జెండా పండుగకు ఘనంగా ఏర్పాట్లు
స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలికె ఏర్పాట్లలో మునిగిపోయింది. ఎంజీ రోడ్డు మాణిక్షా సైనిక మైదానంలో ఆ ఏర్పాట్లు చేస్తున్నారు.
మాణిక్ షా మైదానం గోడలకు రంగులు వేస్తున్న కార్మికులు
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలికె ఏర్పాట్లలో మునిగిపోయింది. ఎంజీ రోడ్డు మాణిక్షా సైనిక మైదానంలో ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏటా పాలికె, బెంగళూరు నగర జిల్లాధికారులు సంయుక్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటి నిర్వహణ కోసం నిపుణులతో కూడిన మూడు సమితులను ఏర్పాటు చేశారు. సైనిక దళాలు, పోలీసులు, విద్యార్థులు కవాతు నిర్వహిస్తారని పాలికె చీఫ్ కమిషనర్ తుషార్గిరినాథ్ తెలిపారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవం సందర్భంగా పది లక్షల మందికి జాతీయ జెండాలను విక్రయిస్తారు. మాణిక్షా కార్యక్రమాన్ని వీక్షించేందుకు 25 వేల మందికి అవకాశం కల్పిస్తారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల విజయవతంఆనికి పాలికె పరిధిలోని విద్యా సంస్థల సాయం తీసుకుంటారు. రెండువేల మంది విద్యార్థులు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలకు సహకరిస్తారు.
మైదానంలో జోరుగా స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లు
త్రివర్ణ పతాకాలు ఎగురవేసేది వీరే!
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : పంద్రాగస్టుకు విజయనగర జిల్లాలో పర్యాటక శాఖ మంత్రి ఆనంద్సింగ్ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. కొప్పళ జిల్లాలో దేవాదాయ శాఖ మంత్రి శశికళ జొల్లె అణ్ణా సాహేబ, మండ్య జిల్లాలో రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ జెండా పతాకావిష్కరణలో ముందు వరుసలో నిలుస్తారు. ఇతర జిల్లాలకు వ్యవహారాల బాధ్యులుగా ఉన్న మంత్రులే ధ్వజారోహణ చేస్తారని, ఒక వేళ అనారోగ్యం, ఇతర కారణాలతో సంబంధిత మంత్రి గైర్హాజరయితే ఆయా జిల్లాలకు చెందిన జిల్లాధికారులే జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.