాగున్న ఆరోగ్య కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహకాలు అందజేస్తోంది. -
పొదుపు పద్దులో అక్రమాలకు అడ్డుకట్ట
[ 21-05-2024]
స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీలో పారదర్శకత పాటించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అవసరమైన చర్యలు తీసుకుంటోంది. -
సకాలంలో అందేనా!
[ 21-05-2024]
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఇప్పటికే పలు పథకాలలో భాగస్వామ్యం చేయగా ప్రస్తుతం ఏకరూప దుస్తుల తయారీ బాధ్యతలను అప్పగించారు. -
అధ్వాన రోడ్లు.. తప్పని అవస్థలు
[ 21-05-2024]
కోరుట్ల పట్టణంలోని సిమెంట్రోడ్లు పూర్తిగా దెబ్బతిని అధ్వానంగా మారాయి. -
సెలవులు ముగిసేలోగా పనులు పూర్తయ్యేనా!
[ 21-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత పీడిస్తోంది. విద్యాభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నప్పటికీ ప్రగతిలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. -
ప్రజా పంపిణీలో నిత్యావసర సరకులు
[ 21-05-2024]
రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు నిత్యావసర సరకులు సైతం అదించాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. -
‘పెద్దపల్లిలో భాజపాదే గెలుపు’
[ 21-05-2024]
ప్రజల్లో జాతీయవాదం పెరగడంతోనే లోక్సభ ఎన్నికల్లో భాజపాకు అధిక ఓట్లు పడ్డాయని, ప్రజల సంపూర్ణ మద్దతుతో లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించనున్నట్లు ఆ పార్టీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస ధీమా వ్యక్తం చేశారు. -
రాయితీల్లో కోత.. నేతన్నల వెత
[ 21-05-2024]
వస్త్రపరిశ్రమకు ఇప్పటికీ సరైన ఆర్డర్లులేక.. వచ్చిన అరకొర ఉత్పత్తులతో సరైన ఉపాధిలేక నేతన్నలు భారంగా కాలం వెల్లదీస్తున్నారు. -
పక్కా ప్రణాళికతో పనులు పూర్తి చేయండి
[ 21-05-2024]
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మరమ్మతు పనులు పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జుల నియామకం
[ 21-05-2024]
ఈనెల 27న జరిగే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు భారాస తరఫున ఇన్ఛార్జులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నాయకులను పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారని భారాస -
ఆన్లైన్లో మోసం.. డబ్బులు మాయం
[ 21-05-2024]
ఆన్లైన్ మోసాలను అరికట్టడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నా మోసగాళ్లు కొత్త పుంతలతో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. -
జంట హత్యల కేసులో నిందితుల అరెస్టు
[ 21-05-2024]
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని గోపులాపూర్లో ఈ నెల 16న అర్ధరాత్రి జంట హత్య కేసులో ఏడుగురు నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. -
తప్పుడు దస్తావేజుతో భూమి అమ్మిన ఇద్దరి రిమాండ్
[ 21-05-2024]
తప్పుడు దస్తావేజుతో భూమి అమ్మిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.