logo

కుక్కర్‌ బాంబు నిందితుడి ఆరోగ్యం మెరుగు

మంగళూరు కంకనాడి సమీపంలో కుక్కర్‌ బాంబు పేలుడు ఘటనలో ఒళ్లు కాల్చుకున్న అనుమానిత తీవ్రవాది మహ్మద్‌ షారిఖ్‌ పూర్తిగా కోలుకున్నాడు.

Published : 29 Jan 2023 04:02 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : మంగళూరు కంకనాడి సమీపంలో కుక్కర్‌ బాంబు పేలుడు ఘటనలో ఒళ్లు కాల్చుకున్న అనుమానిత తీవ్రవాది మహ్మద్‌ షారిఖ్‌ పూర్తిగా కోలుకున్నాడు. ఆ వ్యక్తికి బెంగళూరు విక్టోరియా ఆసుపత్రిలో గత నెల ప్లాస్టిక్‌ సర్జరీ, మరికొన్ని శస్త్రచికిత్సలను నిర్వహించారు. పూర్తి పోలీసు భద్రత మధ్య, ప్రత్యేక వార్డులో చికిత్స అందించారు. కాలిన గాయాలన్నీ పూర్తిగా నయమయ్యాయి. కొన్ని చిన్నగాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. వచ్చే వారం అతన్ని ఆసుపత్రి నుంచి డిస్‌ఛార్జ్‌ చేయనున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు జాతీయ తనిఖీ దళం అధికారులు సన్నాహాలు చేసుకున్నారు. ఎన్‌ఐఏ అధికారులు బెంగళూరులోనే షారిఖ్‌ను విచారణ చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని