హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం
శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసగించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ముందుకు వస్తున్నారని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు.
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్
గంగాధరలో మాట్లాడుతున్న బండి సంజయ్
గంగాధర, తెలంగాణచౌక్ (కరీంనగర్), న్యూస్టుడే : శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసగించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ముందుకు వస్తున్నారని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. వారికి ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కోరారు. గంగాధర ప్రధాన కూడలిలో ఆదివారం రాత్రి భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో సంజయ్ మాట్లాడుతూ.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వలేదన్నారు. మహిళలకు రూ.2500 మహాలక్ష్మి పథకం అమలు చేయలేదన్నారు. రైతు భరోసా కింద రూ.14 వేలు, కౌలు రైతులకు రూ.12 వేలు ఎందుకు ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఎందుకు మంజూరు చేయలేదన్నారు. కల్యాణలక్ష్మి కింద ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వలేదన్నారు. విద్యార్థి భరోసా కింద రూ. 5 లక్షలు ఇస్తానని మోసం చేశారని ఆరోపించారు. ఈ పథకాలు అమలు చేయని సీఎం రేవంత్రెడ్డి గాడిద గుడ్డు చూపించడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్, భారాసల నాయకులను నమ్మి మోసపోవద్దని కోరారు. మాజీ మంత్రులు సుద్దాల దేవయ్య, పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రవణ్కుమార్, మండలాధ్యక్షులు కోల అశోక్, రవీందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం బండి సంజయ్ కరీంనగర్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబేడ్కర్ స్టేడియంలో వాకర్స్ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కొంతమంది సోకాల్డ్ మేధావులతో సామాజిక మాధ్యమం ద్వారా కేసీఆరే బెటర్ అనేలా ప్రచారం చేయిస్తున్నారు. ఒక్కసారి కేసీఆర్ చేసిన మోసాలను గుర్తుంచుకోండి. ఇక్కడి రైతులను ఆదుకోకుండా పంజాబ్ పోయి అక్కడి రైతులకు డబ్బులిచ్చి ప్రచారం చేసుకున్నారు. తెలంగాణను ఏటీఎంగా వాడుకున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమై, నిరుద్యోగుల బతుకులతో చెలగాటమాడారు.’’ అని అన్నారు. అనంతరం బండి సంజయ్ కరీంనగర్ కాపువాడలో మున్నూరుకాపు సంఘం ఆత్మీయ సమావేశానికి సంజయ్ హాజరై భాజపాకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్, భారాసల కుమ్ముక్కు రాజకీయాలను ఎండగడుతున్నందుకు ఆ రెండు పార్టీలు ఒక్కటై నన్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు
[ 18-05-2024]
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం స్వామివారికి చందనోత్సవాన్ని నిర్వహించారు. -
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు