ఇనుప ఖనిజం ఎగుమతికి అనుమతి
బళ్లారి, చిత్రదుర్గం, తుమకూరు జిల్లాల నుంచి ఇనుప ఖనిజం ముడిసరకు ఎగుమతికి అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో గనుల ఖిల్లా అఖండ బళ్లారి జిల్లాలో మళ్లీ ఉపాధి అవకాశాలపై ఆశలు చిగురిస్తున్నాయి. 2011లో కేంద్రం సిఫార్సు మేరకు ఈ మూడు జిల్లాలో గనుల కార్యకలాపాలను సుప్రీం కోర్టు నిలిపివేసింది
కార్మికులకు ఉపాధి అవకాశాలు
సండూరులోని ఓ గనుల ప్రాంతం (పాతచిత్రం)
కేంద్రం నియమాలు పాటించాల్సిందే..
బళ్లారి, చిత్రదుర్గం, తుమకూరు జిల్లాలోని గనులను ఏ, బీ, సీ శ్రేణులుగా విభజించారు. ఇందులో ఏ శ్రేణి గనులు 45, బీ శ్రేణి 70గా, సీ శ్రేణి 51గా కేంద్రం తేల్చిచెప్పింది. ఏ, బీ శ్రేణి గనులకు క్లీన్ చిట్ ఇచ్చారు. సీ శ్రేణి గనుల్లోనే ఎక్కువ అక్రమాలకు పాల్పడిందని తేల్చి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ గనులకు సంబంధించి జరిగిన అక్రమాల్లో చాలా మంది ప్రజాప్రతినిధులు జైలుపాలై, నేటికీ కేసులు ఎదుర్కొంటున్నారు. గనుల మూతతో కర్ణాటకలో ఉక్కు ఉత్పత్తి పడిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లక్రితం సుప్రీంకోర్టుకు విన్నవించుకోగా, పునరుద్ధరణ, పునర్నిర్మాణ (ఆర్అండ్ఆర్) పనులను పడక్బందీగా పూర్తి చేసిన వారికి మళ్లీ అనుమతి ఇవ్వొచ్చని కోర్టు తేల్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం బళ్లారి జిల్లాలో 25 దాకా గనులు మళ్లీ నడుస్తున్నాయి. సీ శ్రేణి గనులను ప్రభుత్వం వేలం వేయడంతో జిందాల్, ఎమ్మెస్పీఎల్ సంస్థలు వాటిని దక్కించుకున్నాయి. గనుల విస్తీర్ణం మేరకు వాటికి వార్షికంగా ఇంతే మెట్రిక్ టన్నుల ఖనిజం తవ్వి తీయాలని నిబంధనలు విధించారు. కానీ సరకును ఇండియాలోనే విక్రయించాలన్న గట్టి నిబంధనలు అమలు చేశారు. 2011కన్నా పూర్వం ఇక్కడి ముడిసరకు చైనాకు తరలివెళ్లేది. సుప్రీం కోర్టు కొరడా అనంతరం దేశం దాటలేదు. ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేయవచ్చని నిబంధనలను సడలించారు. ఎగుమతిలో కేంద్ర ప్రభుత్వ నియమాలను పాటించాలని సూచించింది.
విదేశాలకు తరలింపు తేలికైన పనికాదు..
‘ప్రస్తుతం మన దేశంలోనే టన్ను ముడి సరకు రూ.3 నుంచి రూ.5వేల దాకా నాణ్యతనుబట్టి విక్రయిస్తున్నారు. ఇప్పుడు విదేశాలకు ఎగుమతికి అనుమతి ఇచ్చారు. రాజస్వం, పన్నులను చెల్లించి విదేశాలకు తరలించడం అంత సులభం కాదు. ఇప్పుడు చైనాలో కూడా ఇక్కడి ఇనుప ఖనిజానికి అంతగా డిమాండు లేదు. ఎగుమతికి అనుమతి ఇవ్వడం సంతోషదాయకమే. కానీ తరలింపులో పలు ఇబ్బందులు ఉన్నాయని హొసపేటెలోని ఓ ప్రముఖ గనుల సంస్థ ఇంజినీరు పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో ఇక్కడి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం