నగరం.. అష్టదిగ్బంధం
నగర పోలీసు కమిషనరేట్, బెంగళూరు నగర జిల్లా పరిధిలోని 32 విధానసభ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఐదు ప్రదేశాల్లో శనివారం ఉదయం ప్రారంభం కానుంది.
బెంగళూరు : బీఎంఎస్ కళాశాల వెలుపల భద్రత. సిబ్బందితో చర్చిస్తున్న ఉన్నతాధికారులు
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : నగర పోలీసు కమిషనరేట్, బెంగళూరు నగర జిల్లా పరిధిలోని 32 విధానసభ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఐదు ప్రదేశాల్లో శనివారం ఉదయం ప్రారంభం కానుంది. ప్రతి లెక్కింపు కేంద్రం భద్రత బాధ్యతలను ఇద్దరు డీసీపీలకు అప్పగించారు. అధికారులతో పాటు 1500 వందల మంది బందోబస్తు కోసం వినియోగించనున్నట్లు పోలీసు కమిషనర్ ప్రతాప్రెడ్డి తెలిపారు. శాంతిభద్రతలకు ఎలాంటి ముప్పు కలగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.
* నగర తూర్పు, పడమటి విభాగాల అదనపు పోలీసు కమిషనర్లు, పది మంది డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 38 మంది ఇన్స్పెక్టర్ల, 250 పీఎస్ఐలు, 1200 వందల మంది పోలీసు కానిస్టేబుళ్లుతో పాటు 12 కేంద్ర పారామిలటరీ దళాలు, 36 రాష్ట్ర రిజర్వుడ్ పోలీసు దళాలను బందోబస్తు కోసం వినియోగించనున్నారు. ప్రతి లెక్కింపు కేంద్రం వద్ద ముగ్గురు ఏసీపీలు, ఆరుగురు ఇన్స్పెక్టర్లు, 50 మంది పీఎస్ఐలు మూడు వందల మంది పోలీసు సిబ్బంది భద్రత కోసం ఏర్పాటు చేశారు.
లెక్కింపు ప్రాంతాలు ఎక్కడెక్కడంటే?
* వసంతనగర మౌంట్ కార్మల్ కళాశాలలో కె.ఆర్.పురం, మహాలక్ష్మీలేఔట్, మల్లేశ్వరం, హెబ్బాళ్, పులికేశినగర, సర్వజ్ఞనగర, సీవీరామన్నగర విధానసభ స్థానాల ఓట్లు లెక్కిస్తారు. కేంద్ర, తూర్పు విభాగాల డీసీపీలకు భద్రత బాధ్యతలను అప్పగించారు.
* సెయింట్ జోసెఫ్ ఇండియన్ హైస్కూల్లో ఆనేకల్, బెంగళూరు దక్షిణ, మహదేవపుర, బ్యాటరాయనపుర, యలహంక, దాసరహళ్లి విధానసభ స్థానాల ఓట్లను లెక్కిస్తారు. వైట్ఫీల్డ్, సీసీబీ విభాగం డీసీపీలకు భద్రత ఏర్పాట్లను పర్వేక్షిస్తారు.
* బసవనగుడి బీఎంఎస్ మహిళ కళాశాలలో శాంతినగర, గాంధీనగర, రాజాజినగర, చిక్కపేట, చామరాజపేట, ఆర్ఆర్నగర, శివాజీనగర విధానసభ స్థానాల ఓట్లను లెక్కిస్తారు. దక్షిణ విభాగం, కమాండ్ సెంటర్ డీసీపీలు భద్రత బాధ్యతలను అప్పగించారు.తిలక్నగర్ ఎస్ఎస్ఎంఆర్వీ కళాశాలలో పద్మనాభనగర, గోవిందరాజనగర, విజయనగర, జయనగర, బీటీఎంలేఔట్, బొమ్మనహళ్లి, బసవనగుడి విధానసభ స్థానాల ఓట్లను లెక్కిస్తారు. ఆగ్నేయ, సీఏఆర్ విభాగాల ఇద్దరు డీసీపీలు బందోబస్తు ఏర్పాట్లను పర్వేక్షిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిషత్తు పోరులోనూ కాసుల మాటే !
[ 19-05-2024]
విధానపరిషత్తు అంటే పెద్దలు చర్చించుకునే సభ! ప్రభుత్వాలు రూపొందించే బిల్లులు మేధావుల చర్చల తర్వాతనే గవర్నర్ చెంతకు చేరుతాయి. -
ప్రజ్వల్ తప్పించుకోలేడు
[ 19-05-2024]
మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై చర్యలకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ అభిప్రాయపడ్డారు. -
ఇస్రో.. ఉద్యోగావకాశాల గని!
[ 19-05-2024]
ప్రపంచమంతా నివ్వెరపోయి చూస్తున్న భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నేడు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని విజయాలు సాధిస్తోంది. -
ప్రధాని వ్యాఖ్యలు షాకిచ్చాయి
[ 19-05-2024]
మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించటం వల్ల మెట్రోకు నష్టం వాటిల్లుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు షాక్కు గురి చేశాయని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. -
‘డీకేపై అర్థరహిత ఆరోపణలు’
[ 19-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన పెన్డ్రైవ్ పంపిణీ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి పాత్ర ఉందంటూ చెబితే రూ.100 కోట్లు ఇస్తామని కాంగ్రెస్ నేతలు ఆశ చూపించారంటూ భాజపా నేత దేవరాజేగౌడ -
ఆటవిడుపు
[ 19-05-2024]
నిత్యం సభలు, సమావేశాలు, పర్యటనలతో గడిపే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన మంత్రివర్గ సహచరులు కొందరు శనివారం తీరక చేసుకున్నారు. -
‘ఐస్క్రీమ్ మ్యాన్’ ఇకలేరు
[ 19-05-2024]
ఐస్క్రీముల రాజధాని మంగళూరులో ‘ఐస్క్రీమ్ మ్యాన్’గా గుర్తింపు దక్కించుకున్న రఘునందన్ కామత్ (70) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. -
ట్రాక్టర్ను ఢీకొన్న బస్సు
[ 19-05-2024]
ట్రాక్టర్ను బస్సు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు హులిగమ్మ భక్తులు దుర్మరణం పాలయ్యారు.