కలం ఎక్కుపెడితేనే సమస్యల పరిష్కారం
పాత్రికేయులు ప్రాంతాలకు పరిమితం కావద్దని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పిలుపునిచ్చారు. అఖండ కర్ణాటకలోని సమస్యలను గుర్తించి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు.
కారజోళతో కలిసి జ్యోతి వెలిగిస్తున్న ముఖ్యమంత్రి
విజయపుర, న్యూస్టుడే : పాత్రికేయులు ప్రాంతాలకు పరిమితం కావద్దని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పిలుపునిచ్చారు. అఖండ కర్ణాటకలోని సమస్యలను గుర్తించి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే సరిపోదని, రాష్ట్రమంతా ప్రగతి సాధించాలని అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన 37వ పాత్రికేయుల రాష్ట్ర సమ్మేళనాలలో సీనియర్ పాత్రికేయులు బీఎన్ మల్లేశ్, సుకన్య, శంకర పాగోజీలను సత్కరించి మాట్లాడారు. విలేకరులు, రాజకీయ నాయకులు ఒకరితో మరొకరు అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటారని విశ్లేషించారు. ప్రజల అభిప్రాయాలను నాయకులకు- నాయకుల ప్రకటనలను ప్రజలకు చేరవేర్చడంలో కీలక పాత్రను పోషిస్తుంటారని చెప్పారు. నిజాయితీతో వ్యవహరించే పాత్రికేయులు, నాయకులను మాత్రమే ప్రజలు అభిమానించి, గౌరవిస్తారని తెలిపారు. మారుతున్న కాలంలో ప్రతి పాఠకుడూ పాత్రికేయునిగా మారిపోయేందుకు సామాజిక మాధ్యమాలు సహకరిస్తున్నాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పాత్రికేయుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. విలేకరుల సంఘం ప్రతినిధులు పూర్తి వివరాలు అందిస్తే వారికి బస్సు పాసులను కేటాయించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని తెలిపారు. విశ్రాంత పాత్రికేయులకు ఇస్తున్న పింఛను పెంచడానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దేశానికి అన్నాన్ని అందించే రాష్ట్రంగా కర్ణాటక అభివృద్ధి చెందేలా ప్రభుత్వానికి విలేకరులు సూచనలు ఇవ్వాలని కోరారు. విజయపుర జిల్లా మొదటి నుంచి తనదైన ప్రత్యేకతను కాపాడుకుంటూ వస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. పాలకులకు వివేచన ఉంటే తక్షణమే ఆ సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు పెద్ద పీట వేస్తారని పేర్కొన్నారు. విలేకరులకు ఇళ్ల స్థలాలు, పాత్రికేయుల భవన్ల నిర్వహణ, యశస్విని పథకం పరిధిలోకి కలం వీరులను తీసుకు రావడం, ఇతర సదుపాయాలకు సంబంధించి సంఘం ప్రతినిధులు సీఎంకు వినతిపత్రాన్ని అందించారు. మంత్రులు సీసీ పాటిల్, గోవింద కారజోళ, మురుగేశ నిరాణి, సంఘం అధ్యక్షుడు శివానంద తగడూరు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం