అమ్మా.. అమ్మా.. నీకేం కాదమ్మా: గుండెల్ని మెలిపెట్టిన బాలుడి తాపత్రయం
‘అమ్మా, అమ్మా.. ఏం కాదమ్మా, నీకేం కాదమ్మా.. అంకుల్ కాస్త నీళ్లుంటే ఇవ్వరా! అమ్మ జుత్తు పైకని కాస్త కడగరా.. ఏమనుకోకండి అంకుల్.. ప్లీజ్ అంకుల్.. ప్లీజ్’’ అంటూ ఓ 12 ఏళ్ల బాలుడు పడ్డ తాపత్రయం గుండెల్ని మెలిపెట్టింది.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ
మణుగూరు పట్టణం, న్యూస్టుడే: ‘‘అమ్మా, అమ్మా.. ఏం కాదమ్మా, నీకేం కాదమ్మా.. అంకుల్ కాస్త నీళ్లుంటే ఇవ్వరా! అమ్మ జుత్తు పైకని కాస్త కడగరా.. ఏమనుకోకండి అంకుల్.. ప్లీజ్ అంకుల్.. ప్లీజ్’’ అంటూ ఓ 12 ఏళ్ల బాలుడు పడ్డ తాపత్రయం గుండెల్ని మెలిపెట్టింది. అపస్మారక స్థితిలో రోడ్డుపై పడి ఉన్న తండ్రి ఛాతీపై రక్తాన్ని దస్తీతో తుడుస్తూ, తల్లి వైపు పరుగులు పెడుతూ ఆమె ముఖంపై ధారాపాతంగా కారుతున్న నెత్తురును శుభ్రం చేస్తూ ‘అమ్మా నీకేం కాదంటూ’ ధైర్యం చెప్పాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ, తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ, చేతిలో ఉన్న ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చేందుకు చేసిన ప్రయత్నం అయ్యో పాపం అనిపించింది.
మణుగూరు మండలం విజయనగరం గ్రామం సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాద సమయంలో పరిస్థితి ఇది. శివలింగాపురం గ్రామానికి చెందిన కె.సత్యనారాయణ, భార్య, కుమారుడితో కలిసి స్కూటీపై కొండాయిగూడెం నుంచి మణుగూరు వెళ్తున్నారు. ఈ క్రమంలో లారీ, స్కూటీని అధిగమించబోయి గట్టిగా ఢీకొట్టింది. ప్రమాదంలో సత్యనారాయణతోపాటు, భార్య లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. కుమారుడు నవదీప్కి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని మణుగూరులోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం భద్రాచలం తరలించారు. సత్యనారాయణ ఓసీ-2లో సింగరేణి కార్మికుడు. ప్రమాద సమయంలో 12 ఏళ్ల నవదీప్ తల్లిదండ్రులు అచేతన స్థితిని చూసి తల్లడిల్లిపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434