మళ్లీ బయోమెట్రిక్
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానం తిరిగి పట్టాలెక్కనుంది. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి బయోమెట్రిక్ పద్ధతిని అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి అమలు
కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్టుడే
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానం తిరిగి పట్టాలెక్కనుంది. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి బయోమెట్రిక్ పద్ధతిని అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే ఈ పద్ధతిని కస్తూర్బాగాంధీ బాలికల జూనియర్ కళాశాలల్లో పకడ్బందీగా అమలు చేస్తుండటంతో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి.
కరోనాతో మూలకు...
బయోమెట్రిక్ విధానం అమలు అంశం 2016-17 విద్యా సంవత్సరంలోనే తెరపైకి వచ్చింది. విద్యార్థులతో పాటు అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి అధునాతన హాజరును అప్పుడే ప్రవేశపెట్టారు. కొన్నిచోట్ల యంత్రాలు కొద్దిరోజులకే మొరాయించడం, నిర్వహణలో సాంకేతిక లోపాలు తలెత్తడం వంటివి జరిగాయి. మూడేళ్ల తర్వాత కరోనా వైరస్ కారణంగా ప్రత్యక్ష తరగతులు నిలిచిపోయాయి. బయోమెట్రిక్ హాజరు మూలకు చేరింది. వినియోగం లేకపోవడం, కాలపరిమితి ముగియడంతో ఆ వ్యవస్థను గతేడాది నుంచి పూర్తిగా పక్కనబెట్టారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరం ఉభయ జిల్లాల్లోని 33 కళాశాలల్లో కొత్త యంత్రాలు బిగించారు. యూజర్ ఐడీ, పాస్వర్డ్లను కేటాయించారు. తొలి విడతగా ప్రిన్సిపల్స్, బోధన, బోధనేతర సిబ్బంది వేలిముద్రలు నమోదు ఇటీవల పూర్తయింది. నేటి నుంచి వీరంతా బయోమెట్రిక్ హాజరు వినియోగించుకోవాలి. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచి విద్యార్థులకూ అమలు చేసేలా కార్యాచరణ రూపొందించారు.
ఆలస్యానికి చెక్
చాలా కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది దూర ప్రాంతాల నుంచి కళాశాలలకు రాకపోకలు సాగిస్తున్నారు. కొందరు ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నారు. సమయపాలన పాటించకపోవడంతో తరగతుల నిర్వహణకు ఇబ్బంది కలుగుతోంది. మరికొందరు తరచూ బయటకు వెళ్లడం.. సొంత పనులు చక్కదిద్దుకురావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘బయోమెట్రిక్’ విధానం అమలుతో బోధన తీరు క్రమంగా మెరుగుపడుతుందని కళాశాలల నిర్వాహకులు భావిస్తున్నారు.
జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలు పనిచేసేలా ఏర్పాట్లు చేశాం. వేలిముద్రలతోనే హాజరు తీసుకోవాలని మండలి నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు కూడా ఈ విధానం అమలు చేస్తాం.’
సులోచనారాణి, డీఐఈవో, భద్రాద్రి కొత్తగూడెం
‘మా కళాశాలలో యంత్రాల ఏర్పాటు పూర్తయింది. నూతన హాజరు విధానంతో విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. విద్యార్థులకూ అమలు చేస్తే హాజరుశాతం మరింత పెరుగుతుంది. ఉత్తమ వార్షిక ఫలితాలు సాధించేందుకు వీలవుతుందని ఆశిస్తున్నాం.’
కత్తి రమేశ్, చుంచుపల్లి కళాశాల
‘రాష్ట్ర విద్యా మండలి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. బయోమెట్రిక్తో సిబ్బంది, విద్యార్థిలో క్రమశిక్షణ పెరుగుతుంది. తరగతుల పకడ్బందీగా నిర్వహించవచ్చు. మెరుగైన బోధనకు కొత్త హాజరు విధానం ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’.
కేఎస్ రామారావు, ఖమ్మం నయాబజార్ కళాశాల
జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలు పనిచేసేలా ఏర్పాట్లు చేశాం. వేలిముద్రలతోనే హాజరు తీసుకోవాలని మండలి నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు కూడా ఈ విధానం అమలు చేస్తాం.’
సులోచనారాణి, డీఐఈవో, భద్రాద్రి కొత్తగూడెం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం లోక్సభ స్థానంలో 16,31,039 మంది ఓటర్లు
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ల లెక్క తేలింది. తుది ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ శుక్రవారం ప్రకటించారు. -
తేలింది లెక్క.. హోరాహోరీ పక్కా!
[ 27-04-2024]
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. -
41 మంది నామపత్రాలు ఆమోదం: కలెక్టర్
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 41 మంది నామపత్రాలు ఆమోదం పొందాయని, నాలుగు తిరస్కరణకు గురైనట్లు ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ఇండియా కూటమిదే అధికారం: మంత్రి తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సూట్కేసులు సర్దుకొని వచ్చే వారిని నమ్మొద్దు: నామా
[ 27-04-2024]
సూట్కేసులు సర్దుకుని హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత వలస వెళ్లే వారి మాటలు నమ్మిమోసపోవద్దని భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాను గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు: తాండ్ర
[ 27-04-2024]
జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. -
అగ్రనేతల ఆగమనం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకొనేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు బహిరంగ సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు పూనుకుంటున్నారు. -
ఓటమిని విశ్లేషించు.. గెలుపు మార్గం అన్వేషించు
[ 27-04-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ విద్యార్థిని అనుత్తీర్ణత చెంది ప్రాణాలు తీసుకుంది. పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో మానసికంగా కుంగిపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరం. -
సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ
[ 27-04-2024]
ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే ప్రగతి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్సభ స్థానం సొంతం. -
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. -
ఘనంగా రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం
[ 27-04-2024]
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీసీతారాముల విగ్రహాలు, ధ్వజస్తంభం, నాభిశిల, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. -
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
66 నామినేషన్లు ఆమోదం.. తొమ్మిది తిరస్కరణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్