రాజధాని.. ఒడ్డున పడేనా?
రాజధాని నగరం జులై నుంచి సెప్టెంబరు వరకు కురిసిన వర్షాలకు నిండా మునిగి.. కోలుకోలేని నష్టాన్ని మూటగట్టుకుంది. రహదారులు, పాదచారి మార్గాలకు సంబంధించి మాత్రమే రూ.336 కోట్ల నష్టం వాటిల్లినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలికె అధికారులు అంచనా వేశారు. నగరవ్యాప్తంగా 396
మురికివాడల్లో ఎదురైన ఇక్కట్లపై ‘లెక్క’ తేలేదెన్నడు?
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : రాజధాని నగరం జులై నుంచి సెప్టెంబరు వరకు కురిసిన వర్షాలకు నిండా మునిగి.. కోలుకోలేని నష్టాన్ని మూటగట్టుకుంది. రహదారులు, పాదచారి మార్గాలకు సంబంధించి మాత్రమే రూ.336 కోట్ల నష్టం వాటిల్లినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలికె అధికారులు అంచనా వేశారు. నగరవ్యాప్తంగా 396 కిలోమీటర్ల పొడవైన రహదారులు పాడైనట్లు గుర్తించారు. గుంతలు పడిన చోట్ల వాహన సంచారం కష్టంగా మారింది. వాటిని తక్షణం మరమ్మతు చేయించాలంటే కనీసం రూ.100 కోట్లు అవసరమని అధికారులు వెల్లడించారు. 7941 నివాస గృహాలు ముంపుపాలైనా.. వాటి నష్టాన్ని ఇంకా లెక్కించలేదు. ఇళ్లలో తడిసిన ఆహార ధాన్యాలు, దుస్తులు లెక్కించి ఇంటికి రూ.10 వేలు చొప్పున రూ.13.63 కోట్ల పరిహారం అందించారు. కార్లు, ద్విచక్రవాహనాలు, టీవీలు, ఫ్రిజ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల నష్టాన్ని లెక్కించలేదని అధికారులు తెలిపారు. విల్లాలు, అపార్ట్మెంట్లలో రెండు మూడు రోజులపాటు కార్లన్నీ నీటిలో మునిగాయి. ఆ వాహనాల పునఃవినియోగానికి వీలుకాదు. సామాన్యంగా నగరంలో ఏడాదికి 70 నుంచి 80 రోజుల పాటు వర్షం కురుస్తుంది. ఈఏడాది గతంలో ఎప్పుడు లేని విధంగా 145 రోజులు వానదేవుడు తిష్టవేశాడు. చెరువులు పూర్తిగా నిండి అలుగులు పారాయి. లోతట్టు ప్రదేశాలు ముంపుపాలయ్యాయి. గురురాజ లేఔట్, యమలూరు, బెళత్తూరు, దక్షిణ పినాకిని, సాదరమంగల, బసవణ్ణనగర, చెన్నప్పనహళ్లి, మున్నెకోళలు, శాంతినికేతన్ లేఔట్, పాపయ్యరెడ్డి లేఔట్, వాగ్దేవి లేఔట్, చెన్నసంద్ర ప్రధాన రహదారి, సాయి లేఔట్, పై లేఔట్, గెద్దలహళ్లి, రైల్వే కింద వంతెన, వడ్డరపాళ్య, రెయిన్ బో లేఔట్, సన్నిబ్రూక్స్ లేఔట్, డియో లేఔట్, అనుగ్రహ లేఔట్, వాజపేయి నగర, రామయ్య నగర, ఇబ్బలూరు, మంగమ్మనపాళ్య, హొంగసంద్ర, బిళేకహళ్లి, అరెకెరె, ఫయాజాబాద్, యలచేనహళ్లి ఈ ముంపు కారణంగా నష్టపోయినట్లు ప్రాథమికంగా గుర్తించినా.. నష్టం అంచనాలకు అందనదిగా భావిస్తున్నారు. రాజకాలువల ఆక్రమణలు తొలగించి కాలువ మరమ్మతులకు రూ.300 కోట్లు వ్యయం చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.
విల్లాలు మునిగినా.. నష్ట లెక్కింపులో ఇంకా జాప్యమే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం