logo

దేశానికి మోదీతోనే భద్రత

భారత దేశానికి ప్రధాని నరేంద్రమోదీతోనే భద్రత సాధ్యమని నిజామాబాద్‌ భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ అన్నారు. బుధవారం రాత్రి కోరుట్ల పట్టణంలోని కార్గిల్‌చౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్‌ సమావేశంలో మాట్లాడారు.

Published : 09 May 2024 04:54 IST

నిజామాబాద్‌ భాజపా అభ్యర్థి అర్వింద్‌

కోరుట్ల, న్యూస్‌టుడే: భారత దేశానికి ప్రధాని నరేంద్రమోదీతోనే భద్రత సాధ్యమని నిజామాబాద్‌ భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ అన్నారు. బుధవారం రాత్రి కోరుట్ల పట్టణంలోని కార్గిల్‌చౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్‌ సమావేశంలో మాట్లాడారు. నిషేధిత సంస్థలు కాంగ్రెస్‌ పార్టీకి బహిరంగంగా మద్దతు తెలుపుతున్నాయని, మనందరం మేల్కోనాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీఏఏపై కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయం చెప్పడం లేదని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి అధికారంలోకి రాగానే దేశమంతటికి ఒకే చట్టం వర్తింప చేస్తారన్నారు. కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ సామాజిక వర్గం వారంతా ఏవిధంగా విధ్వంసం సృష్టించారో మనందరం చూశామన్నారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు అమలులో పూర్తిగా విఫలమైందన్నారు.  


ఉగ్రవాదులకు కాంగ్రెస్‌ మద్దతు

జగిత్యాల : దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఉగ్రవాదులకు కాంగ్రెస్‌ మద్దతునిస్తోందని నిజామాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. బుధవారం రాత్రి జగిత్యాల అన్నపూర్ణచౌరస్తాలో కార్నర్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో మూడోసారి నరేంద్రమోదీ ప్రధాని కావడం ఖాయమని భాజపాను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందన్నారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, జిల్లా భాజపా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణరావు, భాజపా రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు డాక్టర్‌ శ్రావణి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి మదన్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని