logo

గొంతులు కోసి.. దంపతుల హత్య

ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులను దుండగులు గొంతు కోసి కడతేర్చిన సంఘటన చిత్రదుర్గ జిల్లా హొసదుర్గంలో సంచలనం రేపింది.

Published : 03 Dec 2022 00:37 IST

ప్రభాకరశెట్టి, విజయలక్ష్మి (పాతచిత్రం)

చిత్రదుర్గం, న్యూస్‌టుడే : ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులను దుండగులు గొంతు కోసి కడతేర్చిన సంఘటన చిత్రదుర్గ జిల్లా హొసదుర్గంలో సంచలనం రేపింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసు అధికారులు వెల్లడించారు. వారందించిన సమాచారం ప్రకారం.. హొసదుర్గం శివారు వినాయకనగర్‌లో ప్రభాకరశెట్టి (75), ఆయన భార్య విజయలక్ష్మి (67) నివాసం ఉండేవారు. వారి సంతానం వృత్తిరీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఇంట్లో ఇద్దరే ఉన్నారన్న విషయం గుర్తించిన దుండగులు గురువారం రాత్రి ఆ ఇంట్లోకి ప్రవేశించారు. పదునైన ఆయుధంతో వారి గొంతులు కోసేశారు. ఇంటి నుంచి సుమారు 200 మీటరర్ల దూరం వరకు రక్తపుమరకలు కనిపిస్తున్నాయి. దుండగులు ఏమైనా ఎత్తుకెళ్లారా? ఆస్తుల వివరాలేంటి? ఇది ఎవరి పని? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని