దారి పొడవునా గులాబీ దండు!
భారాస అధినేత బస్సు యాత్రతో గులాబీ దండులో జోష్ నెలకొంది. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో కొనసాగిన యాత్రకు అపూర్వ స్పందన లభించింది.
కేసీఆర్కు ఘన స్వాగతం
శ్రేణుల్లో జోష్ నింపిన భారాస అధినేత
వీణవంకలో మాట్లాడుతున్న కేసీఆర్ చిత్రంలో వినోద్కుమార్, కౌశిక్రెడ్డి
కరీంనగర్ (ఈనాడు), జగిత్యాల, వీణవంక (న్యూస్టుడే) : భారాస అధినేత బస్సు యాత్రతో గులాబీ దండులో జోష్ నెలకొంది. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో కొనసాగిన యాత్రకు అపూర్వ స్పందన లభించింది. వీణవంక నుంచి జగిత్యాల వరకు దారి పొడువునా జనాలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత బస్సులో కేసీఆర్ వీణవంకకు చేరుకున్నారు. అక్కడి ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి నివాస గృహంలో బస చేశారు. ఆదివారం మధ్యాహ్నం అక్కడ రైతులు, వివిధ వర్గాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ఉమ్మడి జిల్లాతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్ గడ్డ ఉద్యమకాలంలో అండగా నిలిచిన తీరుతోపాటు అభివృద్ధి పరంగా ఇక్కడికి అందిన సంక్షేమ ఫలాలను గుర్తు చేశారు. నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేశారు. నిరుత్సాహపడకుండా ఉత్తేజంతో పని చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్లో భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను గెలిపించాలని కోరారు. వీణవంక నుంచి జగిత్యాల వరకు బస్సు యాత్రలో సందడి కనిపించింది. ఊరూరా నాయకులు ఆపి ఉద్యమ నేతకు అభివాదం తెలుపుతూనే పూల వర్షాన్ని కురిపించి అభిమానాన్ని చూపించారు. మానకొండూర్, కరీంనగర్, కొత్తపల్లి, గంగాధర, పూడూరు, మల్యాల, జగిత్యాలలో పెద్దఎత్తున శ్రేణులు దారికి ఎడమ వైపున నిలిచిన ప్రజలు, కార్యకర్తలకు కేసీఆర్ విజయ సంకేతాన్ని చూపిస్తూ ముందుకు సాగారు. కొండగట్టు వద్ద హోటల్లో టీ తాగి జగిత్యాలకు వెళ్లారు. జగిత్యాల కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడి కూడలిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ తమ హయాంలో జరిగిన అభివృద్ధిని తన ప్రసంగంలో వివరించారు. ప్రత్యర్థులపై విమర్శల బాణాలతో కార్యకర్తలను ఉత్సాహపరిచారు. జగిత్యాల జిల్లా ఉండాలా వద్దా అని ప్రశ్నించగా జనం ఉండాలి అని సమాధానమిచ్చారు.. వరద కాలువ తమ హయాంలో సజీవంగా ఉండేదని.. ఇప్పుడు ఎండిపోయిందని దీనికి కారకులెవరో గుర్తించాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ. వారికి పింఛన్ తీసుకొచ్చా.. వారందరూ భారాస అండగా నిలవాలని కోరారు. జగిత్యాలకు వైద్య కళాశాల వస్తదని ఎప్పుడన్నా ఊహించారా.. అది సాకారం చేశామని గుర్తు చేశారు. నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, పెద్దపల్లి భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరారు.
మాట్లాడుతున్న కేసీఆర్, చిత్రంలో అభ్యర్థులు కొప్పుల ఈశ్వర్, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు కె.సంజయ్, ఎం.సంజయ్కుమార్
సైడ్లైట్స్..
- హుజూరాబాద్ టైగర్ అని కౌశిక్రెడ్డిని కేసీఆర్ పేర్కొన్న సమయంలో నాయకులు, కార్యకర్తలు ఈలలు, చప్పట్లతో సందడి చేశారు.
- బస్సులో కేసీఆర్తోపాటు భారాస మూడు నియోజకవర్గాల అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు కూర్చున్నారు.
- నిర్ణీత సమయానికన్నా రెండు గంటల ఆలస్యంగా జగిత్యాలకు కేసీఆర్ చేరుకున్నప్పటికీ జనం భారీ సంఖ్యలో పాత బస్టాండ్ వద్ద గుమిగూడారు.
- హుజూరాబాద్కు మరొక్కసారి వచ్చి 24 గంటలపాటు ఇక్కడే ఉండి స్థానికులందరిని కలుస్తానన్నారు. పాడి కౌశిక్రెడ్డికి మంచి భవిష్యత్తు ఉందన్నారు.
- జగిత్యాలలో బస్సు యాత్ర దాదాపు గంటపాటు కొనసాగింది. కేసీఆర్ను సీఎం, సీఎం అనే నినాదాలు చేస్తూ పార్టీ కార్యకర్తలు అభిమానాన్ని చూపించారు.
జగిత్యాలలో రోడ్షోకు హాజరైన జనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు
[ 18-05-2024]
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం స్వామివారికి చందనోత్సవాన్ని నిర్వహించారు. -
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు