టెకీ కలల వాహనం అదిగో!
ఐటీ, బీటీ కారిడార్గా ప్రఖ్యాతి పొందిన ప్రదేశాలకు మెట్రో రైలు పరుగులు తీయనుంది. ఈ మార్గంలో సేవలను శనివారం అందుబాటులోకి తెస్తారు.
విద్యుత్తు కాంతులతో వైట్ఫీల్డ్ స్టేషన్
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : ఐటీ, బీటీ కారిడార్గా ప్రఖ్యాతి పొందిన ప్రదేశాలకు మెట్రో రైలు పరుగులు తీయనుంది. ఈ మార్గంలో సేవలను శనివారం అందుబాటులోకి తెస్తారు. వైట్ఫీల్డ్- కేఆర్పురం మధ్య 13.77 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. నూతన నిర్మాణంలో లోపాలేవీ లేకుండా పక్షం రోజులుగా నిపుణులు సరిచూశారని బీఎంఆర్సీఎల్ అధికారులు వివరించారు. కేంద్ర మెట్రో రైలు సురక్షిత ప్రాధికార కమిషన్ చేసిన సూచనల నేపథ్యంలో పలు సవరణలు చేశారు. జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వైట్ఫీల్డ్కు చేరుకుని.. ఇక్కడి మెట్రో స్టేషన్, రైలు సంచారాన్ని ప్రారంభిస్తారు. ఆ ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేసి విద్యుత్తు దీపాలతో అలంకరించారు. వైట్ఫీల్డ్ నుంచి కేఆర్పురం మార్గంలో బెన్నిగానహళ్లి, గరుడాచార్యపాళ్య, కె.ఆర్.పురం, హుడీ, మహదేవపుర, సీతారామాపాళ్య, కుందనహళ్లి, నల్లూరుహళ్లి, సత్యసాయి ఆసుపత్రి, పట్టందూరు అగ్రహార, కాడుగోడి, చెన్నసంద్ర, వైట్ఫీల్డ్ మెట్రో స్టేషన్లకూ వన్నెలద్దారు. వంతెనల కింద మొక్కలు నాటారు. స్తంభాలకు చక్కని రంగులు వేశారు. పాదచారులు రహదారి దాటేందుకు ఏర్పాట్లున్నాయి. ఈ మార్గంలో రైలు 70 కిలోమీటర్ల వరకు వేగంతో పరుగులు తీస్తుంది. మలుపుల వద్ద ఈ వేగాన్ని 40 కిలోమీటర్లకే పరిమితం చేస్తామని అధికారులు తెలిపారు. తెల్లవారు జామున ఐదింటి నుంచి రాత్రి 11 వరకు నాజూకు వాహనం ప్రతి ఐదు నిమిషాలకు ఓసారి ఆయా ప్రాంగణాలకు వచ్చి వాలుతుంది. రెండు స్టేషన్ల మధ్య సంచార సమయాన్ని 22 నిమిషాలుగా అంచనా వేస్తున్నారు. ప్రయాణ ఛర్జి రూ.35గా నిర్ణయించారు. 26న ప్రయాణికుల కోసం ద్వారాలు తెరుస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు