logo

కాంగ్రెస్‌లోకి కోలారు నేతలు

కోలారు జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యుడు కొత్తూరు మంజునాథ్‌ (ముళబాగిలు), డాక్టర్‌ ఎం.సి.సుధాకర్‌ (చింతామణి) బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ ఇద్దరూ బుధవారం దిల్లీలో కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌గాంధీ,

Published : 30 Jun 2022 00:46 IST

రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కొత్తూరు మంజునాథ్‌, ఎంసీ సుధాకర్‌ తదితరులు

చింతామణి, యశ్వంతపుర, చింతామణి, న్యూస్‌టుడే : కోలారు జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యుడు కొత్తూరు మంజునాథ్‌ (ముళబాగిలు), డాక్టర్‌ ఎం.సి.సుధాకర్‌ (చింతామణి) బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ ఇద్దరూ బుధవారం దిల్లీలో కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌గాంధీ, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ఎంసీ వేణుగోపాల్‌, రణదీప్‌సింగ్‌ సుర్జేవాలా సమక్షంలో కాంగ్రెస్‌ పతాకాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు రమేష్‌కుమార్‌, నాసీర్‌ అహ్మద్‌, శివశంకర్‌రెడ్డి, నంజేగౌడ, అనిల్‌కుమార్‌, నారాయణస్వామి, శ్రీనివాస్‌గౌడ తదితరులు పాల్గొన్నారు.

* ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆగస్టు 3న రాష్ట్రానికి రానున్నారు. ఆరోజు దావణగెరెలో నిర్వహించే ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య 75వ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటారు. ఓ బహిరంగ సభలోనూ ప్రసంగిస్తారు. ‘నా మిత్రులు, అభిమానులు అక్కడే పుట్టిన రోజు వేడుకలు చేయాలని నిర్ణయించారు. ఆ కార్యక్రమానికి మీరూ వస్తే బాగుంటుందని రాహుల్‌గాంధీకి సూచించా. ఆయన పెద్ద మనసుతో ఒప్పుకొన్నారు’ అని సిద్ధరామయ్య వివరించారు. పార్టీ తరఫున ఆరోజు జనసేకరణకూ ముందడుగు వేసే అవకాశాలున్నాయని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని