రిజర్వేషన్లను రక్షించుకుందాం
పార్లమెంటు ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా ఐక్యంగా ఉండి రిజర్వేషన్లను రక్షించుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రంలో మరోసారి భాజపా ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుందని.. ప్రజలు ఆలోచించి అలాంటి పార్టీకి ఓటు వేయవద్దని కోరారు.
మంత్రి పొన్నం ప్రభాకర్
రామడుగులో ప్రసంగిస్తున్న మంత్రి పొన్నం, చిత్రంలో ఎమ్మెల్యే సత్యం, అభ్యర్థి రాజేందర్రావు
చొప్పదండి, రామడుగు, మల్యాల: పార్లమెంటు ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా ఐక్యంగా ఉండి రిజర్వేషన్లను రక్షించుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రంలో మరోసారి భాజపా ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుందని.. ప్రజలు ఆలోచించి అలాంటి పార్టీకి ఓటు వేయవద్దని కోరారు. శనివారం చొప్పదండి, రామడుగుల్లో నిర్వహించిన రోడ్షోల్లో మంత్రి మాట్లాడారు. రాముడి జపం చేస్తున్న భాజపా అంతరంగమంతా రిజర్వేషన్ల రద్దుపైనే ఉందని విమర్శించారు. దేవుడి పేరుతో ఓట్లు అడగటం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో నాలుగు నెలల స్వల్ప కాలంలోనే సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా, రాష్ట్రంలో భారాసలు హామీలు నెరవేర్చలేదన్నారు. అది మరిపించటానికి కాంగ్రెస్పై అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎంపీలుగా బండి సంజయ్కుమార్, బోయినపల్లి వినోద్కుమార్లు కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధికి చేసిందేమి లేదని విమర్శించారు. నియోజకవర్గానికి బండి సంజయ్కుమార్ ఏం చేశాడో బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత నూతన రేషన్కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇల్లు పథకాలను ఇస్తామన్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు మాట్లాడుతూ తనకు ఒకసారి అవకాశమిచ్చి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న, పురపాలిక అధ్యక్షురాలు నీరజ, ఎంపీపీ జవ్వాజి హరీశ్, ఆల్గీ జిల్లా ఛైర్మన్ ఉప్పుల అంజనీప్రసాద్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, తిరుపతిగౌడ్, బొమ్మరవేని తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. మల్యాల అంగడి బజారులో మంత్రి మాట్లాడుతూ కొండగట్టు అంజన్న గుడికి ఒక్క రూపాయి తేలేని, దేవుడి పేరుమీద రాజకీయం చేసే మీరు ఓట్లెలా అడుగుతారని బండి సంజయ్ను ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు మాట్లాడుతూ గతంలో ఎంపీగా పనిచేసిన వినోద్కుమార్, బండి సంజయ్కుమార్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు
[ 18-05-2024]
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం స్వామివారికి చందనోత్సవాన్ని నిర్వహించారు. -
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు
-
కడప గౌస్నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం
-
పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ