గొంతులు కోసి.. దంపతుల హత్య
ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులను దుండగులు గొంతు కోసి కడతేర్చిన సంఘటన చిత్రదుర్గ జిల్లా హొసదుర్గంలో సంచలనం రేపింది.
ప్రభాకరశెట్టి, విజయలక్ష్మి (పాతచిత్రం)
చిత్రదుర్గం, న్యూస్టుడే : ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులను దుండగులు గొంతు కోసి కడతేర్చిన సంఘటన చిత్రదుర్గ జిల్లా హొసదుర్గంలో సంచలనం రేపింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసు అధికారులు వెల్లడించారు. వారందించిన సమాచారం ప్రకారం.. హొసదుర్గం శివారు వినాయకనగర్లో ప్రభాకరశెట్టి (75), ఆయన భార్య విజయలక్ష్మి (67) నివాసం ఉండేవారు. వారి సంతానం వృత్తిరీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఇంట్లో ఇద్దరే ఉన్నారన్న విషయం గుర్తించిన దుండగులు గురువారం రాత్రి ఆ ఇంట్లోకి ప్రవేశించారు. పదునైన ఆయుధంతో వారి గొంతులు కోసేశారు. ఇంటి నుంచి సుమారు 200 మీటరర్ల దూరం వరకు రక్తపుమరకలు కనిపిస్తున్నాయి. దుండగులు ఏమైనా ఎత్తుకెళ్లారా? ఆస్తుల వివరాలేంటి? ఇది ఎవరి పని? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు